కామన్వెల్త్‌ క్రీడల్లో మహిళల క్రికెట్‌

2022 బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ క్రీడల మహిళ క్రికెట్లో 8 జట్లు బరిలో దిగుతాయని ఐసీసీ ప్రకటించింది.

Published : 27 Apr 2021 12:36 IST

బరిలో భారత్‌ సహా 8 జట్లు: ఐసీసీ

దుబాయ్‌: కామన్వెల్త్‌ క్రీడల్లోకి క్రికెట్‌ పునరాగమనం చేయబోతోంది. 2022 బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ క్రీడల మహిళ క్రికెట్లో 8 జట్లు బరిలో దిగుతాయని ఐసీసీ ప్రకటించింది. టీ20 ఫార్మాట్‌లో జరిగే టోర్నీలో ఆతిథ్య ఇంగ్లాండ్‌, టీమ్‌ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికాతో పాటు కరీబియన్‌ దీవుల నుంచి ఒక జట్టు అర్హత సాధించినట్లు వెల్లడించింది.

ఏప్రిల్‌ 1 వరకు ఉన్న ర్యాంకింగ్స్‌ ఆధారంగా ఆయా జట్లను ఐసీసీ ఎంపిక చేసింది. వచ్చే ఏడాది జనవరిలో క్వాలిఫయింగ్‌ టోర్నీ ద్వారా 8వ జట్టును ఎంపిక చేయనున్నట్లు ఐసీసీ పేర్కొంది. 1998 కౌలాలంపూర్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో తొలిసారిగా పురుషుల క్రికెట్‌ను చేర్చారు. ఆ క్రీడల్లో దక్షిణాఫ్రికా విజేతగా నిలిచింది. అనంతరం కామన్వెల్త్‌ క్రీడలకు క్రికెట్‌ దూరంగా ఉంది.

‘‘కరీబియన్‌ దీవుల నుంచి ఏ జట్టు బరిలో ఉంటుందన్నది అర్హత టోర్నీ ద్వారా నిర్ణయిస్తాం. కరీబియన్‌ మహిళా క్రికెటర్లు తమ దేశాల తరఫున ఆడుతున్నారు. 2022 జనవరిలో జరిగే అర్హత టోర్నీ ద్వారా 8వ జట్టును ప్రకటిస్తాం’’ అని ఐసీసీ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని