2016 Rio Olympics: ఆ ఒలింపిక్స్ బౌట్లు ఫిక్స్
2016 రియో ఒలింపిక్స్లో డబ్బు కోసం, ఇతర ప్రయోజనాల కోసం 10కి పైగా బాక్సింగ్ బౌట్ల ఫలితాలను తారుమారు చేశారనే సంచలన విషయం బయటకు వచ్చింది...
దిల్లీ: 2016 రియో ఒలింపిక్స్లో డబ్బు కోసం, ఇతర ప్రయోజనాల కోసం 10కి పైగా బాక్సింగ్ బౌట్ల ఫలితాలను తారుమారు చేశారనే సంచలన విషయం బయటకు వచ్చింది. అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ) నియమించిన మెక్లారెన్ గ్లోబల్ స్పోర్ట్స్ సొల్యూషన్స్ (ఎమ్జీఎస్ఎస్) సంస్థ చేపట్టిన స్వతంత్ర దర్యాప్తుతో ఇది వెలుగులోకి వచ్చింది. తమ విచారణకు సంబంధించిన తొలి దశ నివేదికను ఏఐబీఏకు ఈ సంస్థ అందించింది. దాని ప్రకారం రెండు ఫైనల్స్ సహా మొత్తం 14 బౌట్ల ఫలితాలలో ఇలా అక్రమాలు జరిగినట్లు ఆ నివేదిక పేర్కొంది. 2012 లండన్ ఒలింపిక్స్ కంటే ముందే ఈ కుట్రకు అడుగులు పడ్డాయని, 2016 క్రీడల అర్హత రౌండ్లలో ట్రయల్ కూడా చేశారని తెలిసింది. అవినీతిపరులైన రిఫరీలు, న్యాయనిర్ణేతలు, డ్రా కమిషన్ అందులో భాగమయ్యారని నివేదిక వెల్లడించింది. అప్పటి ఏఐబీఏ అధ్యక్షుడు చింగ్ దీనికి బాధ్యత వహించాల్సి ఉందని పేర్కొంది. ఆ ఒలింపిక్స్లో ముఖ్యంగా రెండు బౌట్లలో వచ్చిన ఫలితాలు ఈ అవినీతి వ్యవస్థకు నిదర్శనంగా నిలిచాయి. బాంటమ్వెయిట్ క్వార్టర్స్లో రష్యా బాక్సర్ వ్లాదిమిర్పై పిడిగుద్దులతో విరుచుకుపడ్డప్పటికీ ప్రపంచ ఛాంపియన్ మైకెల్ను ఓడిపోయాడని ప్రకటించడంతో అతను రిఫరీ, న్యాయ నిర్ణేతలను దూషించాడు. హెవీవెయిట్ పసిడి పోరులో లెవిట్ (కజకిస్థాన్) ఆధిపత్యం ప్రదర్శించినా గెలవలేకపోయాడు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నుంచి తిరిగి గుర్తింపు పొందేందుకు ప్రయత్నిస్తున్న ఏఐబీఏ ఈ నివేదిక నేపథ్యంలో రిఫరీలు, న్యాయ నిర్ణేతల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. వచ్చే నెల 24న సెర్బియాలో ఆరంభమయ్యే ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ కోసం రిఫరీలు, న్యాయ నిర్ణేతలు, సాంకేతిక ప్రతినిధుల ఎంపికలో ప్రమాణాలు, నేపథ్యం లాంటి విషయాలను ఇప్పుడు ఎమ్జీఎస్ఎస్ చూసుకోనుంది. ఈ కుట్రకు కారణమైన వాళ్లపై తగిన చర్యలు తీసుకోవడం కోసం న్యాయ సలహాలు తీసుకుంటామని ఏఐబీఏ అధ్యక్షుడు ఉమర్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్ బ్యాటర్లకు హ్యాట్సాఫ్: హార్దిక్ పాండ్య
ముంబయి బౌలర్లు భారీగా పరుగులు ఇవ్వడంతో హైదరాబాద్ రికార్డు స్కోరును నమోదు చేసి చరిత్ర సృష్టించింది. దీంతో ఐపీఎల్ 17వ సీజన్లో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. -
‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్గా మారిన కావ్యా మారన్
కావ్యా మారన్.. సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ యజమాని. ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ భారీ స్కోరు సాధించడంతో ఆమె ఒక్కసారిగా నెట్టింట వైరల్గా మారారు. -
ముంబయి లక్ష్య ఛేదన దిశగా వస్తుందని భావించారా? ప్యాట్ కమిన్స్ సమాధానమిదే!
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ బోణీ కొట్టింది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబయిని చిత్తు చేసింది. -
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
ఉప్పల్ వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పలు రికార్డులు నమోదు అయ్యాయి. -
ఉప్పల్ ఊగిపోయింది
ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్లో సన్రైజర్స్ అద్వితీయమైన బ్యాటింగ్తో అదరగొట్టింది. బ్యాటర్లు మెషీన్ గన్నుల్లా పేలడంతో ఐపీఎల్లో రికార్డు స్కోరుతో సత్తాచాటింది. తొలి మ్యాచ్లో త్రుటిలో ఓడినా.. రెండో పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది. -
ఇది సన్రైజర్సేనా?
సన్రైజర్స్ అంటే.. నత్తనడక బ్యాటింగ్కు మారు పేరు! సన్రైజర్స్ బ్యాటర్లది.. స్ట్రైక్రేట్లో ఎప్పుడూ వెనుకంజే! సన్రైజర్స్ మెరుపులన్నీ బౌలింగ్ వరకే! కానీ ఇదంతా పాత కథ! -
సింధు శుభారంభం
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. -
సెమీస్లో బోపన్న జోడీ
44 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న భారత టెన్నిస్ వెటరన్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న మరో టైటిల్ దిశగా సాగుతున్నాడు. -
ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీలో శ్రీజేష్
అంతర్జాతీయ హాకీ సమాఖ్య నూతన ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీ సహ అధ్యక్షుడిగా భారత హాకీ వెటరన్ గోల్కీపర్ శ్రీజేష్ నియమితుడయ్యాడు. -
‘ఇంపాక్ట్ ప్లేయర్’ వల్లే ధోని అలా..
కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. ఆటగాడిగా కూడా ఇదే చివరి సీజన్ అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేంద్ర ధోని బ్యాటు పట్టి కొన్ని మెరుపులు మెరిపిస్తే చూడాలన్నది అభిమానుల ఆశ. -
కోచ్కు జకోవిచ్ టాటా
కోచ్ గోరాన్ ఇవానిసెవిచ్తో ఆరేళ్ల బంధానికి జకోవిచ్ వీడ్కోలు పలికాడు. 2018లో ఇవానిసెవిచ్తో కలిసి జకోవిచ్ ప్రయాణం ప్రారంభించాడు. -
సచిన్ గోల్ఫాట
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ గోల్ఫ్ స్టిక్ చేతబట్టాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్హిల్స్ క్లబ్లో బుధవారం గోల్ఫ్ ఆడాడు. -
భారత్-పాక్ సిరీస్.. ఆసీస్ ఆసక్తి
భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్కు ఆతిథ్యమివ్వడానికి ఆస్ట్రేలియా మరోసారి ఆసక్తి వ్యక్తం చేసింది. -
ముంబయిలో హార్దిక్కు మరింతగా..
రోహిత్ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా ఎంపికైన హార్దిక్ పాండ్యకు సామాజిక మాధ్యమాల్లోనే కాదు మైదానాల్లోనూ తీవ్ర వ్యతిరేకత తప్పడం లేదు. -
మళ్లీ బాబర్కే పగ్గాలు!
పాకిస్థాన్ క్రికెట్ జట్టు పగ్గాలు మళ్లీ బాబర్ అజామ్ చేతికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అతణ్ని మరోసారి జట్టు కెప్టెన్గా నియమించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. -
స్టిమాక్ను తప్పించాల్సిందే
ఫుట్బాల్ ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో చిన్న జట్టు అఫ్గానిస్థాన్ చేతిలో భారత్ అనూహ్య ఓటమితో కోచ్ స్టిమాక్ను తప్పించాలని మాజీ ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
-
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
-
మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్ బ్యాటర్లకు హ్యాట్సాఫ్: హార్దిక్ పాండ్య
-
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్రాజు
-
కొనసాగుతున్న మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక
-
‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్గా మారిన కావ్యా మారన్