సూర్య.. ఎట్టకేలకు నిరీక్షణ ఫలించింది
మార్చి 12 నుంచి ఇంగ్లాండ్తో జరగబోయే ఐదు టీ20ల సిరీస్కు ముంబయి ఇండియన్స్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్.. ఇద్దరు ఎంపికవ్వడం పట్ల ఆ ఫ్రాంఛైజీ సంతోషం వ్యక్తం చేసింది...
ఇంటర్నెట్డెస్క్: మార్చి 12 నుంచి ఇంగ్లాండ్తో జరగబోయే ఐదు టీ20ల సిరీస్కు ముంబయి ఇండియన్స్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్.. ఇద్దరు ఎంపికవ్వడంపై ఆ ఫ్రాంఛైజీ సంతోషం వ్యక్తం చేసింది. కృషి, పట్టుదలతో టీమ్ఇండియాకు ఎంపికయ్యారని ట్వీట్ చేస్తూ వారిని అభినందించింది. మరోవైపు చాలా రోజుల నుంచి ఈ పిలుపు కోసం ఎదురు చూస్తున్న సూర్యకుమార్ యాదవ్కు పలువురు టీమ్ఇండియా మాజీ క్రికెటర్లు అభినందనలు చెప్పారు. అతడి నిరీక్షణకు తెరపడిందని, ఎట్టకేలకు భారత జట్టుకు ఎంపికయ్యాడని క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్తో పాటు హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, ఆర్పీసింగ్, వసీమ్ జాఫర్, రమేశ్ పవార్ తదితరులు ట్వీట్ చేశారు. కాగా, ఏ ఆటగాడికైనా టీమ్ఇండియా తరఫున ఆడటమే అతపెద్ద గౌరవమని సచిన్ పేర్కొన్నారు.
సూర్య గతకొన్నేళ్లుగా ఇటు ఐపీఎల్తో పాటు అటు దేశవాళీ క్రికెట్లోనూ అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నాడు. ఈ క్రమంలోనే చాలా రోజులుగా టీమ్ఇండియా నుంచి పిలుపు వస్తుందని ఆశిస్తున్నాడు. అయితే, యూఏఈలో గతేడాది జరిగిన ఐపీఎల్లోనూ మంచి ప్రదర్శన చేయడంతో ఈ ముంబయి బ్యాట్స్మన్ ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికవుతాడని పూర్తి నమ్మకంతో ఉన్నాడు. కానీ, అతడిని ఎంపిక చేయకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఈ క్రమంలోనే అప్పుడు సూర్యను ఎంపిక చేయకపోవడాన్ని హర్భజన్, ఇర్ఫాన్ వంటి కొంతమంది క్రికెటర్లు బీసీసీఐని నిలదీశారు. త్వరలోనే భారత జట్టుకు ఆడతావని అతడికి ధైర్యం చెప్పారు. ఈ విషయంపై సామాజిక మాధ్యమాల్లోనూ తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సూర్య ఇంగ్లాండ్తో పొట్టి సిరీస్కు ఎంపికయ్యాడు.
అలాగే శనివారం రాత్రి బీసీసీఐ ప్రకటించిన టీ20 జట్టులో సూర్యకుమార్తో పాటు కొత్తగా ఇషాన్ కిషన్, రాహుల్ తెవాతియాకు కూడా చోటు లభించింది. ఇషాన్ గత ఐపీఎల్లో ధనాధన్ ఇన్నింగ్స్లు ఆడగా, రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రాహుల్ తెవాతియా ఒకే ఓవర్లో ఐదు సిక్సులు బాది వెలుగులోకి వచ్చాడు. దీంతో వారిని కూడా ఈ సిరీస్కు ఎంపిక చేశారు. మరోవైపు కోల్కతా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఆస్ట్రేలియా పర్యటనలో టీ20 సిరీస్కు ఎంపికైనా గాయం కారణంగా తప్పుకున్నాడు. అతడికి ఈ సిరీస్లో మరో అవకాశం కల్పించారు.
భారత జట్టు: కోహ్లి (కెప్టెన్), రోహిత్ (వైస్కెప్టెన్), కేఎల్ రాహుల్, ధావన్, అయ్యర్, సూర్యకుమార్, హార్దిక్ పాండ్య, పంత్, ఇషాన్ కిషన్, చాహల్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, సుందర్, రాహుల్ తెవాతియా, నటరాజన్, భువనేశ్వర్, దీపక్ చాహర్, నవదీప్ సైని, శార్దూల్ ఠాకూర్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM