Dhoni - CSK: ధోనీ అభిమానులకు శుభవార్త.. వచ్చే ఐపీఎల్పై క్లారిటీ..
చెన్నై సూపర్ కింగ్స్, సారథి మహేంద్రసింగ్ ధోనీ అభిమానులకు శుభవార్త. వచ్చే ఏడాది కూడా మహీ చెన్నై జట్టులోనే కొనసాగుతాడని ఆ జట్టు ప్రతినిధి తాజాగా మీడియాకు వెల్లడించారు...
ఇంటర్నెట్డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోనీ అభిమానులకు శుభవార్త. వచ్చే ఏడాది కూడా మహీ చెన్నై జట్టులోనే కొనసాగుతాడని ఆ జట్టు ప్రతినిధి తాజాగా మీడియాకు వెల్లడించారు. వచ్చే ఏడాది మరో రెండు జట్లు కొత్తగా ఐపీఎల్లో చేరుతున్న నేపథ్యంలో ఈసారి మెగా వేలం నిర్వహించనున్నారు. అయితే, పాత జట్లు పలువురు కీలక ఆటగాళ్లను అట్టిపెట్టుకునే వీలు కల్పించడంతో చెన్నై తొలి రిటెన్షన్ కార్డును ధోనీ కోసమే ఉపయోగిస్తామని ఆయన అన్నారు. దీంతో ధోనీ వచ్చే ఏడాది కూడా చెన్నై తరఫున ఉంటాడని అర్థమవుతోంది.
మరోవైపు కోల్కతాపై తుదిపోరులో గెలిచిన అనంతరం ధోనీ మాట్లాడుతూ తన భవితవ్యంపైనా స్పందించాడు. చెన్నై తరఫున వచ్చే సీజన్లో ఆడే విషయాన్ని కొట్టిపారేయలేదు. కానీ ఫ్రాంఛైజీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు. ‘‘సీఎస్కేకు ఏది మంచిదో మేం నిర్ణయించాలి. అది ముగ్గురు కావొచ్చు లేదా నలుగురు కావొచ్చు.. ఫ్రాంఛైజీ అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాలో నేనుంటానా లేదా అన్నది ముఖ్యం కాదు. బలమైన జట్టు ఉండేలా, ఫ్రాంఛైజీ ఇబ్బంది పడకుండా చూడడం ముఖ్యం. వచ్చే వేలంతో వచ్చే పదేళ్ల కోసం జట్టును తయారు చేసుకోవాలి. 2008 నుంచి చెన్నై ప్రధాన జట్టు పదేళ్లకు పైగా ఉంది. వచ్చే పదేళ్లు కూడా ప్రధాన జట్టుతో ముందుకెళ్లడానికి మేం బాగా కష్టపడాలి’’ అని ధోని అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.