Rohit Sharma: రోహిత్పై భారీ ఆశలు ఉంటాయి... భవిష్యత్ సారథిని సిద్ధం చేసుకోవాలి
భారత వన్డే జట్టు కెప్టెన్గా రోహిత్ శర్మను నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్న...
ఇంటర్నెట్ డెస్క్: భారత వన్డే జట్టు కెప్టెన్గా రోహిత్ శర్మను నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా పర్యటనలో విరాట్ కోహ్లీ స్థానంలో రోహిత్ జట్టు పగ్గాలను అందుకుంటాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ కేవలం టెస్టు జట్టుకు మాత్రమే నాయకత్వం వహిస్తాడు. ఈ క్రమంలో రోహిత్ నియామకంపై ఇప్పటికే పలువురు మాజీలు ప్రశంసలు కురిపించారు. సెలెక్షన్ కమిటీ మంచి నిర్ణయం తీసుకుందని అభినందించారు. ఈ క్రమంలో టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ‘విరాట్ కోహ్లీ తర్వాత నూతన సారథిగా ఎంపికైన రోహిత్ శర్మపై భారీ ఆశలు, అంచనాలు ఉంటాయి. అలానే జట్టును నడిపించే సామర్థ్యం రోహిత్కు ఉందని నా నమ్మకం. కొత్త సారథికి శుభాకాంక్షలు’ అని పోస్ట్ చేశాడు.
ఇద్దరు సారథుల నియామకంపై బీసీసీఐ మంచి నిర్ణయం తీసుకుందని మాజీ చీఫ్ సెలెక్టర్ వెంగ్సర్కార్ అభినందించారు. అలానే భవిష్యత్తు కెప్టెన్ ఎవరనేదానిపైనా సెలక్టర్లు దృష్టిసారించాలని సూచించారు. ‘‘సరైన సమయంలో రోహిత్ శర్మను కెప్టెన్గా బీసీసీఐ నియమించింది. ఆటగాడిగా రోహిత్ ఎంతో మెరుగ్గా రాణించాడు. తన సారథ్య బాధ్యతల కోసం వేచి ఉన్నాడు. ఇప్పటికే కెప్టెన్గా ఎంతో నిరూపించుకున్నాడు. ఐపీఎల్లో ముంబయిని ఐదు సార్లు ఛాంపియన్గా నిలబెట్టాడు. విరాట్ కోహ్లీ కూడా అద్భుతమైన పనితీరు కనబరిచాడు. ఈ నిర్ణయంతో తన భుజాలపై ఉన్న ఒత్తిడి తగ్గించినట్లే. ఇక నుంచి టెస్టు క్రికెట్ మీద కోహ్లీ.. వన్డే, పొట్టి ఫార్మాట్ల మీద రోహిత్ మరింత ఏకాగ్రత పెట్టే అవకాశం ఉంది’’ అని వివరించారు. డ్రెస్సింగ్ రూమ్లో రెండు పవర్సెంటర్లు అవుతాయనే వాదనను వెంగ్సర్కార్ తోసిపుచ్చారు. ఇంగ్లాండ్ జట్టును తీసుకుంటే జో రూట్, ఇయాన్ మోర్గాన్ కూడా తమ జట్లను అద్భుతంగా నడిపిస్తున్నారని ఉదహరించారు. అదే విధంగా కోహ్లీ, రోహిత్ సమన్వయం చేసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
కోహ్లీ స్థానంలో రోహిత్ను ఎలా నియమించారనే దానిపై ఇప్పటికే బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ వివరణ ఇచ్చాడు. తెల్లబంతి క్రికెట్లో రెండు ఫార్మాట్ల జట్లకు వేర్వేరు సారథులు ఉండటం సరికాదని సెలెక్టర్లు భావించినట్లు పేర్కొన్నాడు. ‘‘బీసీసీఐనే ముందు టీ20 జట్టు సారథ్యం నుంచి తప్పుకోవద్దని సూచించింది. దానికి విరాట్ అంగీకరించలేదు. అయితే వన్డే, టీ20 ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లు ఉండకూడదని సెలెక్టర్లు భావించారు. అందుకే విరాట్ కోహ్లీని టెస్టు సారథిగా కొనసాగిస్తూ.. మిగతా రెండు ఫార్మాట్లకు రోహిత్ను నియమించాం. వ్యక్తిగతంగా నాతోపాటు సెలెక్టర్లు విరాట్తో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని తెలిపాడు.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
పంజాబ్పై 9 పరుగుల తేడాతో ముంబయి గెలిచింది. కానీ, ఆ జట్టుకు అంపైర్లు మద్దతుగా నిలిచారనే ఆరోపణలు వస్తున్నాయి. -
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
క్రికెటర్లు తాము కొట్టే షాట్.. లేదా తీసే వికెట్ జీవితాంతం మరిచిపోకుండా ఉంటారు. అలాంటి అనుభవం పంజాబ్ బ్యాటర్ అశుతోష్ శర్మకూ ఎదురైంది. -
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ