IND vs NZ: ‘వంద’ కోసం చెమటోడ్చిన టీమ్ఇండియా.. రెండో టీ20లో విజయం
న్యూజిలాండ్తో టీ20 సిరీస్ రేసులో (IND vs NZ) భారత్ నిలిచింది. కీలకమైన రెండో మ్యాచ్లో టీమ్ఇండియా విజయం సాధించింది.
లఖ్నవూ: లక్ష్యం వంద పరుగులు.. భారత బ్యాటింగ్ లైనప్ను చూస్తే అవలీలగా కొట్టేస్తారని అనిపించింది. కానీ మ్యాచ్ చివరి ఓవర్ వరకూ వెళ్తుందని ఎవరూ ఊహించి ఉండరు. మ్యాచ్లో అత్యధికంగా 30 ఓవర్లు స్పిన్నర్లే వేస్తే ఎలా ఉంటుందంటే.. దానికి ప్రత్యక్ష ఉదాహరణ భారత్ - కివీస్ రెండో టీ20.. అయితే చివరికి వంద పరుగుల లక్ష్య ఛేదనను చెమటోడ్చి పూర్తి చేసి భారత్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 99/8 స్కోరు చేసింది. అనంతరం టీమ్ఇండియా 19.5 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసి గెలిచింది. దీంతో మూడు టీ20ల సిరీస్లో 1-1తో సమంగా నిలిచింది.
కెప్టెనే అక్కడ టాప్ స్కోరర్..
టాస్ నెగ్గిన కివీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకొంది. అయితే పిచ్ బౌలింగ్కు అనుకూలంగా ఉండటంతో భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో కివీస్ను 99/8 స్కోరుకే పరిమితం చేశారు. ఆ జట్టులో మిచెల్ శాంట్నర్ (19) టాప్ స్కోరర్. మిగతా వారిలో ఫిన్ అలెన్ 11, డేవన్ కాన్వే 11, చాప్మన్ 14, బ్రాస్వెల్ 14 పరుగులు సాధించారు. భారత్ నుంచి ఏడుగురు బౌలర్లు బౌలింగ్ చేయగా.. అర్ష్దీప్ సింగ్కు (2/7) ఇన్నింగ్స్లోని 18వ ఓవర్ను, మావికి 19వ ఓవర్ను హార్దిక్ ఇచ్చాడు. అర్ష్దీప్ 2 వికెట్లు తీయగా.. హార్దిక్, సుందర్, చాహల్, దీపక్, కుల్దీప్ తలో వికెట్ తీశారు.
సూర్య చివర్లో..
టాస్ గెలిచిన కివీస్ సారథి బ్యాటింగ్ ఎంచుకొన్న తర్వాత ఓ మాట చెప్పాడు. లక్ష్య ఛేదన చాలా కష్టంగా ఉంటుంది అందుకే మొదట బ్యాటింగ్ తీసుకున్నానని తెలిపాడు. లఖ్నవూ పిచ్ అక్షరాలా అలాగే సాగింది. వంద పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఇన్నింగ్స్ సజావుగా సాగలేదు. ప్రత్యర్థి బౌలర్లు ఊరించే విధంగా బంతులను సంధించి మరీ భారత వికెట్లను రాబట్టారు. అయితే ఇందులో రెండు వికెట్లు రనౌట్ రూపంలోనే కివీస్కి దక్కాయి. ఇక చివర్లో సూర్యకుమార్ (26*), హార్దిక్ పాండ్య (15*) ఐదో వికెట్కు 29 పరుగులు జోడించి మరీ జట్టును విజయతీరాలకు చేర్చారు. శుభ్మన్ గిల్ 11, ఇషాన్ కిషన్ 19, రాహుల్ త్రిపాఠి 13, వాషింగ్టన్ సుందర్ 10 పరుగులు సాధించారు.
‘వంద’ను కాపాడుకొనేందుకు..
భారత్కు నిర్దేశించిన 100 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకొనేందుకు కివీస్ ఏకంగా 8 మంది బౌలర్లను ప్రయోగించింది. చివరి ఓవర్ వరకూ సక్సెస్ అయినప్పటికీ.. సూర్య కుమార్ భారత్ను గెలిపించాడు. మూడు ఓవర్లు మినహా 17 ఓవర్లను స్పిన్నర్లే వేయడం గమనార్హం. ఇలా అత్యధికంగా స్పిన్నర్లతో బౌలింగ్ వేయించిన మూడో జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది. అందులోనూ గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్ వంటి పార్ట్టైమ్ బౌలర్లతో బౌలింగ్ చేయించాడు ఆ జట్టు సారథి మిచెల్ శాంట్నర్. ఇక్కడ మరొక విశేషం ఏంటంటే.. కివీస్ బ్యాటింగ్ చేసేటప్పుడు ఒక్క సిక్సర్ కొట్టని ఆ జట్టు.. భారత్ ఇన్నింగ్స్లోనూ ఎవరితోనూ సిక్స్ కొట్టనీయకుండా బౌలింగ్ చేయడం గమనార్హం. ఇలా ఇరు ఇన్నింగ్స్ల్లో ఆడిన 239 బంతుల్లో ఒక్క సిక్స్ లేకుండా మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి