Ashes Series : యాషెస్ సిరీస్ ఓటమి.. రూట్ తప్పుకోవాలన్న మాజీ కెప్టెన్
యాషెస్ సిరీస్ను ఇంగ్లాండ్ ఓడిపోవడంతో ఆ జట్టు సారథి జో రూట్పై విమర్శల...
ఇంటర్నెట్ డెస్క్: యాషెస్ సిరీస్ను ఇంగ్లాండ్ ఓడిపోవడంతో ఆ జట్టు సారథి జో రూట్పై విమర్శల వర్షం కురుస్తోంది. ఐదు టెస్టుల యాషెస్ సిరీస్ను మరో రెండు మ్యాచ్లు ఉండగానే ఆసీస్ 3-0 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో జో రూట్ వెంటనే కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలనే డిమాండ్లూ వస్తున్నాయి. ఈ క్రమంలో సిరీస్ ఓటమికి రూట్ బాధ్యత వహించాలని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్, కెప్టెన్ మైఖేల్ అథర్టెన్ విమర్శించాడు. అంతేకాకుండా యాషెస్ ఓటమికి ప్రధాన కోచ్ క్రిస్ సిల్వర్వుడ్ కూడా బాధ్యుడేనని వ్యాఖ్యానించాడు.
‘‘యాషెస్ సిరీస్కు జట్టును ఎంపిక చేయడం నుంచి ప్రణాళికల వరకు ఎన్నో తప్పులు జరిగాయి. అందుకే సిరీస్ ఓటమికి కెప్టెన్గా బాధ్యత వహించాలి. రూట్ మంచి కెప్టెనే. ఆటగాడిగానూ చాలా బాగా రాణించాడు. ఇంగ్లాండ్ టెస్టు క్రికెట్కు రాయబారిగా వ్యవహరించాడు. గత ఐదేళ్లు ఎంతో కష్టపడ్డాడు. అయితే ఆసీస్లో యాషెస్ సిరీస్లో మాత్రం సారథ్యపరంగా గడ్డుకాలం ఎదుర్కొన్నాడు. అందుకే ఇది మరొకరిని ఎంచుకునే సమయం కావచ్చు. రూట్కు ప్రత్యామ్నాయంగా ఆల్రౌండర్ బెన్స్టోక్స్ సరిపోతాడు’’ అని మైకెల్ పేర్కొన్నాడు. ఇప్పటికే సిరీస్ను కోల్పోయిన ఇంగ్లాండ్ జనవరి 5వ తేదీ నుంచి ఆసీస్తో నాలుగో టెస్టులో తలపడనుంది.
అసలు టెస్టు ఫార్మాట్కు పనికిరాదు
ప్రస్తుత ఫామ్ను చూస్తే ఇంగ్లాండ్ జట్టు టెస్టు ఫార్మాట్కు ఫిట్ కాదని మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. ‘‘అత్యుత్తమ ఆటగాళ్లు ఇందులో (టెస్టు జట్టు) ఆడేందుకు ఇష్టపడరు. ఇక యువ ఆటగాళ్లు నా మాదిరిగా ఇతర టాప్ ప్లేయర్ల నుంచి నేర్చుకోరు. పేలవమైన వికెట్ల మీద సగటు బౌలర్ల చేతిలో ఔట్ కావడం ఎంతో బాధాకరంగా ఉంది’’ అని వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)