IND vs ENG: రెండో రోజు ఆట పూర్తి.. టీమ్ఇండియా రెండో ఇన్నింగ్స్ 43/0
ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమ్ఇండియా రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి 43 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(20), కేఎల్ రాహుల్(22) నాటౌట్గా నిలిచారు...
తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 290 ఆలౌట్
లండన్: ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమ్ఇండియా రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి 43 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(20), కేఎల్ రాహుల్(22) నాటౌట్గా నిలిచారు. టీమ్ఇండియా ఇంకా 56 పరుగుల వెనుకంజలో కొనసాగుతోంది. మరోవైపు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 290 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన రోహిత్, రాహుల్ ఒక్క వికెట్ కూడా పడకుండా జాగ్రత్తగా ఆడారు.
అంతకుముందు ఇంగ్లాండ్ భారీ స్కోర్ చేయడంలో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ ఓలీపోప్ (81; 159 బంతుల్లో 6x4), క్రిస్వోక్స్ (50; 60 బంతుల్లో 11x4) కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ అర్ధ శతకాలతో రాణించి భారత బౌలర్లపై ఆధిపత్యం చెలాయించారు. దీంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 99 పరుగుల కీలక ఆధిక్యం సాధించింది. మధ్యలో జానీ బెయిర్స్టో (37; 77 బంతుల్లో 7x4), మొయిన్ అలీ (35; 71 బంతుల్లో 7x4) సైతం తమవంతు పరుగులు చేశారు. ఇక భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ మూడు.. బుమ్రా, జడేజా రెండు వికెట్లు తీయగా శార్దూల్, సిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు 55/3 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ ఆదిలోనే క్రేగ్ ఓవర్టన్ (1), డేవిడ్ మలన్ (31) వికెట్లను కోల్పోయింది. ఉమేశ్ ఇద్దర్నీ పెవిలియన్ పంపి భారత శిబిరంలో ఆశలు రేపాడు. అయితే, తర్వాత క్రీజులోకి వచ్చిన పోప్ నిలకడగా ఆడి ఆ జట్టును మంచి స్థితికి తీసుకెళ్లాడు. తొలుత బెయిర్స్టోతో కలిసి ఆరో వికెట్కు 89 పరుగులు జోడించిన అతడు తర్వాత మొయిన్ అలీతో ఏడో వికెట్కు 76 పరుగులు నమోదుచేశాడు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ను ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. కాగా, ఈ ముగ్గురూ కీలక సమయాల్లో ఔటైనా చివర్లో క్రిస్వోక్స్ ధాటిగా ఆడి ఇంగ్లాండ్ను మెరుగైన స్థితిలో నిలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే