IND vs NZ: ఇంగ్లాండ్‌లో ఆడినట్టే భయంలేకుండా ఆడాలనుకుంటున్నా: పుజారా

న్యూజిలాండ్‌తో ఆడే రెండు టెస్టుల సిరీస్‌లో భయపడకుండా ఆడాలనుకుంటున్నట్లు టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్‌ ఛెతేశ్వర్‌ పుజారా అన్నాడు...

Published : 23 Nov 2021 14:39 IST

ఇంటర్నెట్‌డెస్క్: న్యూజిలాండ్‌తో ఆడే రెండు టెస్టుల సిరీస్‌లో భయపడకుండా ఆడాలనుకుంటున్నట్లు టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్‌ ఛెతేశ్వర్‌ పుజారా అన్నాడు. అతడు ఐపీఎల్‌కు ముందు ఇంగ్లాండ్‌ పర్యటనలోనూ ఇలాగే ఆడానన్నాడు. గురువారం నుంచి కాన్పూర్‌లో తొలి టెస్టు ప్రారంభమవుతున్న నేపథ్యంలో తాజాగా వర్చువల్‌గా మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పుజారా మాట్లాడుతూ తన ఆటతీరుపై స్పందించాడు.

‘ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో నా ఆలోచనా విధానం మరోలా ఉంది. అప్పుడు నేను ఏమాత్రం భయంలేకుండా ఆడాను. అప్పుడు నా బ్యాటింగ్‌లో చేసుకున్న టెక్నికల్‌ మార్పులేమీ లేవు. ఇక రాబోయే న్యూజిలాండ్‌ సిరీస్‌కు నా సన్నద్ధం బాగుంది. ఇంగ్లాండ్‌లో భయంలేకుండా ఎలా ఆడానో ఈ సిరీస్‌లోనూ అదే విధంగా ఆడాలనుకుంటున్నా. అనంతరం రెండేళ్లకుపైగా శతకం సాధించకపోవడంపై మాట్లాడుతూ.. దాని గురించి ఆలోచించడం లేదన్నాడు. తాను 50-60 పరుగులు సాధిస్తున్నానని, అలాంటప్పుడు శతకాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నాడు.

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని