India vs England: కఠినంగా అనిపించినా.. కోహ్లీసేన ఆస్ట్రేలియా బ్రాండ్ క్రికెట్ ఆడుతోంది!
కఠినంగా అనిపించినా.. టీమ్ఇండియా మాత్రం ఆస్ట్రేలియా బ్రాండ్ క్రికెట్ ఆడుతోందని ఇంగ్లాండ్ సహాయ కోచ్ పాల్ కాలింగ్వుడ్ అంటున్నాడు. లార్డ్స్ టెస్టులో రెండు జట్లు నువ్వానేనా అన్నట్టు తలపడ్డాయని పేర్కొన్నాడు....
లండన్: కఠినంగా అనిపించినా.. టీమ్ఇండియా మాత్రం ఆస్ట్రేలియా బ్రాండ్ క్రికెట్ ఆడుతోందని ఇంగ్లాండ్ సహాయ కోచ్ పాల్ కాలింగ్వుడ్ అంటున్నాడు. లార్డ్స్ టెస్టులో రెండు జట్లు నువ్వానేనా అన్నట్టు తలపడ్డాయని పేర్కొన్నాడు. కోహ్లీ అత్యంత భావోద్వేగంతో జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడని వెల్లడించాడు. జో రూట్ ఇలాగే తన ఫామ్ కొనసాగిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు.
‘లార్డ్స్ టెస్టు నువ్వా నేనా అన్నట్టు సాగింది. రెండు జట్లు దాదాపుగా విజయానికి దగ్గరయ్యాయి. ఒక్క అవకాశాన్నీ కూడా వదిలేయొద్దన్నట్లు రెండు జట్లు పట్టుదల ప్రదర్శించాయి. ఎందుకంటే ఆటగాళ్లు పరస్పరం కవ్వించుకున్నప్పుడు గెలుపు వారికి అత్యంత కీలకం. అందుకే ఈ మ్యాచ్ అద్భుతం. ఏదేమైనా మేం ఫలితానికి మరో వైపు నిలిచాం. కానీ, రెండు జట్లు ఒకదానిపై మరొకటి ఆధిపత్యం చెలాయించాయి’ అని కాలింగ్వుడ్ అన్నాడు.
‘ఆస్ట్రేలియా తరహా ప్రవర్తన, వారి క్రికెట్ కాలం గడిచే కొద్దీ మారుతున్నాయి. కాస్త కఠినంగా అనిపించినా టీమ్ఇండియా మాత్రం ఆస్ట్రేలియాలా కనిపిస్తోంది. విరాట్ అద్భుతమైన ఆటగాడు. ఎంతో భావోద్వేగంతో జట్టును నడుపుతున్నాడు. ఇంగ్లాండ్ జట్టుగా మేం మా నిర్ణయాలపై దృష్టిపెడతాం. భారత్ చేస్తున్న దానిపై, తీసుకుంటున్న నిర్ణయాలపై మేం దృష్టి నిలపం. వారి నిర్ణయాలు వారిష్టం. మేమేం తీసుకుంటామో అదే మాకు కీలకం. వాటిద్వారా ప్రత్యర్థిపై ఒత్తిడి పెట్టడం అవసరం’ అని కాలింగ్వుడ్ తెలిపాడు.
‘మైదానంలో మేమెలా ప్రవర్తిస్తామన్నదే మాకు ముఖ్యం. కొన్ని సంక్లిష్ట నిర్ణయాలు తీసుకొని మేం టీమ్ఇండియాపై ఒత్తిడి పెంచాలని అనుకుంటున్నాం. మా పేసర్ జేమ్స్ అండర్సన్ ప్రతి సిరీసుకు సన్నద్ధమవుతాడు. అతడికి వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే. ఆ వయసు వారికి వరుసగా మ్యాచులు ఆడటం కష్టమే. కానీ, అతడు మాత్రం సూపర్ ఫిట్గా ఉన్నాడు. ఇక జో రూట్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. బంతిని చక్కగా చూస్తూ ఆడుతున్నాడు. సిరీస్ సాంతం అతడిలాగే ఆడతాడని మా విశ్వాసం’ అని వుడ్ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు