Virat Kohli: కోహ్లీకి బెదిరింపులపై పోలీసు విచారణ
టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కుటుంబానికి ఆన్లైన్లో బెదిరింపులు వచ్చినట్లు వచ్చిన వార్తలను సుమోటోగా తీసుకున్నట్లు దిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) పేర్కొంది. డిప్యూటీ కమిషనర్ ఆఫ్
దిల్లీ: టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కుటుంబానికి ఆన్లైన్లో బెదిరింపులు వచ్చినట్లు వచ్చిన వార్తలను సుమోటోగా తీసుకున్నట్లు దిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) పేర్కొంది. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్)కు నోటీసు జారీ చేసింది. నోటీసు అందుకున్నట్లు చెప్పిన ఓ సీనియర్ పోలీసు అధికారి.. ఈ విషయంపై తాము ఇప్పటికే విచారణ జరుపుతున్నట్లు తెలిపాడు. టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్ చేతిలో భారత జట్టు ఓటమి నేపథ్యంలో.. కోహ్లి తొమ్మిది నెలల కుమార్తెను రేప్ చేస్తామంటూ ఆన్లైన్లో కొందరు బెదిరింపులకు పాల్పడ్డారని మీడియాలో వార్తలొచ్చాయని నోటీసులో డీసీడబ్ల్యూ పేర్కొంది. ‘‘దూషణలకు గురైన సహచరుడు షమిని సమర్థించినందుకు కూడా కోహ్లీపై ఆన్లైన్లో దాడులు చేశారని తెలిసింది. ఇది చాలా తీవ్రమైన విషయం. తక్షణ చర్యలు అవసరం’’ అని చెప్పింది. ఈ విషయానికి సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీని, అరెస్టు చేసిన నిందితుల వివరాలు ఇవ్వాలని పోలీసులను కోరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్