Ravi shastri: శాస్త్రికి కరోనా అని తెలియగానే కుర్రాళ్లు ఎలా కలత చెందారంటే..!
రవిశాస్త్రికి కొవిడ్-19 వచ్చిందని తెలియడంతో టీమ్ఇండియా కుర్రాళ్లంతా కలవరపడ్డారని బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్ అన్నాడు. మ్యాచులో మెరుగైన స్థితిలో ఉండటం అవసరం కాబట్టి తిరిగి ఏకాగ్రతతో ఆడారని పేర్కొన్నాడు...
లండన్: రవిశాస్త్రికి కొవిడ్-19 వచ్చిందని తెలియడంతో టీమ్ఇండియా కుర్రాళ్లంతా కలవరపడ్డారని బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్ అన్నాడు. మ్యాచులో మెరుగైన స్థితిలో ఉండటం అవసరం కాబట్టి తిరిగి ఏకాగ్రతతో ఆడారని పేర్కొన్నాడు. శనివారం సాయంత్రం నుంచే శాస్త్రి అసౌకర్యంగా కనిపించారని వెల్లడించాడు. నాలుగో రోజు ఆట ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడాడు.
ఇంగ్లాండ్, భారత్ నాలుగో టెస్టు రసవత్తరంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. నాలుగో రోజు అద్భుతంగా ఆడిన టీమ్ఇండియా రెండో ఇన్నింగ్స్లో 466 పరుగులు చేసింది. రోహిత్ శర్మ శతకానికి తోడుగా చెతేశ్వర్ పుజారా, శార్దూల్ ఠాకూర్, రిషభ్పంత్ కీలకమైన అర్ధశతకాలు బాదేశారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఉమేశ్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా సైతం సమయోచితంగా పరుగులు చేశారు. అయితే ఆట ఆరంభానికి ముందు రవిశాస్త్రికి కొవిడ్-19 సోకినట్టు తెలిసింది. అతడితో సన్నిహితంగా మెలిగిన బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్, ఫిజియోథెరపిస్టు నితిన్ పటేల్ను ముందు జాగ్రత్తగా ఐసోలేషన్కు పంపించారు. కోచ్ల మద్దతు లేకుండానే టీమ్ఇండియా బ్యాటింగ్ చేసింది.
‘నిజమే, మేం వారి సేవలను మిస్సయ్యాం. రవి భాయ్, అరుణ్, శ్రీధర్ ఈ జట్టుకు అత్యంత కీలకం. ఐదారేళ్లుగా వారు జట్టు ప్రదర్శనలో కీలకంగా ఉన్నారు. కానీ జరిగిన దాన్ని మనం అడ్డుకోలేం. ఏదేమైనా వారీ సమయంలో మా వద్ద లేరు. అందుకే ఆదివారం ఉదయం ఆటగాళ్లు కాస్త కలత చెందారు. మా చేతుల్లో ఏం లేదని భావించాం. ఏకాగ్రతతో క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నాం’ అని రాఠోడ్ తెలిపాడు.
‘మేమీ సిరీసు ఆడేందుకు వచ్చాం. మాకు ఈ సిరీసు ఎంతో కీలకం. నాలుగో రోజు అత్యంత కీలకమని మాకు తెలుసు. అందుకే క్రికెట్పై దృష్టిసారించాం. కుర్రాళ్లు సైతం అదరగొట్టారు. శనివారం రాత్రి జరిగిన పరిణామాలతో ఆటగాళ్లు కలతపడతారని తెలుసు. దానిని అధిగమించి రాణించినందుకు వారికి అభినందనలు’ అని రాఠోడ్ అన్నాడు.
శనివారం టెస్టు చేయగానే రవిశాస్త్రి అసౌకర్యంగా కనిపించాడని రాఠోడ్ తెలిపాడు. ‘కచ్చితంగా సమయమెంతో చెప్పలేను. రాత్రి 8 గంటలకు అనుకుంటా. శాస్త్రి కొద్దిగా నలతగా కనిపించాడు. దాంతో వైద్యబృందం మళ్లీ టెస్టు చేసింది. అందులో పాజిటివ్ వచ్చింది. ఆ విషయం తెలియగానే సన్నిహితంగా మెలిగిన వారిని ఐసోలేషన్కు పంపించారు. మళ్లీ వారెప్పుడు జట్టుతో కలుస్తారో వైద్య బృందం చెప్తుంది’ అని రాఠోడ్ వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
బెంగళూరు - కోల్కతా జట్ల మధ్య ఆసక్తికర పోరు నేడు. ఇరు జట్లలోనూ కీలక ఆటగాళ్లు ఉన్నారు. -
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
బెంగళూరు, కోల్కతా జట్ల మధ్య మ్యాచ్ నేపథ్యంలో అందరి దృష్టి ఇద్దరి క్రికెటర్లపైనే ఉంది. -
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
ధోనీతో తనకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా గుర్తు చేసుకున్నాడు. -
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ