T20 Cricket: రాజస్థాన్ భళా.. చెన్నైవిలవిల.. ఇంకా ఆ మూడు జట్లే ‘200’ కొట్టలేదు
టీ20 క్రికెట్లో పరుగులు పారితేనే చూసే అభిమానులకు ఆడే ఆటగాళ్లకు ఉత్సాహంగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో 180, 190 స్కోర్లు సాధారణంగా మారిపోయాయి...
(Photos: Sanju, Jadeja Instagram)
టీ20 క్రికెట్లో పరుగులు వరద పారితేనే చూసే అభిమానులకు ఉత్సాహంగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో 180, 190 స్కోర్లు సాధారణంగా మారిపోయాయి. ఇక 200 పైచిలుకు పరుగులు కూడా ఒక్కోసారి తక్కువవుతున్నాయి. ప్రత్యర్థులు ధనాధన్ బ్యాటింగ్తో వాటినీ ఛేదించేస్తున్నారు. అలా ఈ సీజన్లో ఇప్పటివరకు 200 పరుగులకుపైగా సాధించిన జట్లేవంటే..
ఇప్పటివరకు ఈ సీజన్లో మొత్తం ఏడు జట్లు 200కు పైగా స్కోర్లు సాధించాయి. అందులో రాజస్థాన్, చెన్నై చెరో రెండో సార్లు సాధించగా.. బెంగళూరు, పంజాబ్, లఖ్నవూ, దిల్లీ, కోల్కతా జట్లు ఒక్కోసారి ఈ భారీ స్కోర్లు చేశాయి. ఇక్కడ రెండొందల మార్క్ చేరుకోనిది గుజరాత్, హైదరాబాద్, ముంబయి మాత్రమే.
* బెంగళూరుకు షాకే: ఈ సీజన్లో బెంగళూరు ఆడిన తన తొలి మ్యాచ్లోనే 205/2 పరుగుల భారీస్కోర్ చేసింది. దాన్ని పంజాబ్ ఐదు వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో ఛేదించి విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాప్ స్కోరర్ బెంగళూరు కెప్టెన్ ఫా డుప్లెసిస్ (88; 57 బంతుల్లో 3x4, 7x6) దంచికొట్టాడు. ఛేదనలో పంజాబ్ బ్యాటర్లు ధావన్ (43), రాజపక్స (43), షారుఖ్ ఖాన్ (24*), ఒడియన్ స్మిత్ (25) తలా ఓ చేయి వేయడంతో ఆ జట్టు తేలిగ్గా గెలిచింది.
(Photo: Sanju Samson Instagram)
* రాజస్థాన్ రెండోసారి: రాజస్థాన్ ఈ సీజన్లో రెండుసార్లు 200 పైచిలుకు పరుగులు చేసింది. రెండింటిలోనూ ప్రత్యర్థులను కట్టడి చేసి విజయం సాధించడం విశేషం. తొలుత హైదరాబాద్తో ఆడిన మ్యాచ్లో 210/6 భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో విలియమ్సన్ టీమ్ 149/7కే చేతులెత్తేసింది. ఇక ఇటీవలే కోల్కతాపై 217/5 మరోసారి రెండొందల స్కోర్ దాటడమే కాకుండా ఈ సీజన్లో ఇప్పటివరకు అత్యధిక స్కోర్ నమోదు చేసిన జట్టుగా నిలిచింది. ఈ మ్యాచ్లో కోల్కతా గట్టి పోటీనిచ్చి గెలిచేలా కనిపించింది. కానీ, చివర్లో కట్టుదిట్టంగా బంతులేసి రాజస్థాన్ ఆ జట్టును 210 పరుగులకు ఆలౌట్ చేసింది.
(Photo: Ravindra Jadeja Instagram)
* అయ్యో చెన్నై: లఖ్నవూతో తన రెండో మ్యాచ్ ఆడిన చెన్నై మొదట బ్యాటింగ్ చేసి 210/7 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో కేఎల్ రాహుల్ టీమ్ దంచికొట్టడంతో 19.3 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఇక రెండోసారి బెంగళూరుతో ఆడిన మ్యాచ్లోనూ 216/4 భారీ స్కోర్ నమోదు చేయగా.. ఛేదనలో బెంగళూరు గట్టిగానే ప్రయత్నించింది. కానీ, చివరికి 193/9 స్కోర్ వద్దే నిలిచిపోయి ఓటమిపాలైంది. దీంతో చెన్నై ఈ సీజన్లో రెండు మ్యాచ్ల్లో భారీ పరుగులు చేసినా ఒక విజయం, ఒక ఓటమిని తన ఖాతాలో వేసుకుంది.
(Photo: Rishabh Pant Instagram)
* దిల్లీ మెరుపులు: దిల్లీ ఈ సీజన్లో ఒకేసారి 200 పరుగులకు పైగా స్కోర్ చేసింది. అదీ కోల్కతాతో తలపడిన మ్యాచ్లో ఓపెనర్లు పృథ్వీ షా (51), డేవిడ్ వార్నర్ (61) దంచికొట్టడంతో 215/5 స్కోర్ సాధించింది. ఇక ఛేదనలో కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (54) రాణించినా మిగతా బ్యాటర్లు విఫలమవడంతో ఆ జట్టు 171 పరుగులకే ఆలౌటైంది. దీంతో దిల్లీ ఈ మ్యాచ్లో 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
- ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరాడిన గుజరాత్.. ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం
గుజరాత్తో జరిగిన ఉత్కంఠ పోరులో దిల్లీ 4 పరుగుల తేడాతో నెగ్గింది. 225 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 220 పరుగులు చేసింది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు. -
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్
భారత మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ (Sachin Tendulkar) బర్త్ డే సందర్భంగా పెద్దఎత్తున శుభాకాంక్షలు వచ్చాయి. మాజీ క్రికెటర్లు ప్రత్యేకంగా పోస్టులు పెట్టారు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అత్యంత దారుణంగా ట్రోలింగ్కు గురైన కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya). ఏ మైదానంలో చూసినా అతడిని హేళన చేస్తూ ఫ్యాన్స్ హోరెత్తించారు. -
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
లఖ్నవూ చేతిలో చెన్నైకి వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఈసారి సొంత మైదానంలోనే పరాజయం పొందడంతో ఆ జట్టు అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. -
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
మరో మూడు రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ తన టీమ్ను వెల్లడించాడు. -
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
David Warner: దిల్లీ ఆటగాడు డేవిడ్ వార్నర్.. భారత గుర్తింపు కార్డు ఆధార్ కోసం పరిగెడుతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో అతడు హిందీలో మాట్లాడటం విశేషం. -
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
సెంచరీతో చెన్నైపై భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో లఖ్నవూ బ్యాటర్ స్టాయినిస్ కీలక పాత్ర పోషించాడు. ఒకదశలో ఓడిపోతామని భావించిన ఆ జట్టును చివరి వరకూ క్రీజ్లో ఉండి విజయతీరాలకు చేర్చాడు. -
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
చెన్నై కెప్టెన్ రుతురాజ్ సెంచరీతో అలరించినా.. లఖ్నవూ జట్టే విజయం సాధించింది. మార్కస్ స్టాయినిస్ కీలకమైన శతకంతో తన జట్టును గెలిపించాడు. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
పోరాడిన గుజరాత్.. ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ