Harbhajan Singh : ‘మంకీగేట్ వివాదం’ గురించి త్వరలోనే తెలియజేస్తా : హర్భజన్
టీమ్ఇండియా 2008 ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీ టెస్టులో జరిగిన ‘మంకీగేట్ వివాదం’ రచ్చ అంతా ఇంతా కాదు. ఈ మొత్తం వ్యవహారం భారత స్పిన్నర్ హర్భజన్సింగ్, ఆస్ట్రేలియా ఆల్రౌండర్ ఆండ్రూ సైమండ్స్ చుట్టూనే తిరిగింది...
ఇంటర్నెట్డెస్క్: 2008లో టీమ్ఇండియా ఆస్ట్రేలియా పర్యటనలో చోటుచేసుకున్న ‘మంకీగేట్ వివాదం’ రచ్చ అంతా ఇంతా కాదు. ఈ మొత్తం వ్యవహారం భారత స్పిన్నర్ హర్భజన్సింగ్, ఆస్ట్రేలియా ఆల్రౌండర్ ఆండ్రూ సైమండ్స్ చుట్టూనే తిరిగింది. ఇది అప్పట్లో పెను సంచలనంగా మారి పతాక శీర్షికల్లో నిలిచింది. ఈ వివాదంలో భజ్జీ జాతివిద్వేష వ్యాఖ్యలు చేయలేదని తేలినా.. చివరికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోతకు గురయ్యాడు. ఇది అతడి కెరీర్లో మాయని మచ్చలా మారింది. ఇక హర్భజన్ శుక్రవారం రిటైర్మెంట్ ప్రకటించాక ఆ వివాదంపై తొలిసారి స్పందించాడు. నాడు మైదానంలో ఏం జరిగిందనే విషయాన్ని త్వరలోనే ప్రజల ముందుకు తెస్తానన్నాడు.
‘ఆ వివాదం మొత్తంలో ఎవరూ నా వైపు ఉన్న నిజం గురించి ఆలోచించలేదు. అప్పట్లో కొన్ని వారాల పాటు నేనెలాంటి మానసిక ఆందోళనకు గురయ్యానో ఎవరూ పట్టించుకోలేదు. ఈ విషయంపై నేనెప్పుడూ ఎవరికీ పూర్తి వివరణ ఇవ్వలేదు. కానీ, త్వరలోనే ప్రజలందరికీ నా ఆటోబయోగ్రఫీ ద్వారా ఏం జరిగిందనే విషయం తెలుస్తుంది. ఆ సమయంలో నేను ఎలాంటి పరిస్థితులకు గురయ్యానో ఎవరూ అనుభవించకూడదు’ అని హర్భజన్ చెప్పుకొచ్చాడు.
అసలేం జరిగింది..?
సిడ్నీలో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 463 పరుగులు చేసింది. సైమండ్స్ (162*) భారీ శతకం సాధించాడు. అనంతరం వీవీఎస్ లక్ష్మణ్ (109), సచిన్ (154*) శతకాలతో చెలరేగడంతో భారత్ 532 పరుగులు చేసింది. మధ్యలో హర్భజన్ (63) పరుగులు చేశాడు. అయితే, ఇన్నింగ్స్ 116వ ఓవర్ తర్వాత భజ్జీ నాన్స్ట్రైకింగ్ వైపు వెళ్లి సైమండ్స్తో ఏదో మాట్లాడాడు. వెంటనే ఇద్దరి మధ్య మాటలతూటాలు పేలాయి. ఇక మ్యాచ్ అనంతరం హర్భజన్.. సైమండ్స్పై జాతి విద్వేష వ్యాఖ్యలు చేశాడని, కోతి అని పిలిచాడని ఆ జట్టు కెప్టెన్ రికీపాంటింగ్.. అంపైర్లకు ఫిర్యాదు చేశాడు. ఇది మ్యాచ్ రిఫరీ వరకు వెళ్లగా టీమ్ఇండియా స్పిన్నర్పై 3 టెస్టుల నిషేధం పడింది. ఈ ఉదంతంపై పూర్తి విచారణకు ఆదేశించిన ఐసీసీ చివరికి హర్భజన్ అలాంటి వ్యాఖ్యలు చేశాడనడానికి ఆధారాలు లేకపోవడంతో నిషేధాన్ని తప్పించుకున్నాడు. కానీ, మ్యాచ్ ఫీజ్లో 50 శాతం కోతకు గురయ్యాడు. అయితే, ఈ విషయంలో ఆరోజు హర్భజన్.. సైమండ్స్తో ఏమన్నాడో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఈ వివాదంలో అసలు ఏం జరిగిందనే విషయాన్ని తర్వలోనే తెలియజేస్తానని భజ్జీ తాజాగా ప్రకటించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డేవన్ కాన్వే ఔట్.. మరో సీనియర్ ప్లేయర్కు చెన్నై అవకాశం
న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు డేవన్ కాన్వే ప్రస్తుత ఐపీఎల్ సీజన్ నుంచి వైదొలిగాడు. గాయం కారణంగా ఆటడం లేదని ఐపీఎల్ మేనేజ్మెంట్ వెల్లడించింది. -
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
ఐపీఎల్లో చెన్నై జట్టును తక్కువ చేయడం సరికాదని భారత మాజీ క్రికెటర్ శివరామకృష్ణన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. -
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
పొట్టి కప్ కోసం జట్టు ఎంపికపై ఇప్పటి వరకు తానెవరినీ కలవలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పష్టం చేశాడు. -
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
భారీ విజయంతో దిల్లీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగు పర్చుకుంది. సొంతమైదానంలోనే గుజరాత్ను చిత్తు చేసి ఈ సీజన్ ఐపీఎల్లో దిల్లీ మూడో విజయాన్ని నమోదు చేసింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
సూచీలకు వరుస నష్టాలు.. 22 వేల దిగువకు నిఫ్టీ
-
పదేళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందో చెప్పాలి?: పొన్నం ప్రభాకర్
-
‘అంతరిక్షమూ’ యుద్ధ క్షేత్రమే : త్రిదళాధిపతి అనిల్ చౌహాన్
-
చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన భీమిలి, జీడీ నెల్లూరు వైకాపా నేతలు
-
బెయిల్ కోసం.. కేజ్రీవాల్ మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారు: ఈడీ
-
రూ.27 అధిక వసూలు.. ఉబర్ ఇండియాకు రూ.28,000 జరిమానా