IND vs BAN: క్లీన్స్వీప్ గండం గట్టెక్కేనా..? టీమ్ఇండియాని గెలిపించేదెవరు?
బంగ్లాదేశ్తో వన్డే సిరీస్ ఎలాగూ పోయింది. కనీసం చివరి మ్యాచ్లోనైనా గెలిచి పరువు కాపాడాలని భారత్ అభిమానులు కోరుతున్నారు. అయితే కీలక ఆటగాళ్లు బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో రాణిస్తేనే ఇది సాధ్య పడుతుంది.
ఇంటర్నెట్ డెస్క్: వరుసగా రెండు ఓటములు.. ముగ్గురికి గాయాలు.. బంగ్లాదేశ్తో చివరి వన్డేకి ముందు టీమ్ఇండియా పరిస్థితి ఇదీ. సిరీస్లో నామమాత్రమైన మ్యాచ్ అయినప్పటికీ.. టెస్టులకు ముందు ఆత్మవిశ్వాసం ప్రోది చేసుకోవాలంటే భారత్ తప్పక గెలవాల్సిందే. విజయం చేరువగా వచ్చి బోల్తా పడిన జట్టును మూడో వన్డేలో గెలిపించే ఆటగాడు ఎవరు? బంగ్లా చేతిలో క్లీన్స్వీప్ కాకుండా పరువు కాపాడి ‘స్టార్’గా మారేది ఎవరు..? అనేది తెలియాలంటే శనివారం మ్యాచ్ వరకు ఆగాల్సిందే. ఈలోపు టీమ్ఇండియా పరిస్థితి ఎలా ఉందో ఓ సారి పరిశీలిద్దాం..
బ్యాటింగ్, బౌలింగ్ గురించి ఎలా మాట్లాడుకోవాలో కూడా తెలియని పరిస్థితి. బ్యాటింగ్ సంగతికొస్తే ఇద్దరు ముగ్గురు తప్పితే మిగతా వారు రాణించిందేమీ లేదు. రోహిత్ శర్మ గాయంబారిన పడటంతో శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ గెలుపు బాధ్యత తీసుకోవాలి. కెప్టెన్గా వ్యవహరించే కేఎల్ రాహుల్ జట్టు విజయం కోసం కీలక ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. శ్రేయస్ తన ఫామ్ను కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. చివరి వన్డేలో బ్యాటర్లు బాధ్యతతో గెలిపించాలి. అలాగే భారత బౌలర్లు ఇటు బ్యాటింగ్లోనూ కాస్త తమ సహకారం అందించాలి. రెండో వన్డేలో సిరాజ్ సింగిల్ తీయడానికే ఇబ్బంది పడాడ్డు. కీలకమైన సమయంలో రెండు ఓవర్లలో ఒక్క పరుగే రావడంతో రోహిత్ పోరాటం వృథా అయింది.
ఇంకా టీ20 ఫార్మాట్లోనే..
బౌలింగ్ గురించి చెప్పాల్సి వస్తే మనోళ్లు ఇంకా టీ20 ఫార్మాట్ నుంచి బయటపడినట్లు లేదు. తొలి 20 ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ వేస్తున్నారు. ప్రత్యర్థి జట్టుకు చెందిన ఐదారు వికెట్లను టపాటపా తీసేస్తారు. అయితే అక్కడ నుంచి పట్టు వదిలేస్తున్నారు. తొలి రెండు వన్డేల్లోనూ ఇలాగే జరిగింది. మొదటి వన్డేలో చివరి వికెట్ తీయడానికి నానా తంటాలు పడిన బౌలర్లు.. ఇక రెండో వన్డేలో అయితే ఏడో స్థానంలో వచ్చిన మెహిదీ హసన్ మిరాజ్తో సెంచరీ కొట్టించారు. ప్రత్యర్థి ‘తోక’ను కత్తిరించడంలో ఏమాత్రం తడబాటుకు గురి కాకుండా బౌలర్లు రాణించాలి. అలాగే ఫీల్డింగ్లోనూ తొలి వన్డే మాదిరిగా కాకుండా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలి.
20 నుంచి 14కి..
బంగ్లాదేశ్తో వన్డే సిరీస్కు ముందు దాదాపు భారత్కు 20 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉండేవారు. అందులో 15 మందితో కూడిన స్క్వాడ్ను మేనేజ్మెంట్ ప్రకటించింది. సంజూ శాంసన్, సూర్యకుమార్, రిషభ్ పంత్కు ముందే విశ్రాంతి ఇచ్చారు. తొలి వన్డేకు దూరమైన అక్షర్ పటేల్ రెండో మ్యాచ్ ఆడాడు. అయితే మూడో వన్డే నాటికి రోహిత్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్ గాయాలబారిన పడి వైదొలిగారు. దీంతో కుల్దీప్ యాదవ్ జట్టుతో చేరాడు. తుది జట్టులో యువ ఆటగాళ్లు రజత్, రాహుల్ త్రిపాఠి, షహబాజ్ అహ్మద్లో ఎవరికి చోటు దక్కేనో..?
భారత జట్టు ఇదే: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, శ్రేయస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, షహబాజ్ అహ్మద్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ యాదవ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు. -
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్
భారత మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ (Sachin Tendulkar) బర్త్ డే సందర్భంగా పెద్దఎత్తున శుభాకాంక్షలు వచ్చాయి. మాజీ క్రికెటర్లు ప్రత్యేకంగా పోస్టులు పెట్టారు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అత్యంత దారుణంగా ట్రోలింగ్కు గురైన కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya). ఏ మైదానంలో చూసినా అతడిని హేళన చేస్తూ ఫ్యాన్స్ హోరెత్తించారు. -
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
లఖ్నవూ చేతిలో చెన్నైకి వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఈసారి సొంత మైదానంలోనే పరాజయం పొందడంతో ఆ జట్టు అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. -
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
మరో మూడు రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ తన టీమ్ను వెల్లడించాడు. -
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
David Warner: దిల్లీ ఆటగాడు డేవిడ్ వార్నర్.. భారత గుర్తింపు కార్డు ఆధార్ కోసం పరిగెడుతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో అతడు హిందీలో మాట్లాడటం విశేషం. -
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
సెంచరీతో చెన్నైపై భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో లఖ్నవూ బ్యాటర్ స్టాయినిస్ కీలక పాత్ర పోషించాడు. ఒకదశలో ఓడిపోతామని భావించిన ఆ జట్టును చివరి వరకూ క్రీజ్లో ఉండి విజయతీరాలకు చేర్చాడు. -
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
చెన్నై కెప్టెన్ రుతురాజ్ సెంచరీతో అలరించినా.. లఖ్నవూ జట్టే విజయం సాధించింది. మార్కస్ స్టాయినిస్ కీలకమైన శతకంతో తన జట్టును గెలిపించాడు. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..