IND vs ENG: మూడో రోజు టీమ్ఇండియాదే.. భారీ స్కోర్పైనే గురి
ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమ్ఇండియా మ్యాచ్పై పట్టు బిగిస్తోంది. మూడో రోజు ఆట నిలిచిపోయేసరికి 270/3 స్కోర్తో నిలిచి 171 పరుగుల ఆధిక్యం సాధించింది...
లండన్: ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమ్ఇండియా మ్యాచ్పై పట్టు బిగిస్తోంది. మూడో రోజు ఆట నిలిచిపోయేసరికి 270/3 స్కోర్తో నిలిచి 171 పరుగుల ఆధిక్యం సాధించింది. ఈ క్రమంలోనే కెప్టెన్ విరాట్ కోహ్లీ(22; 37 బంతుల్లో 4x4), రవీంద్ర జడేజా (9; 33 బంతుల్లో 2x4) నాటౌట్గా నిలిచారు. అంతకుముందు ఓపెనర్ రోహిత్ శర్మ (127; 256 బంతుల్లో 14x4, 1x6) శతకంతో మెరవగా పుజారా (61; 127 బంతుల్లో 6x4) అర్ధ శతకంతో రాణించాడు. వీరిద్దరూ మూడో వికెట్కు 153 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి మూడోరోజు భారత్ పైచేయి సాధించడంలో కీలక పాత్ర పోషించారు.
అద్భుతంగా ఆడుతున్న వీరిని రాబిన్సన్ ఒకే ఓవర్లో పెవిలియన్ పంపి భారత్కు గట్టి షాక్ ఇచ్చాడు. 81వ ఓవర్లో తొలుత పుల్షాట్ ఆడిన రోహిత్.. క్రిస్వోక్స్ చేతికి చిక్కగా చివరి బంతికి పుజారా అనూహ్య బంతికి మొయిన్ అలీ చేతికి చిక్కాడు. దాంతో టీమ్ఇండియా ఒక్క పరుగు వ్యవధిలో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. అనంతరం కోహ్లీ, జడేజా మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. అయితే, వెలుతురు లేమి కారణంగా అంపైర్లు ఆటను కాస్త ముందుగానే నిలిపివేశారు. ఇక నాలుగో రోజు భారత బ్యాట్స్మెన్ భారీ స్కోర్ సాధించడంపైనే జట్టు విజయావకాశాలు ఆధారపడ్డాయి.
ఇక 55/3 ఓవర్నైట్ స్కోర్తో శనివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన రోహిత్, రాహుల్(46; 101 బంతుల్లో 6x4, 1x6) తొలి వికెట్కు 83 పరుగులు జోడించారు. వీరిద్దరూ టీమ్ఇండియా భారీ స్కోర్ సాధించడానికి గట్టి పునాదులు వేశారు. అయితే, చక్కగా ఆడుతున్న వీరిని అండర్సన్ విడదీశాడు. 34వ ఓవర్ చివరి బంతికి రాహుల్ను బోల్తా కొట్టించాడు. ఆపై క్రీజులోకి వచ్చిన పుజారా.. రోహిత్తో కలిసి నిలకడగా ఆడాడు. వీరిద్దరూ రెండో సెషన్లో ఒక్క వికెట్ కోల్పోకుండా జాగ్రత్తపడ్డారు. అంతకుముందే రోహిత్.. మొయిన్ అలీ బౌలింగ్లో సిక్సర్ బాది టెస్టుల్లో ఎనిమిదో శతకం సాధించాడు. ఇది అతడి కెరీర్లో విదేశీ గడ్డపై తొలి టెస్టు సెంచరీ కావడం కూడా గమనార్హం. ఆపై మూడో సెషన్లో పుజారా అర్ధశతకం సాధించాడు. దీంతో మరింత ప్రమాదకరంగా మారిన వీరిని రాబిన్సన్ ఓవర్లో ఔట్ చేశాడు. చివరికి కోహ్లీ, జడేజా బ్యాటింగ్ చేస్తూ మూడో రోజు ఆటను ముగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..