IND vs NZ: కోహ్లీ.. కివీస్ను ఫాలోఆన్ ఆడించకపోవడానికి కారణమిదేనా..?
న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ఇండియా పర్యాటక జట్టును ఫాలో ఆన్ ఆడించకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసిన సంగతి తెలిసిందే...
ఇంటర్నెట్డెస్క్: న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ఇండియా పర్యాటక జట్టును ఫాలో ఆన్ ఆడించకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసిన సంగతి తెలిసిందే. శనివారం భారత్ తొలి ఇన్నింగ్స్లో 325 పరుగులకు ఆలౌటయ్యాక న్యూజిలాండ్ 62 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్కు 263 పరుగుల కీలక ఆధిక్యం లభించింది. ఈ క్రమంలోనే కెప్టెన్ విరాట్ కోహ్లీ కివీస్ను ఫాలోఆన్ ఆడిస్తాడని అందరూ భావించారు. కానీ, అందరి అంచనాలను కాదని, కోహ్లీ మళ్లీ టీమ్ఇండియానే బరిలోకి దింపాడు. అయితే, దీని వెనక సదుద్దేశమే ఉందని సీనియర్ వికెట్కీపర్, బ్యాట్స్మన్ దినేశ్ కార్తీక్ అంటున్నాడు.
‘ఈ టెస్టు తర్వాత టీమ్ఇండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అలాంటప్పుడు ఈ మ్యాచ్ను కేవలం మూడు, నాలుగు రోజుల్లో ముగించినా భారత్కు అదనపు పాయింట్లు రావు. కానీ, ఈ పిచ్ మీద ఎంత ఎక్కువగా బ్యాటింగ్ చేస్తే అంత దారుణంగా వికెట్ తయారవుతుంది. దాంతో టీమ్ఇండియా రెండో ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ను మరోసారి తక్కువ స్కోరుకే పరిమితం చేయడం తేలికవుతుంది. ఇప్పుడు భారత బ్యాట్స్మెన్ స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంది. ఇప్పటికే సరిపడా ఆధిక్యం ఉంది. అయితే, ఈ పరిస్థితులను చక్కగా వినియోగించుకొని ఆటగాళ్లు మరింత బాగా పుంజుకునేందుకు ఉపయోగించుకోవాలని చూస్తున్నారు’ అని డీకే ఓ క్రీడా ఛానల్తో అన్నాడు.
రెండో ఇన్నింగ్స్లో పుజారా, కోహ్లీ నుంచి వీలైనన్ని ఎక్కువ పరుగులను జట్టు ఆశిస్తోందని, కోహ్లీకి అవకాశం వచ్చి బ్యాట్ ఝుళిపిస్తే మంచి ఆధిక్యంతో ఇన్నింగ్స్ డిక్లేర్ చేయొచ్చని డీకే అభిప్రాయపడ్డాడు. కివీస్ను ఫాలోఆన్ ఆడించకపోవడానికి.. బౌలర్లకు కాస్త విశ్రాంతినివ్వాలనే ఉద్దేశం కాదన్నాడు. ఆటలో ఇంకా మూడు రోజులు మిగిలున్నందున టీమ్ఇండియా తొందరపడటం లేదన్నాడు. ఒకవేళ ప్రత్యర్థిని ఫాలోఆన్ ఆడిస్తే.. ఎక్కువ పాయింట్లు లభించే అవకాశం ఉంటే అప్పుడు పరిస్థితి మరోలా ఉండేదన్నాడు. కాబట్టి.. విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయం సరైందేనని, టీమ్ఇండియా బ్యాట్స్మెన్ స్వేచ్ఛగా ఆడేందుకు అవకాశం ఇచ్చారని దినేశ్ వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఇంకెవరూ మీ భార్యే..’: కోహ్లీ ఆన్సర్కు షాకైన దినేశ్ కార్తిక్
Kohli-DK: బెంగళూరు ఆటగాడు డీకే అడిగిన ప్రశ్నలకు.. కోహ్లీ ఇచ్చిన సమాధానం నెట్టింట వైరల్ అవుతోంది. దినేశ్ కార్తిక్ సతీమణి దీపిక ప్రస్తావన తేవడంతో అతడు ఆశ్చర్యపోయాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?
ముంబయి ఆటగాడు, కోచ్పై ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ కొరడా ఝళిపించింది. వారు చేసిన చర్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర నిర్ణయం తీసుకుంది. -
Ravindra Jadeja: గాల్లోకి ఎగిరి.. ఒంటిచేత్తో జడేజా క్యాచ్!
లఖ్నవూతో శుక్రవారం జరిగిన మ్యాచ్లో చెన్నై ఆటగాడు రవీంద్ర జడేజా.. గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్ ఒడిసిపట్టాడు.
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడు కొనసాగేనా?
అభిమానుల ఊహకు అందనిరీతిలో.. సంచలన ఆటతో ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ జట్టు అదరగొట్టేస్తోంది. ఇవాళ మరో మ్యాచ్లో తలపడేందుకు సిద్ధమవుతోంది. -
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
ప్రస్తుత సీజన్లో దూకుడుగా ఆడుతున్న క్రికెటర్లలో ధోనీ ముందువరుసలో ఉంటాడు. ఆడేది పది బంతుల్లోపే అయినా ప్రత్యర్థి బౌలర్లకు వణుకు పుట్టిస్తున్నాడు. -
ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్
పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ముంబయి జట్టుకు కాసేపు యాక్టివ్ కెప్టెన్గా రోహిత్ శర్మ వ్యవహరించాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
లఖ్నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్, చెన్నై సారథి రుతురాజ్ గైక్వాడ్కు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ జరిమానా విధించింది. -
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
సొంత మైదానంలో లఖ్నవూ విజయం సాధించింది. ఆ జట్టు గెలుపు కంటే మరొక అంశం అభిమానులను ఆకట్టుకుంది. అదే ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్ వీరవిహారం. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
9 ఇనుప మేకులు మింగిన ఖైదీ.. ప్రాణాలు కాపాడిన వైద్యులు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
వినీతాసింగ్ మృతిపై వదంతులు ..ఆమె ఏమన్నారంటే!
-
హామీలపై నిలదీస్తే అసహనమెందుకు?: హరీశ్రావు
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..