పగలు కలెక్టర్.. రాత్రి బ్యాడ్మింటన్ ప్లేయర్!
ప్రపంచ శ్రేణి క్రీడల్లో పాల్గొనే ఏ అథ్లెట్ అయినా పతకాలు సాధించాలని బలంగా కోరుకుంటారని, అందుకు తానూ మినహాయింపేమీ కాదన్నారు యూపీలోని నోయిడా జిల్లా మెజిస్ట్రేట్ సుహాస్ యతిరాజ్ అన్నారు..........
పారాలింపిక్స్లో పతకమే లక్ష్యం..
ఇంటర్నెట్డెస్క్: ప్రపంచ శ్రేణి క్రీడల్లో పాల్గొనే ఏ అథ్లెట్ అయినా పతకాలు సాధించాలని బలంగా కోరుకుంటారని, అందుకు తానూ మినహాయింపేమీ కాదన్నారు యూపీలోని నోయిడా జిల్లా మెజిస్ట్రేట్ సుహాస్ యతిరాజ్ అన్నారు. ఆగస్టు 24నుంచి ప్రారంభమయ్యే పారాలింపిక్స్ క్రీడల్లో ఐఏఎస్ అధికారి బ్యాడ్మింటన్ విభాగంలో పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం మీడియాతో ముచ్చటించిన ఆయన తన అభిప్రాయాలు పంచుకున్నారు. సుహాస్ పారా-బ్యాడ్మింటన్ విభాగంలో ప్రపంచంలో మూడో ర్యాంకులో కొనసాగుతున్నారు.
‘విజయాలకు, వైఫల్యాలకు తేడా చాలా చిన్నది. ఏళ్లుగా మనందరం ఇది చూస్తూనే ఉన్నాం. నేను కూడా సెంటిమీటర్ల తేడాతో విజయాలు, మిల్లీమీటర్ల తేడాతో ఓటమిలు చవిచూసినవాడినే. రాబోయే పారాలింపిక్స్ క్రీడల్లో ఇతర అథ్లెట్లలాగే నేనూ పతకం సాధించాలనుకుంటున్నా. అలాగే నేను భగవద్గీతను కూడా బలంగా నమ్ముతా. అందులో చెప్పినట్లు మన పని మనం చేస్తే.. ఫలితం దానంతట అదే వస్తుంది. అందుకోసం మనం కృషి చేయాలి. మరోవైపు, ప్రస్తుత పరిస్థితుల్లోనూ నేను ఒత్తిడికి గురికావట్లేదు. ఇప్పుడు పారా-బ్యాడ్మింటన్ విభాగంలో ప్రపంచ మూడో ర్యాంకులో ఉన్నందున కచ్చితంగా పతకం సాధించాలని అనుకుంటున్నా’ అని సుహాస్ పేర్కొన్నారు.
ఇక కరోనా విపత్కర పరిస్థితుల్లో అటు ఉద్యోగం, ఇటు బ్యాడ్మింటన్ను ఎలా సమన్వయం చేసుకున్నారని అడిగిన ప్రశ్నకు.. రెండింటిపై తనకున్న అంకితభావం, ప్రేమే సమన్వయం చేసుకొనేలా చేశాయని చెప్పారు. ఏడాదిన్నరగా పగలు వృత్తి పరమైన విధులు నిర్వర్తించేవాడినని, రాత్రి వేళ బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేసేవాడినని నోయిడా మెజిస్ట్రేట్ వివరించారు. అలాగే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను తల్లిదండ్రులు పూర్తిగా ప్రోత్సహించాలని, దాంతో వారు ఏదైనా సాధించగలరని ఆయన సూచించారు. ఈ క్రమంలోనే తాను ఇప్పటివరకు ఏది సాధించినా అది తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనన్నారు. తనకు నచ్చిందల్లా చెయ్యమని ప్రోత్సహించారని, అందువల్లే తానీ స్థితిలో ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ ప్రయాణం అంత తేలిక కాకపోయినా పట్టుదలతో కృషి చేయాలని సుహాస్ సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
-
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్
-
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
-
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!