2007 T20 World Cup: క్రికెట్ చాణక్యుడు ధోనీ కెప్టెన్సీకి అసలైన నిర్వచనం ఈ విజయం
టీ20 క్రికెట్లో టీమ్ఇండియా తొలి విశ్వవిజేత. సీనియర్లు లేని భారత జట్టు మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలో 2007 సెప్టెంబర్ 24న ఈ ఘనత సాధించింది...
ఇంటర్నెట్డెస్క్: టీ20 క్రికెట్లో టీమ్ఇండియా తొలి విశ్వవిజేత. సీనియర్లు లేని భారత జట్టు మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలో ఈ ఘనత సాధించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై చారిత్రక విజయం నమోదు చేసి సగటు భారత క్రికెట్ అభిమాని సగర్వంగా తల ఎత్తుకునేలా చేసింది. 14 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు టీమ్ఇండియా ఆ అపురూప విజయం సాధించింది. ఇంకా ఆ మధుర స్మృతులు అభిమానుల కళ్లల్లో కదలాడుతున్నాయి. నరాలు తెగే ఉత్కంఠ పరిస్థితుల్లో జోగిందర్ శర్మ వేసిన ఆ చివరి ఓవర్.. మిస్బా ఆడిన స్కూప్ షాట్ను అనూహ్యంగా క్యాచ్ అందుకున్న శ్రీశాంత్.. క్లిష్ట పరిస్థితుల్లో జట్టును సమర్థవంతంగా నడిపించిన కెప్టెన్ ధోనీని ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఈ విజయం సమష్టి కృషికి నిదర్శనం, అసలైన సారథ్యానికి నిలువుటద్దం.
కెప్టెన్సీలో అపర చాణక్యుడు..
పాకిస్థాన్ విజయానికి చివరి ఓవర్లో 13 పరుగులు అవసరమైన వేళ అందరిలోనూ ఒకటే ఉత్కంఠ. ఒక్క వికెట్ తీస్తే భారత్ విజయం. రెండు సిక్సులు కొడితే పాకిస్థాన్ గెలుపు. ఇద్దరికీ సమాన అవకాశాలు. దీంతో రెండు దేశాల క్రికెట్ అభిమానులు కళ్లార్పకుండా మ్యాచ్ను తిలకిస్తున్నారు. అలాంటి సమయంలోనూ భారత కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు. బంతిని యువ పేసర్ జోగిందర్ శర్మకు అప్పగించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఈ క్రమంలోనే జోగిందర్ వేసిన తొలి బంతి వైడ్గా వెళ్లింది. తర్వాతి బంతి డాట్బాల్. ఇక మూడో బంతిని మిస్బా (43; 38 బంతుల్లో 4x6) సిక్స్గా మలవడంతో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. సమీకరణం నాలుగు బంతుల్లో 6 పరుగులుగా మారింది. అంతా ధోనీ నిర్ణయం సరైంది కాదనుకున్నారు. అదే సమయంలో జోగిందర్ వద్దకెళ్లి ఏదో మాట్లాడాడు. తర్వాత అతడు వేసిన నాలుగో బంతి ఆఫ్స్టంప్కు ఆవల రావడంతో మిస్బా రివర్స్ స్కూప్ ఆడాడు. బంతి గాల్లోకి లేవగా అందరి కళ్లూ దానిపైనే ఉన్నాయి. ఊపిరి బిగబట్టి చూస్తుండగా బంతిని శ్రీశాంత్ క్యాచ్ అందుకున్నాడు. భారత్ గెలిచింది. అభిమానులు మురిశారు. అంతా క్షణాల్లో జరిగిపోయింది. కానీ ఆ జ్ఞపకాలు ఇంకా అభిమానుల గుండెల్లో పదిలంగా ఉన్నాయి.
చివర్లో రోహిత్ ధనాధన్..
అంతకుముందు టీమ్ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసింది. నిర్ణిత ఓవర్లలో 157/5 స్కోర్ సాధించింది. ఓపెనర్ గౌతమ్ గంభీర్ (75; 54 బంతుల్లో 8x4, 2x6) టాప్ స్కోరర్గా నిలవగా చివర్లో రోహిత్ శర్మ (30; 16 బంతుల్లో 2x4, 1x6) ధనాధన్ బ్యాటింగ్తో జట్టుకు మంచి స్కోర్ అందించాడు. ఛేదనలో పాక్ తడబడినా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ మిస్బా భారత్కు చెమటలు పట్టించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు సిక్సర్లతో చెలరేగాడు. చివరి వరకూ క్రీజులో పాతుకుపోయి మ్యాచ్ను గెలిపించేలా కనిపించాడు. కానీ.. ధోనీ చాణక్యానికి, జోగిందర్ బౌలింగ్కు, శ్రీశాంత్ క్యాచ్కు దొరికిపోయి నిరాశతో వెనుదిరిగాడు. దీంతో పాకిస్థాన్ 19.4 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. టీమ్ఇండియా బౌలర్లలో ఇర్ఫాన్, ఆర్పీ సింగ్ మూడేసి వికెట్లు తీయగా జోగిందర్ శర్మ రెండు వికెట్లు పడగొట్టాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు.
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్