INDw Vs SLw: అమ్మాయిలు సాధించారు.. ఆసియా కప్ భారత్ సొంతం
ఆసియా కప్ ట్రోఫీని భారత మహిళల జట్టు మరోసారి ఒడిసిపట్టింది. ఫైనల్లో శ్రీలంకను చిత్తుచేసి సగర్వంగా ట్రోఫీని ముద్దాడింది. స్వల్ప లక్ష్య ఛేదనను అలవోకగా పూర్తి చేసింది. స్మృతి మంధాన అర్ధశతకంతో మెరిసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్ ఆసాంతం రాణించిన భారత మహిళల జట్టు.. ఫైనల్లోనూ చెలరేగింది. ప్రత్యర్థి శ్రీలంకను చిత్తుచేసి సగర్వంగా ట్రోఫీని ఎత్తుకుంది. చివరి పోరులో తిరుగులేని పై చేయి సాధించి చిరస్మరణీయ విజయం అందుకుంది. మొదట బౌలింగ్తో ప్రత్యర్థిని 65 పరుగులకే చుట్టేసిన అమ్మాయిల జట్టు.. ఆపై బ్యాటింగ్తోనూ విరుచుకుపడింది. లక్ష్యాన్ని కేవలం 8.3 ఓవర్లలోనే ఛేదించి 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. దీంతో భారత జట్టు ఆసియా కప్ను ఏడోసారి సొంతం చేసుకుంది.
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకకు ఆదిలోనే షాకులు తగిలాయి. ఓపెనర్లు ఇద్దరు ఆటపట్టు (6), అనుష్క సంజీవని (2) రనౌట్లతో వెనుదిరగడంతో ఆ జట్టు వికెట్ల పతనం మొదలైంది. బౌలర్లు రేణుకా సింగ్, రాజేశ్వరి గైక్వాడ్ ఏ బ్యాటర్ను కూడా క్రీజులో కుదురుకోనివ్వలేదు. ముఖ్యంగా రేణుక తన అత్యుత్తమ ఫామ్ను కొనసాగిస్తూ పేస్తో విరుచుకుపడింది. చివర్లో ఇనోకా రణవీర (18*), ఓషాది రణసింగె (13) మాత్రమే మోస్తరుగా రాణించడంతో లంక జట్టు ఆ మాత్రమైనా స్కోరు చేయగలిగింది. ఈ ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మిగతావారెవరూ క్రీజులో నిలవలేకపోయారు. రేణుక 3 వికెట్లు తీయగా.. గైక్వాడ్, స్నేహ్ రాణా తలో రెండు వికెట్లు పడగొట్టారు.
ఆపై బ్యాటింగ్కు వచ్చిన టీమ్ఇండియా స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. ముఖ్యంగా ఓపెనర్ స్మృతి మందాన (51*) ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడింది. 25 బంతుల్లోనే అర్థసెంచరీ సాధించింది. ఇన్నింగ్స్ 32 పరుగుల వద్ద షెపాలీ వర్మ (5), ఆపై జెమీమా రోడ్రిగెజ్ (2) ఔటైనా.. మందానా జోరు కొనసాగించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ (11*)తో కలిసి 9 ఓవర్లలోపే లక్ష్యాన్ని చేధించడంతో భారత శిబిరంలో సంబురాలు అంబరాన్నంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.