
IND vs WI : తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఇంటర్నెట్ డెస్క్ : వెస్టిండీస్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. విండీస్ నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో మూడు మ్యాచుల టీ20 సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. కెప్టెన్ రోహిత్ శర్మ (40) రాణించాడు. విండీస్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్ రెండు, ఫేబియన్ అలెన్, షెల్డన్ కాట్రెల్ తలో ఒక వికెట్ పడగొట్టారు.
స్వల్ప లక్ష్యంతో ఛేదనకు దిగిన భారత్కి రోహిత్ శర్మ (40: 19 బంతుల్లో 4×4, 3×6), ఇషాన్ కిషన్ (35: 42 బంతుల్లో 4×4) తో కలిసి శుభారంభాన్ని అందించాడు. రోహిత్ క్రీజులో ఉన్నంత సేపు బౌండరీలతో అలరించాడు. ఈ క్రమంలోనే రోస్టన్ ఛేజ్ వేసిన 8వ ఓవర్లో ఒడియన్ స్మిత్కి చిక్కి పెవిలియన్ చేరాడు. అప్పటికి భారత్ స్కోరు 64/1 గా ఉంది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ (17) స్వల్ప వ్యవధిలో వెనుదిరిగారు. రిషభ్ పంత్ (8) విఫలమయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ (34), వెంకటేశ్ అయ్యర్ (24) నిలకడగా ఆడుతూ భారత్ని విజయతీరాలకు చేర్చారు.
పూరన్ ఒక్కడే..
అంతకు ముందు బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే భువనేశ్వర్ కుమార్ విండీస్కు షాకిచ్చాడు. ఓపెనర్ బ్రెండన్ కింగ్ (4) సూర్యకుమార్ యాదవ్కి చిక్కి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ (61: 43 బంతుల్లో 4×4, 5×6)తో కలిసి ఓపెనర్ కైల్ మేయర్ (31: 24 బంతుల్లో 7×4) ధాటిగా ఆడాడు. ఈ క్రమంలోనే పవర్ ప్లే పూర్తయ్యే సరికి విండీస్ జట్టు 44/1 స్కోరుతో నిలిచింది. ఏడో ఓవర్లో కైల్ మేయర్ని యుజ్వేంద్ర చాహల్ ఎల్బీడబ్ల్యూ చేశాడు. ఆ తర్వాత రవి బిష్ణోయ్ ఒకే ఓవర్లో రోస్టన్ ఛేజ్ (4), రోమన్ పొవెల్ (2)లను వెనక్కి పంపి విండీస్ను దెబ్బ తీశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అకీల్ హోసీన్ (10) దీపక్ చాహర్కి రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అర్ధ శతకం పూర్తి చేసుకున్న తర్వాత నికోలస్ పూరన్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఒడియన్ స్మిత్ (4) ఆఖరు బంతికి క్యాచ్ ఔట్ అయ్యాడు. కీరన్ పొలార్డ్ (24) నాటౌట్గా నిలిచాడు. భారత బౌలర్లలో అరంగేట్ర ఆటగాడు రవి బిష్ణోయ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి విండీస్ను దెబ్బ తీశాడు. భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
agnipath: అగ్నివీరుల కోసం విశాఖలో ఎంపికలు!
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Business News
K Light 250V Motorcycle: కీవే నుంచి కె లైట్ 250వీ బైక్ @ రూ.2.89 లక్షలు
-
Sports News
IND vs ENG: టీమ్ఇండియాపై ఇంగ్లాండ్ విజయం.. సిరీస్ సమం
-
General News
Telangana News: ప్రకాశం బ్యారేజీ దిగువన ఆనకట్టల నిర్మాణంపై తెలంగాణ అభ్యంతరం
-
India News
Amarnath Yatra: అమర్నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్.. ప్రతికూల వాతావరణంతో అధికారుల నిర్ణయం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
- IND vs ENG : మొత్తం మారిపోయింది
- Raghurama: రఘురామ ఇంట్లోకి ప్రవేశించే యత్నంలో దొరికిపోయిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్!
- China’s real estate crisis: పుచ్చకాయలకు ఇళ్లు.. సంక్షోభంలో చైనా రియల్ ఎస్టేట్ ..!
- Double BedRooms: అమ్మకానికి.. రెండు పడక గదుల ఇళ్లు!
- Vishal: ఫైట్ సీన్స్ చేస్తుండగా కుప్పకూలిన హీరో విశాల్
- Emirates: గాల్లో విమానానికి రంధ్రం.. అలాగే 14 గంటల ప్రయాణం!
- IND vs ENG : టెస్టు క్రికెట్ చరిత్రలో టాప్-4 భారీ లక్ష్య ఛేదనలు ఇవే..!
- Hyderabad News: సాఫ్ట్వేర్ ఇంజినీర్ హత్యకు రూ.4.50 లక్షల సుపారీ!
- Anveshi Jain: ‘సీసా’ తో షేక్ చేస్తున్న అన్వేషి జైన్.. హుషారు వెనక విషాదం ఇదీ!