IND vs SL : రవీంద్రుడి మాయాజాలం.. మూడే రోజుల్లో టీమ్ఇండియా విజయం
మొహాలీ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో శ్రీలంకపై భారత్ ...
లంకతో రెండు టెస్టుల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి భారత్
ఇంటర్నెట్ డెస్క్ : బ్యాటింగ్లో భారీగా పరుగులు.. వికెట్ల వేటలో విజృంభణ.. ఇదీ శ్రీలంకతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో టీమ్ఇండియా ఆటగాళ్ల ప్రదర్శన.. రవీంద్ర జడేజా ఆల్రౌండ్ షోతో కేవలం మూడు రోజుల్లోపే లంకేయుల భరతం పట్టేశారు. తొలిసారి పూర్తిస్థాయి టెస్టు కెప్టెన్గా రోహిత్కు.. అలాగే విరాట్ కోహ్లీ వందో టెస్టులో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. భారత్లో శ్రీలంక ఓటముల పరంపర కొనసాగుతూనే ఉంది.
మొహాలీ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో శ్రీలంకపై భారత్ ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 574/8 స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్డ్ చేసింది. అనంతరం లంక మొదటి ఇన్నింగ్స్లో 174 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఫాలో ఆన్ ఆడిన పర్యాటక జట్టు రెండో ఇన్నింగ్స్లోనూ 178 పరుగులకే ఆలౌటైంది. తొలుత బ్యాటింగ్లో దంచి కొట్టిన రవీంద్ర జడేజా.. బౌలింగ్లోనూ లంక పతనంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో జడేజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఆవార్డు దక్కింది. ఒకే రోజులో టీమ్ఇండియా ప్రత్యర్థికి చెందిన 16 వికెట్లను కూల్చగా.. అందులోనూ రవీంద్ర జడేజావే ఎనిమిది కావడం విశేషం.
జడ్డూ మాయ.. అశ్విన్ అదుర్స్..
అద్భుత శతకం సాధించి టీమ్ఇండియాకు భారీ స్కోరు అందించిన రవీంద్ర జడేజా (175 నాటౌట్) బౌలింగ్లోనూ లంక బ్యాటర్లను హడలెత్తించాడు. లంకపై మొదట ఇన్నింగ్స్లో ఐదు వికెట్ల (5/41) ప్రదర్శన చేసిన జడేజా.. రెండో ఇన్నింగ్స్లోనూ (4/47) అదరగొట్టాడు. జడేజాకు తోడుగా రవిచంద్రన్ అశ్విన్ (2/49, 4/46) విజృంభించడంతో లంక విలవిలలాడింది. ఈ క్రమంలో అశ్విన్ (436) అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్లలో కపిల్ (434)ను అధిగమించి రెండోస్థానానికి ఎగబాకాడు. అందరి కంటే ముందు దిగ్గజ బౌలర్ అనిల్ కుంబ్లే (619) టాప్లో ఉన్నాడు.
13 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు..
తొలి ఇన్నింగ్స్లో 108/4తో మూడో రోజు ఆట ప్రారంభించిన శ్రీలంకకు ఓవర్నైట్ బ్యాటర్లు అసలంక (29), నిసాంక (61*) మంచి ఆరంభమే ఇచ్చారు. వీరిద్దరూ కలిసి అర్ధశతక (58) భాగస్వామ్యం నిర్మించారు. ఎప్పుడైతే అసలంక పెవిలియన్కు చేరాడో లంక కుప్పకూలింది. 161/5తో ఫర్వాలేదనిపించినా.. మిగతా ఐదు వికెట్లను కేవలం 13 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. దీంతో 174 పరుగులకు ఆలౌటైంది. లంక బ్యాటర్లలో కరుణరత్నె 28, తిరిమన్నె 17, మాథ్యూస్ 22, డిక్వెల్లా 2 పరుగులు చేశారు. భారత బౌలర్లలో జడేజా 5, అశ్విన్ 2, బుమ్రా 2, షమీ ఒక వికెట్ తీశారు.
రెండో ఇన్నింగ్స్లోనూ అదేబాట
400 పరుగుల లోటుతో ఫాలోఆన్ ఆడిన శ్రీలంకను రెండో ఇన్నింగ్స్లోనూ భారత బౌలర్లు బెంబేలెత్తించారు. మరీ ముఖ్యంగా జడేజా, అశ్విన్ స్పిన్తో చెలరేగారు. దీంతో రెండో ఇన్నింగ్స్లోనూ 178 పరుగులకే కుప్పకూలింది. లంక బ్యాటర్ డిక్వెల్లా (51*) ఫర్వాలేదనిపించగా.. మిగతా బ్యాటర్లలో ధనంజయ డిసిల్వా 30, మాథ్యూస్ 28, కరుణరత్నె 27, అసలంక 20, నిసాంక 6 పరుగులు చేశారు. 121 పరుగులకే ఏడు వికెట్లను కోల్పోయిన లంకను డిక్వెల్లా-ఎంబుల్దేనియా (42 బంతుల్లో 2 పరుగులు) జంట కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకుంది. ఎనిమిదో వికెట్కు 14 ఓవర్లలో 32 పరుగులు జోడించారు. అయితే ఎంబుల్దేనియా పెవిలియన్కు చేరడంతో లంక పతనం ఎక్కువసేపు పట్టలేదు. అయితే ఓ వైపు వికెట్లు పడుతున్నా డిక్వెల్లా మాత్రం చూడచక్కని ఆటతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 4, అశ్విన్ 4, షమీ 2 వికెట్లు పడగొట్టారు.
జట్టు స్కోరు వివరాలు:
భారత్ : 574/8 డిక్లేర్డ్
శ్రీలంక : 174/10 (తొలి ఇన్నింగ్స్), 178/10 (రెండో ఇన్నింగ్స్)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్