IND vs ENG: భారత్ను చుట్టేసిన ఇంగ్లాండ్.. తొలి ఇన్నింగ్స్లో 191కు ఆలౌట్
నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా తక్కువ స్కోర్ సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ను ఇంగ్లాండ్ బౌలర్లు మరోసారి చుట్టిపడేశారు. ఈ క్రమంలోనే టీమ్ఇండియా 191 పరుగులకు ఆలౌటైంది...
లండన్: నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా తక్కువ స్కోర్కే పరిమితమైంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ను ఇంగ్లాండ్ బౌలర్లు మరోసారి చుట్టిపడేశారు. దీంతో టీమ్ఇండియా 191 పరుగులకే ఆలౌటైంది. ఆల్రౌండర్ శార్ధూల్ ఠాకూర్ (57; 36 బంతుల్లో 7x4, 3x6), కెప్టెన్ విరాట్ కోహ్లీ (50; 96 బంతుల్లో 8x4) అర్ధ శతకాలతో ఆదుకున్నారు. మిగతా బ్యాట్స్మెన్ పూర్తిగా చేతులెత్తేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్వోక్స్ నాలుగు, రాబిన్సన్ మూడు వికెట్లు తీయగా అండర్సన్, ఓవర్టన్ చెరో వికెట్ తీశారు.
నిరాశపర్చిన టాప్ఆర్డర్
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమ్ఇండియాకు శుభారంభం దక్కలేదు. మ్యాచ్ ప్రారంభమైన గంటకే మూడు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. తొలుత క్రిస్వోక్స్ రోహిత్ శర్మ(11)ను ఔట్ చేయగా తర్వాత రాబిన్సన్.. కేఎల్ రాహుల్(17)ను వికెట్లముందు దొరకబుచ్చుకున్నాడు. కాసేపటికే అండర్సన్.. చెతేశ్వర్ పుజారా(4)ను సైతం పెవిలియన్ చేర్చి భారత్ను గట్టి దెబ్బతీశాడు. దాంతో టీమ్ఇండియా 38 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆపై కోహ్లీ, రవీంద్ర జడేజా(10) మరో వికెట్ పడకుండా తొలి సెషన్ను ముగించారు.
దూకుడుగా ఆడిన శార్ధూల్..
అయితే, భోజన విరామం తర్వాత మరింత చెలరేగిన ఇంగ్లాండ్ పేసర్లు ఈసారి జడేజా, కోహ్లీ, రహానెను పెవిలియన్ పంపారు. ఐదో ఆటగాడిగా బరిలోకి దిగిన జడేజా బాగా ఆడతాడనుకున్నా విఫలమయ్యాడు. వోక్స్ బౌలింగ్లో స్లిప్లో రూట్ చేతికి చిక్కాడు. అనంతరం కోహ్లీ అర్ధశతకం పూర్తిచేసుకొని రాబిన్సన్ బౌలింగ్లో కీపర్కు చిక్కాడు. దాంతో భారత్ 105 పరుగులకు సగం వికెట్లు కోల్పోయింది. అనంతరం ఓవర్టన్ బౌలింగ్లో రహానె(14), వోక్స్ బౌలింగ్లో పంత్(9) కూడా విఫలమయ్యారు. ఇక మూడో సెషన్లో ధాటిగా ఆడిన శార్ధూల్ ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఉమేశ్ యాదవ్(10)తో కలిసి ఎనిమిది వికెట్కు 63 పరుగులు జోడించాడు. అయితే, జట్టు స్కోర్ 190 పరుగుల వద్ద అతడు క్రిస్వోక్స్ ఔలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడంతో భారత్ తర్వాతి రెండు వికెట్లు మరుసటి ఓవర్లోనే కోల్పోయింది. రాబిన్సన్ వేసిన 62వ ఓవర్లో బుమ్రా(0), ఉమేశ్ ఔటవ్వడంతో తొలి ఇన్నింగ్స్ ముగిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?