Yogesh Kathuniya: ఔరా..! కోచ్ లేకుండానే రజతం గెలిచిన కతునియా
భారత అథ్లెట్ యోగేశ్ కతునియా కోచ్ లేకుండానే పారాలింపిక్స్లో పతకం గెలిచాడు. ఏడాది కాలంగా కోచ్ లేకుండానే సాధన చేశానని అతడు తెలిపాడు...
దిల్లీ: భారత అథ్లెట్ యోగేశ్ కతునియా కోచ్ లేకుండానే పారాలింపిక్స్లో పతకం గెలిచాడు. ఏడాదిగా కోచ్ లేకుండానే సాధన చేశానని అతడు తెలిపాడు. ప్యారిస్ పారాలింపిక్స్లో కచ్చితంగా స్వర్ణం గెలుస్తానని ధీమా వ్యక్తం చేశాడు.
దిల్లీలోని కిరోరిమల్ కళాశాలలో బీకామ్ చదివిన 24 ఏళ్ల కతునియా టోక్యో పారాలింపిక్స్ డిస్కస్ త్రోలో రజతం గెలిచిన సంగతి తెలిసిందే. అతడు డిస్క్ను 44.38 మీటర్లు విసిరి అద్భుతం చేశాడు. ఆఖరి దఫా అయినా ఆరోసారి అతడీ ఘనత అందుకున్నాడు. ఐతే కోచ్ లేకుండానే అతడు ఈ రికార్డు సృష్టించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
‘నిజంగా ఇదో అద్భుతం. రజత పతకం గెలవడం 2024, ప్యారిస్ పారాలింపిక్స్లో స్వర్ణం గెలిచేందుకు ప్రేరణనిస్తోంది’ అని కతునియా అన్నాడు. కరోనా వైరస్ మహమ్మారితో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో సాధన చేసేందుకు రెండేళ్లు అతడు అడ్డంకులు ఎదుర్కొంటూనే ఉన్నాడు.
‘గత 18 నెలలుగా నా సాధన కఠినంగా సాగింది. ఆరు నెలలు లాక్డౌన్ ఉండటంతో భారత్లో ప్రతి స్టేడియం మూసేశారు. నేను మళ్లీ క్రమం తప్పకుండా స్టేడియానికి వెళ్లినప్పుడు ఒంటరిగా సాధన చేయాల్సి వచ్చింది. కోచ్ దొరకలేదు. దాంతో ఒక్కడినే సాధన చేశాను. అందుకే మార్గనిర్దేశకుడు లేకుండానే రజతం గెలవడం గొప్ప సందర్భం’ అని కతునియా తెలిపాడు.
యోగేశ్ తండ్రి సైన్యంలో పనిచేస్తారు. ఎనిమిదేళ్ల వయసులో పక్షవాతం రావడంతో కతునియా శరీరంలో కొన్ని అవయవాలు పనిచేయడం లేదు. అందుకే ఎంతో కష్టపడి పారాలింపిక్స్కు సిద్ధమయ్యాడు. వచ్చే మెగా క్రీడల్లో కచ్చితంగా స్వర్ణం గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
‘నేను మరింత శ్రమిస్తాను. టోక్యోలో ఒక మీటరు తేడాతో స్వర్ణం దూరమైంది. కానీ, ప్యారిస్లో ప్రపంచ రికార్డు బద్దలు కొడతాను. ఈరోజు నాది కాదు! ఎందుకంటే నేను ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాలన్న లక్ష్యంతోనే బరిలోకి దిగాను’ అని కతునియా అన్నాడు. 2019లో దుబాయ్లో జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో అతడు డిస్క్ను 42.51 మీటర్లు విసిరి కాంస్యం గెలవడం గమనార్హం. దాంతోనే టోక్యో బెర్త్ ఖాయం చేసుకున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.