IND vs WI: 3-0తో విండీస్ను క్లీన్స్వీప్ చేసిన టీమ్ఇండియా
వెస్టిండీస్తో జరిగిన మూడో వన్డేలోనూ టీమ్ఇండియా విజయపరంపర కొనసాగించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది...
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్తో జరిగిన మూడో వన్డేలోనూ టీమ్ఇండియా విజయపరంపర కొనసాగించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది. డక్వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ నిర్దేశించిన 257 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్ 26 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ 119 పరుగుల తేడాతో ఘన విజయం సాధించడమే కాకుండా విండీస్ గడ్డపై తొలిసారి మూడు, అంతకన్నా ఎక్కువ జరిగిన వన్డే సిరీస్ల్లో తొలిసారి క్లీన్స్వీప్ చేసింది. ఆ జట్టులో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్.. కెప్టెన్ నికోలస్ పూరన్ (42; 32 బంతుల్లో 5x4, 1x6), బ్రెండన్ కింగ్ (42; 37 బంతుల్లో 5x4, 1x6) మాత్రమే రాణించారు. మిగతా బ్యాట్స్మెన్ మొత్తం చేతులెత్తేశారు. వర్షం కారణంగా అంతరాయం కలిగిన ఈ మ్యాచ్లో టీమ్ఇండియా సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది. తొలుత యువ ఓపెనర్ శుభ్మన్గిల్ (98 నాటౌట్; 98 బంతుల్లో 7x4, 2x6) బ్యాట్తో అదరగొట్టగా.. తర్వాత బౌలర్లు చాహల్ 4/17, సిరాజ్ 2/14, శార్దూల్ 2/17 తమ పని పూర్తిచేశారు. దీంతో విండీస్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఈ విజయంతో భారత్.. కరీబియన్ జట్టుపై వరుసగా 12 ద్వైపాక్షిక సిరీస్లు గెలిచి.. ఈ రికార్డు నెలకొల్పిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది.
సిరాజ్ అదిరే ఆరంభం..
భారీ ఛేదనకు దిగిన విండీస్కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సిరాజ్ వేసిన రెండో ఓవర్లోనే రెండు వికెట్లు తీసి భారత్కు అదిరే ఆరంభం ఇచ్చాడు. తన తొలి ఓవర్లో మేయర్స్(0), బ్రూక్స్ (0)లను డకౌట్గా పెవిలియన్ పంపాడు. తర్వాత షై హోప్ (22; 33 బంతుల్లో 1x6), బ్రెండన్ కింగ్.. నిలకడగా ఆడి కాసేపు వికెట్లను కాపాడుకున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ మూడో వికెట్కు 47 పరుగులు జోడించి ప్రమాదకరంగా మారుతున్న సమయంలో చాహల్ టీమ్ఇండియాకు మూడో బ్రేక్ ఇచ్చాడు. అతడు వేసిన 9.5 ఓవర్కు హోప్ క్రీజు వదిలి ముందుకు రాగా కీపర్ సంజూ స్టంపౌట్ చేశాడు. తర్వాత కెప్టెన్ పూరన్, కింగ్ మరో భాగస్వామ్యం నిర్మించేలా చూశారు. కానీ, అక్షర్ పటేల్ బౌలింగ్లో కింగ్ బౌల్డవ్వడంతో కరీబియన్ జట్టు 74 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో కార్టీ (5)తో కలిసి కాస్త నిలకడగా ఆడడానికి ప్రయత్నించిన పూరన్.. ప్రసిద్ధ్ బౌలింగ్లో భారీ షాట్ ఆడబోయి శిఖర్ ధావన్ చేతికి చిక్కాడు. దీంతో విండీస్ 103 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఓటమివైపు పయనించింది. తర్వాత భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో ఆ జట్టు టెయిలెండర్లు కూడా పెవిలియన్కు క్యూ కట్టారు.
తొలి శతకం కోల్పోయిన శుభ్మన్..
అంతకుముందు టాస్గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ఇండియాకు ఓపెనర్లు శుభారంభం అందించారు. కెప్టెన్ ధావన్ (58; 74 బంతుల్లో 7x4) అర్ధ శతకంతో మెరవగా తర్వాత యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ అదరగొట్టాడు. అతడు 98 పరుగుల వద్ద ఉండగా వర్షం కారణంగా భారత ఇన్నింగ్స్కు తెరపడటంతో త్రుటిలో వన్డేల్లో తొలి శతకాన్ని కోల్పోయాడు. అయితే, ఓపెనర్లు ఇద్దరూ తొలి వికెట్కు 113 పరుగులు జోడించి.. జట్టు భారీ స్కోర్ సాధించడానికి పునాదులు వేశారు. ఈ క్రమంలోనే తొలుత అర్ధ శతకం పూర్తిచేసుకొని నిలకడగా ఆడుతున్న ధావన్ను.. హేడెన్ వాల్ష్ ఔట్ చేశాడు. అతడు వేసిన 22.5 ఓవర్కు షాట్ ఆడబోయిన గబ్బర్.. పూరన్ చేతికి చిక్కాడు. దీంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం శ్రేయస్ అయ్యర్ (44; 34 బంతుల్లో 4x4, 1x6) క్రీజులోకి రాగా.. తర్వాతి ఓవర్ పూర్తవ్వగానే వర్షం కురవడంతో మ్యాచ్ను రెండు గంటలకు పైగా నిలిపివేశారు. అప్పటికి భారత్ స్కోర్ 24 ఓవర్లలో 115/1తో ఉంది. శుభ్మన్ (51) అర్ధ శతకం పూర్తి చేసుకోగా.. శ్రేయస్ (2) పరుగులతో ఉన్నాడు. అయితే, మ్యాచ్ తిరిగి ప్రారంభమయ్యాక ఆటను చెరో 40 ఓవర్లకు కుదించారు.
శ్రేయస్తో కలిసి ధాటిగా..
మ్యాచ్ ప్రారంభమయ్యాక ధాటిగా ఆడిన శ్రేయస్, శుభ్మన్ గిల్.. 8 ఓవర్లలోనే 86 పరుగులు జోడించారు. దీంతో రెండో వికెట్కు మరో విలువైన భాగస్వామ్యం నిర్మించారు. అయితే, ధాటిగా ఆడుతూ అర్ధ శతకానికి చేరువైన శ్రేయస్ను హోసీన్ ఔట్ చేశాడు. అతడు వేసిన 32.2 ఓవర్కు భారీ షాట్ ఆడబోయి కీమోపాల్ చేతికి చిక్కాడు. దీంతో భారత్ 199 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. కాసేపటికే సూర్యకుమార్ యాదవ్ (8; 6 బంతుల్లో 1x4) సైతం ఔటయ్యాడు. వాల్ష్ బౌలింగ్లో బ్రూక్స్ చేతికి చిక్కాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన సంజూ (6 నాటౌట్; 7 బంతుల్లో)తో కలిసి శుభ్మన్ నిలకడగా ఆడాడు. ఈ క్రమంలోనే శుభ్మన్ వన్డేల్లో తొలి శతకానికి రెండు పరుగుల దూరంలో ఉండగా మరోసారి వర్షం కురిసి మ్యాచ్ నిలిచిపోయింది. అప్పటికి టీమ్ఇండియా 36 ఓవర్లలో 225/3తో నిలిచింది. కాగా, వర్షం నిలిచిపోయాక అంపైర్లు.. డక్వర్త్లూయిస్ పద్ధతిలో లెక్కించి విండీస్ లక్ష్యాన్ని 35 ఓవర్లలో 257గా నిర్దేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు