IPL 2021: శార్దూల్ ఠాకూర్కు బెస్ట్ బర్త్డే గిఫ్ట్.. జీవితంలో మర్చిపోలేడు
ఇది తనకు జీవితాంతం గుర్తుండిపోయే పుట్టినరోజు బహుమతి అని చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ సంతోషం వ్యక్తం చేశాడు...
ఇంటర్నెట్డెస్క్: ఇది తనకు జీవితాంతం గుర్తుండిపోయే పుట్టినరోజు బహుమతి అంటూ చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ సంతోషం వ్యక్తం చేశాడు. గతరాత్రి ఐపీఎల్ ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఆ జట్టు నాలుగోసారి టైటిల్ తన ఖాతాలో వేసుకుంది. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ అనంతరం శార్దూల్ మాట్లాడుతూ ఇదే తనకు అత్యుత్తమ బర్త్డే గిఫ్ట్ అని సంబరపడ్డాడు. చెన్నై ఈ మ్యాచ్ గెలిచిన కాసేపటికే ఈ పేస్ ఆల్రౌండర్ 30వ జన్మదినంలోకి అడుగుపెట్టాడు. దీంతో జట్టు సభ్యులంతా అతడి పుట్టిన రోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. అందుకు సంబంధించిన వీడియోను ఆ ఫ్రాంఛైజీ ట్విటర్లో అభిమానులతో పంచుకుంది.
చెన్నై విజయంలో శార్దూల్ ఠాకూర్ కీలకపాత్ర పోషించాడు. ధోనీసేన నిర్దేశించిన 193 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోల్కతా ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్ (50), శుభ్మన్ గిల్ (51) శుభారంభం చేశారు. 10 ఓవర్లలోనే తొలి వికెట్కు 91 పరుగులు జోడించి జట్టును తిరుగులేని స్థితిలో నిలిపారు. ఈ క్రమంలోనే శార్దూల్ 11వ ఓవర్ బౌలింగ్ చేసి రెండు కీలక వికెట్లు తీశాడు. దీంతో ఒక్కసారిగా చెన్నై పోటీలోకి వచ్చింది. తొలుత నాలుగో బంతికి వెంకటేశ్ను పెవిలియన్కు పంపాడు. తర్వాత ఆరో బంతికి నితీశ్ రాణా (0)ను డకౌట్ చేశాడు. అలా కోల్కతా 93 పరుగులకు రెండు కీలక వికెట్లను కోల్పోయింది. అనంతరం 16వ ఓవర్లోనూ శార్దూల్ మరోసారి మెరిశాడు. మిడిల్ ఆర్డర్లో కోల్కతాకు వెన్నెముకలా ఉండే రాహుల్ త్రిపాఠి(2)ని సైతం వెనక్కి పంపి కోల్కతాకు గెలుపు ఆశల్ని దూరం చేశాడు. అప్పటికి ఆ జట్టు స్కోర్ 123/7గా నమోదైంది. ఇక చివర్లో ఫెర్గూసన్ (18), శివమ్ మావి (20) ధాటిగా ఆడినా ఉపయోగం లేకపోయింది. ఆ జట్టు 20 ఓవర్లలో 165/9 స్కోర్తో సరిపెట్టుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి