IND vs NZ: ఈడెన్లోనూ విజయమే.. టీమ్ఇండియా క్లీన్స్వీప్
మూడు టీ20ల సిరీస్ను భారత్ క్లీన్స్వీప్ చేసింది. ఈడెన్ గార్డెన్స్ మైదానం వేదికగా ఆఖరి టీ20 మ్యాచ్లో అన్ని రంగాల్లో..
కోల్కతా: భారత క్రికెట్ జట్టు నూతన ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడ్కు శుభారంభం.. ఇన్నాళ్లూ విరాట్ లేనప్పుడే అప్పుడప్పుడు జట్టు పగ్గాలు చేపట్టే రోహిత్ శర్మకు టీ20 జట్టు పూర్తిస్థాయి సారథిగా తొలి సిరీస్ విజయం.. అదీనూ న్యూజిలాండ్పై మూడు టీ20ల సిరీస్ను టీమ్ఇండియా క్లీన్స్వీప్ (3-0) చేయడం విశేషం.
జట్టులో విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, బుమ్రా, షమీ వంటి మ్యాచ్ విన్నర్లు లేరు. ఉన్నదంతా ద్రవిడ్ మార్గదర్శకత్వం.. రోహిత్ శర్మ నాయకత్వం.. ఈ సిరీస్లో యువ క్రికెటర్లు తమ సత్తాను చాటారు. హర్షల్ పటేల్, వెంకటేశ్ అయ్యర్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్ తమకొచ్చిన అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. మరోవైపు కేన్ విలియమ్సన్, కాన్వే వంటి అగ్రశ్రేణి బ్యాటర్లు లేకపోయినా.. కివీస్ను తక్కువ అంచనా వేయలేదు. గప్తిల్, డారిల్ మిచెల్, ఫిలిప్స్, నీషమ్, సీఫర్ట్ వంటి ఆటగాళ్లను మన బౌలర్లు అడ్డుకోగలిగారు. అంతేకాకుండా ప్రమాదకరమైన బౌల్ట్, సౌథీ, సోధి, సాంట్నర్, ఫెర్గూసన్తో కూడిన బౌలింగ్ దళాన్ని ఎదుర్కొని పరుగులు రాబట్టడం సాధారణ విషయం కాదు. అలా అన్ని రంగాల్లో రాణించిన టీమ్ఇండియా సిరీస్ను క్లీన్స్వీప్ చేసి టైటిల్ను అందుకుంది.
మూడు టీ20ల సిరీస్ను భారత్ క్లీన్స్వీప్ చేసింది. ఈడెన్ గార్డెన్స్ మైదానం వేదికగా ఆఖరి టీ20 మ్యాచ్లో అన్ని రంగాల్లో రాణించిన టీమ్ఇండియా హ్యాట్రిక్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 184 పరుగులు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనలో కివీస్ 17.2 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది. దీంతో 73 పరుగుల భారీ తేడాతో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (51) అర్ధ శతకం సాధించినా.. జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. మిగతా కివీస్ బ్యాటర్లలో సీఫర్ట్ (17), ఫెర్గూసన్ (14) మినహా ఎవరూ రెండంకెల స్కోరును సాధించలేకపోయారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ (3/9) అదరగొట్టేశాడు. హర్షల్ పటేల్ (2/24), చాహల్ (1/26), వెంకటేశ్ అయ్యర్ (1/12), దీపక్ చాహర్ (1/26) రాణించారు. దీంతో మూడు టీ20ల సిరీస్ను 3-0 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా అక్షర్ పటేల్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా రోహిత్ శర్మ ఎంపికయ్యారు. కివీస్పై టీమ్ఇండియా వరుసగా ఎనిమిదో ద్వైపాక్షిక సిరీస్ను సొంతం చేసుకోవడం విశేషం.
కెప్టెన్ రోహిత్ అర్ధ శతకం.. ఆఖర్లో దంచిన బౌలర్లు
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు రోహిత్ (56), ఇషాన్ కిషన్ (29) అర్ధశతకం భాగస్వామ్యం నిర్మించారు. అయితే స్వల్ప వ్యవధిలో నాలుగు వికెట్లు పడటంతో స్కోరు బోర్డు కాస్త నెమ్మదించింది. అయితే మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్ (25), వెంకటేశ్ అయ్యర్ (20) ఇన్నింగ్స్ను నిలబెట్టారు. అలానే ఆఖర్లో హర్షల్ పటేల్ (18), దీపక్ చాహర్ (21*) దంచికొట్టారు. దీంతో టీమ్ఇండియా స్కోరు 184 పరుగులు అయింది. కివీస్ బౌలర్లలో సాంట్నర్ 3.. బౌల్ట్, మిల్నే, ఫెర్గూసన్, సోధి తలో వికెట్ తీశారు.
ఫొటో గ్యాలరీ కోసం క్లిక్ చేయండి
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు కీలక వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా