Virushka: ‘మీకు మనస్ఫూర్తిగా రుణపడి ఉంటాం’.. ఫొటోగ్రాఫర్లపై అనుష్కశర్మ
టీమ్ఇండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ తాజాగా ఇండియన్ ఫొటోగ్రాఫర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్తున్న సమయంలో...
(Photo: Anushka Sharma Instagram)
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ తాజాగా భారత ఫొటోగ్రాఫర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్తున్న సమయంలో పలువురు ఫొటోగ్రాఫర్లు ముంబయి ఎయిర్పోర్ట్ వద్ద విరుష్క దంపతుల ముద్దుల కుమార్తె వామికా ఫొటోలు తీసేందుకు ప్రయత్నించారు. అయితే, కోహ్లీ వారిని ఫొటోలు తీయెద్దని కోరారు. ఈ క్రమంలోనే కోహ్లీ మాటను గౌరవించి ఆ చిన్నారి ఫొటోలను బయటపెట్టనందుకు అనుష్క కృతజ్ఞతలు తెలుపుతూ ఈ పోస్టు చేశారు. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఇలా రాసుకొచ్చారు.
‘మా చిన్నారి వామికా ఫొటోలు, వీడియోలను బాహ్య ప్రపంచానికి చూపించకుండా మా విన్నపానికి విలువ ఇచ్చిన ఫొటోగ్రాఫర్లు, మీడియా వ్యక్తులకు మేం మనస్ఫూర్తిగా రుణపడి ఉంటాం. ఇకపైనా మీరంతా ఇలాగే మాకు అండగా ఉంటారని అనుకుంటున్నా. మీడియాకు, సామాజిక మాధ్యమాలకు దూరంగా మా కుమార్తె స్వేచ్ఛగా జీవించాలని కోరుకుంటున్నాం. తను పెద్దయ్యాక ఎలాగూ మేం తన స్వేచ్ఛకు అడ్డు చెప్పం కాబట్టి.. ఇప్పుడైనా తనని ఇలా వదిలేయాలని కోరుతున్నాం. అందుకు మీ సంపూర్ణ సహకారం కావాలని ఆశిస్తున్నాం. అలాగే సామాజిక మాధ్యమాల్లోనూ మా కూతురి ఫొటోలు పోస్టు చేయని నెటిజన్లకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు’ అని అనుష్క పోస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్