Ash to Shardul : మా బ్యాటింగ్‌లోని లోపాలను శార్దూల్‌ ఎత్తిచూపాడు : అశ్విన్‌

 టీమ్‌ఇండియా ఆల్‌ రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌పై టాప్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్ అశ్విన్‌ ప్రశంసల జల్లు..

Published : 29 Dec 2021 01:41 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియాలో ఆల్‌రౌండర్‌గా ఎదుగుతున్న శార్దూల్‌ ఠాకూర్‌పై టాప్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్ అశ్విన్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. టీమ్‌ఇండియా ఆటగాళ్ల బ్యాటింగ్‌లోని లోపాలను శార్దూల్‌ తన ఆటతో ఎత్తిచూపాడని అశ్విన్‌ వివరించాడు. అంతేకాకుండా లోయర్‌ఆర్డర్‌ బ్యాటింగ్‌లో నాణ్యతను తీసుకొచ్చాడని తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో షేర్‌ చేసింది. 2020-21 బోర్డర్‌ - గావస్కర్ ట్రోఫీ సందర్భంగా క్లిష్టమైన పరిస్థితుల్లో శార్దూల్ అర్దశతకాలు సాధించి అందరి మన్ననలు పొందాడు. ఈ క్రమంలో గత సంఘటనలను అశ్విన్‌ గుర్తు చేసుకుంటూ.. ‘‘మన బ్యాటర్లు విదేశాల్లో ఎక్కువగా షార్ట్‌ లెన్త్‌ బంతులను ఆడేందుకు యత్నించి ఔటయ్యేవారు. అయితే ఆసీస్‌ గడ్డ మీద ఠాకూర్‌ హుక్‌-పుల్‌ షాట్లతో పరుగులు రాబట్టాడు. మా అందరిలోని లోపాలను తన బ్యాటింగ్‌తో ఎత్తి చూపాడు. అలానే ఇంగ్లాండ్‌లోనూ రాణించాడు. ఇదే ఫామ్‌ను దక్షిణాఫ్రికాలోనూ కొనసాగించాలని ఆశిస్తున్నా’’ అని పేర్కొన్నాడు. 

ప్రస్తుతం అశ్విన్‌, శార్దూల్‌ దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నారు. సెంచూరియన్‌ వేదికగా భారత్, సౌతాఫ్రికా జట్ల  తొలి టెస్టు మ్యాచ్‌ జరుగుతోంది. వర్షం కారణంగా నిన్న రెండో రోజు ఆట రద్దైంది. 272/3 స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమ్‌ఇండియా 327 పరుగులకు ఆలౌటైంది. పిచ్‌ తేమగా ఉండటంతో దక్షిణాఫ్రికా బౌలర్లు విజృంభించారు. భారత్‌ కేవలం 55 పరుగులకే మిగతా ఏడు వికెట్లను కోల్పోయింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని