KL Rahul: వేటు గాయమే ఇంధనమైంది.. నడిపించింది!
సుదీర్ఘ ఫార్మాట్లో వేటు పడటంతో బాధపడ్డానని టీమ్ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ అన్నాడు. ఇప్పుడదే బలంగా పునరాగమనం చేసేందుకు ఇంధనంలా ఉపయోగపడిందని పేర్కొన్నాడు...
లండన్: సుదీర్ఘ ఫార్మాట్లో వేటు పడటంతో బాధపడ్డానని టీమ్ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ అన్నాడు. ఇప్పుడదే బలంగా పునరాగమనం చేసేందుకు ఇంధనంలా ఉపయోగపడిందని పేర్కొన్నాడు. జట్టులో తన చోటు సుస్థిరం చేసుకొనేందుకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నానని తెలిపాడు. బీసీసీఐ తరఫున రోహిత్ శర్మ చేసిన ముఖాముఖిలో అతడు మాట్లాడాడు.
‘టెస్టుల్లోంచి తప్పించడం నిరాశ కలిగించింది. నేను గాయపడ్డాను. ఇందుకు నన్ను తప్ప మరెవ్వరినీ నిందించలేను. ఒక అవకాశం కోసం ఎదురు చూశాను. అది నాకెంతో అవసరం. రాగానే అందిపుచ్చుకున్నాను. నేను నా బ్యాటింగ్ను ఆస్వాదించాను. లార్డ్స్లో శతకం చేయడం మరింత ప్రత్యేకం’ అని రాహుల్ అన్నాడు.
‘నేనెలాంటి ఒత్తిడిని మోసుకురాలేదు. కొన్నిసార్లు గాయపడటం అవసరమే. ఎందుకంటే అది అదనంగా మనల్ని ముందుకు నెడుతుంది. మరింత శ్రమించేందుకు ఇంధనంగా మారుతుంది. నాకిప్పుడు అవకాశం వచ్చింది. జారవిడచాలని అనుకోలేదు’ అని రాహుల్ వెల్లడించాడు. ఈ రెండేళ్ల కాలంలో చేసుకున్న మార్పుల గురించి అతడు వివరించాడు.
‘జట్టులో చోటు పోకముందు నేను భిన్నమైన పరిస్థితుల్లో ఆడాను. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలో పర్యటించాను. ఆ దేశాల్లో తొలిసారే పర్యటిస్తున్నా పరుగులు చేసేందుకే పాకులాడాను. అక్కడి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను. నా మనసు గందరగోళంగా ఉందని గమనించాను. ప్రతి బంతికి రెండు షాట్లు ఆడాలనిపించేది. అదే పనిగా పరుగుల గురించే ఆలోచించేవాడిని’ అని రాహుల్ తెలిపాడు.
‘ఈ సారి కేవలం బంతిని చూసి ఆడాలని నాకు నేను చెప్పుకున్నాను. పరుగుల కోసం పాకులాడొద్దని అర్థం చేసుకున్నా. రాత్రికిరాత్రే ఇదంతా మారిపోలేదు. ఈ రెండేళ్లలో సాధన చేశాను. ఇతర ఆటగాళ్ల ఆటను చూశాను. పరుగులు చేయడం, ఇన్నింగ్స్ నిర్మించే ప్రక్రియ ఒకటే. అదే నాకు సాయం చేసింది. టెస్టు క్రికెట్ నాకెంతో ఇష్టం. లార్డ్స్లో 100 చేశానని కాదు. ఇందులో ఉండే ఆనందం వేరు. టెస్టు క్రికెటర్ అవ్వాలనే నేను ఎదిగాను. నేను పెరిగే క్రమంలో మా నాన్న టెస్టు క్రికెట్ను ఆస్వాదించేవారు. మా కోచ్లు సైతం సుదీర్ఘ ఫార్మాట్లో రాణించాలని పదేపదే చెప్పేవారు’ అని రాహుల్ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)