Chris Woakes: ఇంకా 291.. ఇంగ్లాండ్ ఛేదించగలదు!
టీమ్ఇండియా నిర్దేశించిన 368 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఛేదించగలదని ఆల్రౌండర్ క్రిస్వోక్స్ ధీమా వ్యక్తం చేశాడు. గతంలో భారీ లక్ష్యాలను ఛేదించిన అనుభవం తమకు ఉందన్నాడు...
లండన్: టీమ్ఇండియా నిర్దేశించిన 368 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఛేదించగలదని ఆల్రౌండర్ క్రిస్వోక్స్ ధీమా వ్యక్తం చేశాడు. గతంలో భారీ లక్ష్యాలను ఛేదించిన అనుభవం తమకు ఉందన్నాడు. నాలుగో రోజు ఆఖర్లో తాము వికెట్ నష్టపోకుండా 77 పరుగులు చేశామని గుర్తుచేశాడు. జట్టు సమష్టిగా ఆడితే గెలుపు కష్టమేమీ కాదని అంటున్నాడు.
నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్లో భారత్ 466 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్ పరుగుల లోటు మినహాయించి 368 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. బదులుగా ఆదివారం ఆట ముగిసే సరికి ఆంగ్లేయులు వికెట్ నష్టపోకుండా 77 పరుగులు చేశారు. ఓపెనర్లు హసీబ్ హమీద్ (43), రోరీ బర్న్స్ (31) అజేయంగా నిలిచారు.
‘గొప్ప టెస్టులో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఏదేమైనా తొలి రెండు రోజులతో పోలిస్తే ఆఖరి రెండు రోజులు టెస్టు క్రికెట్లో ఎక్కువ కష్టపడాలి. మేం ఎక్కువ గంటలు ఫీల్డింగ్ చేశాం. అలసిపోయినా మా ఓపెనర్లు అజేయంగా నిలవడం అభినందనీయం. ఆఖరి రోజు కీలకం కానుంది’ అని వోక్స్ అన్నాడు. ఇంగ్లాండ్ విజయం సాధించాలంటే సోమవారం ఇంకా 291 పరుగులు చేయాలి.
‘ఆఖరి రోజు పిచ్పై 291 పరుగులు చేయడం కష్టమైన పనే! కానీ వికెట్ ఇంకా బ్యాటింగ్కు అనుకూలిస్తుందని గుర్తుంచుకోవాలి. రోజంతా బ్యాటింగ్ చేస్తే మేం గెలవగలం. ఆ నమ్మకం మాకుంది. ఇందుకెంతో శ్రమించాలి’ అని క్రిస్వోక్స్ తెలిపాడు.
ఇంగ్లాండ్ తన సొంతగడ్డపై ఇప్పటి వరకు ఛేదించిన అత్యధిక స్కోరు 362/9. హెడింగ్లే వేదికగా ఆఖరి వికెట్ను కాచుకొని బెన్స్టోక్స్ 135 పరుగులతో అజేయంగా నిలవడంతో ఆ గెలుపు దక్కింది. అతడి బ్యాటింగ్ యాషెస్ సిరీసును మలుపుతిప్పింది. ఇక గతేడాది పాక్ నిర్దేశించిన 277 పరుగుల లక్ష్యాన్ని ఆంగ్లేయులు ఛేదించారు. క్రిస్వోక్స్ 84తో అజేయంగా నిలిచాడు.
‘మా గత అనుభవాలు ఇప్పుడు ఉపయోగపడతాయి. జట్టుగా మేమిది చేయగలం. నమ్మకంతో ఆడటమే ముఖ్యం. గతంలో వేర్వేరు ఫార్మాట్లలో ఈ జట్టు అద్భుతాలు చేసింది. పిచ్ కాస్త మెరుగ్గా అనిపించడంతో ఫాస్ట్ బౌలర్లమైన మేం ఎక్కువగా బంతులు వేయాల్సి వచ్చింది. 45+ ఓవర్లు విసిరాం. వికెట్లు తీసేందుకు శ్రమించాం. చాలామందిమి అలిసిపోయాం. పుంజుకొని సోమవారం బాగా ఆడతామన్న విశ్వాసం ఉంది’ అని వోక్స్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’ ఓటీటీలోకి ‘టిల్లు స్క్వేర్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్