Afghanistan Cricket: పాక్కు నిరాశ.. అఫ్గాన్తో సిరీస్ వాయిదా
అఫ్గానిస్థాన్లో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లోనూ ఆ దేశ క్రికెట్ జట్టుతో మ్యాచ్లు ఆడాలని ఎదురుచూసిన పాకిస్థాన్కు భంగపాటు ఎదురైంది. శ్రీలంక వేదికగా సెప్టెంబర్ 3 నుంచి ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగాల్సి ఉంది...
ఇంటర్నెట్డెస్క్: అఫ్గానిస్థాన్లో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లోనూ ఆ దేశ క్రికెట్ జట్టుతో మ్యాచ్లు ఆడాలని ఎదురుచూసిన పాకిస్థాన్కు భంగపాటు ఎదురైంది. శ్రీలంక వేదికగా సెప్టెంబర్ 3 నుంచి ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగాల్సి ఉంది. అయితే, ఆ సిరీస్ను వచ్చే ఏడాదికి వాయిదా వేయాలని అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు తాజాగా నిర్ణయించింది. ప్రస్తుతం ఆ దేశంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో తమ క్రికెటర్ల మానసిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ బోర్డు వివరించింది. ఇటీవల అఫ్గాన్ని తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. దాంతో అక్కడ ఒక్కసారిగా జనజీవనం స్తంభించి ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తూ కొంత మంది ప్రాణాలు సైతం కోల్పోయారు. మరోవైపు కాబుల్ విమానాశ్రయంలోనూ పరిస్థితులు దయనీయంగా మారాయి.
అయితే, పాక్ బోర్డు ఇవేమీ పట్టించుకోకుండా నిన్నటివరకు అఫ్గాన్తో ఎలాగైనా సిరీస్ ఆడాలని చూసింది. ఈ నేపథ్యంలోనే సోమవారం ఉదయం ఇరు దేశాల క్రికెట్ బోర్డులు వర్చువల్గా సమావేశమై పాకిస్థాన్లో మూడు వన్డేల మ్యాచ్లు నిర్వహించాలని అంగీకరించాయి. కాగా, చివరికి అఫ్గాన్ బోర్డు తమ నిర్ణయాన్ని మార్చుకొని పాకిస్థాన్కు షాకిచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో తమ క్రికెటర్ల మానసిక స్థితిని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ బోర్డు సీఈవో హమీద్ షిన్వారి పీటీఐకి చెప్పారు. మరోవైపు తాలిబన్ల పాలనలో ఆ దేశంలో క్రికెట్కు ఎలాంటి నష్టం జరగకూడదని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
అనంతరం ఈ విషయంపై స్పందించిన పాక్ బోర్డు.. ఈ సిరీస్ జరగడానికి అఫ్గాన్తో తాము పూర్తిగా సహకరించామని, ఇరు జట్ల మధ్య ఈ ద్వైపాక్షిక సిరీస్ జరుగుతుందని ఆశించామని వివరించింది. ఇప్పుడు ఆ దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వాయిదాకు అంగీకరించామని చెప్పింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM