
IND vs ENG: ఐదో టెస్టు రీషెడ్యూల్ కోసం రంగంలోకి గంగూలీ
ఇంటర్నెట్డెస్క్: కరోనా కేసుల కారణంగా ఇంగ్లాండ్తో శుక్రవారం ప్రారంభంకావాల్సిన ఐదో టెస్టు రద్దవ్వడం అందర్నీ నిరాశకు గురిచేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మ్యాచ్ను నిలిపివేసినా భవిష్యత్లో తిరిగి నిర్వహించడానికి బీసీసీఐ ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) తోనూ సంప్రదింపులు జరుపుతోంది. అయితే, ఇదే విషయంపై ఈసీబీ ప్రతినిధులతో మాట్లాడేందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ త్వరలో ఇంగ్లాండ్కు వెళ్లనున్నాడని తెలిసింది. ఐదో టెస్టు రద్దు కావడం వల్ల ఇరు జట్లకూ పెద్దమొత్తంలో నష్టం కలిగే అవకాశం ఉండటంతో ఎలాగైనా రీషెడ్యూల్ చేయాలని బీసీసీఐ చూస్తోంది. సెప్టెంబర్ 22న గంగూలీ అక్కడికి వెళ్లి ఈసీబీతో పాటు మ్యాచ్ ప్రసార హక్కుదారులతో చర్చలు జరుపుతాడని సమాచారం.
అసలేం జరిగింది..
ఐదో టెస్టుకు ముందు రోజు గురువారం సాయంత్రం భారత బృందంలోని సహాయక సిబ్బందిలో యోగేశ్ పార్మర్ అనే వ్యక్తికి కరోనా పాజిటివ్గా తేలింది. అయితే, అతడితో పలువురు ఆటగాళ్లు ప్రైమరీ కాంటాక్ట్లుగా ఉన్నారని తెలిసింది. తర్వాత ఆటగాళ్లందరికీ ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయగా నెగెటివ్గా తేలింది. అయినా టీమ్ఇండియా ముందు జాగ్రత్త చర్యగా చివరి టెస్టులో ఆడలేమని బీసీసీఐకి లేఖరాసింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఇరు బోర్డుల పెద్దలు చర్చించి మ్యాచ్ను రద్దు చేశారు. అయితే ఎలాగైనా ఈ మ్యాచ్ను తిరిగి నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. మరోవైపు ఈ సిరీస్లో టీమ్ఇండియా 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఐదో మ్యాచ్పై స్పష్టత లేకపోవడంతో సిరీస్ ఫలితం కూడా తేలాల్సి ఉంది. ఇక ఓవల్ వేదికగా నాలుగో టెస్టుకు ముందు టీమ్ఇండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్కు పాజిటివ్గా తేలిన సంగతి తెలిసిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.