Virat Kohli: అచ్చొచ్చిన వాంఖడే పిచ్పై విరాట్ ఇప్పుడెలా ఆడతాడో..!
టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ మళ్లీ జట్టుతో కలిశాడు. టీ20 ప్రపంచకప్ తర్వాత కొద్దిరోజులు విశ్రాంతి తీసుకున్న అతడు నేటి నుంచి ముంబయిలో న్యూజిలాండ్తో జరిగే రెండో టెస్టులో బరిలోకి దిగనున్నాడు...
కళ్లుముందు ఊరిస్తున్న రికీ పాంటింగ్ను అధిగమించే రికార్డు
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ మళ్లీ జట్టుతో కలిశాడు. టీ20 ప్రపంచకప్ తర్వాత కొద్దిరోజులు విశ్రాంతి తీసుకున్న అతడు నేటి నుంచి ముంబయిలో న్యూజిలాండ్తో జరిగే రెండో టెస్టులో బరిలోకి దిగనున్నాడు. ఈ క్రమంలోనే తనకు అచ్చొచ్చిన వాంఖడే స్టేడియంలో మరోసారి చెలరేగాలని భావిస్తున్నాడు. కోహ్లీ ఈ మైదానంలో 2016లో చివరిసారి టెస్టు మ్యాచ్ ఆడాడు. అప్పుడు ఇంగ్లాండ్తో తలపడిన సందర్భంగా 235 పరుగులు సాధించి పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. అలాగే ఈ మైదానంలో అతడి సగటు కూడా అత్యుత్తమంగా 72.16 ఉంది.
ఇక అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటికే అన్ని ఫార్మాట్లలో కలిపి 70 శతకాలతో కొనసాగుతున్న కోహ్లీ.. కెప్టెన్గా 41 సెంచరీలతో ఉన్నాడు. దీంతో ఆస్ట్రేలియా దిగ్గజ సారథి రికీ పాంటింగ్తో సమానంగా నిలిచాడు. న్యూజిలాండ్తో రెండో టెస్టులో కోహ్లీ మరో శతకం సాధిస్తే పాంటింగ్ను అధిగమించి కొత్త రికార్డు నెలకొల్పుతాడు. అయితే, ఈ మైలురాయి చేరాలంటే టీమ్ఇండియా సారథి బాగా కష్టపడాలి. ఎందుకంటే గత రెండేళ్లుగా విరాట్ ఒక్క సెంచరీ కూడా సాధించకపోవడం గమనార్హం. 2019 నవంబర్లో చివరిసారి బంగ్లాదేశ్తో ఆడిన డే/నైట్ టెస్టులోనే అతడు మూడంకెల స్కోర్ అందుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా రాణిస్తాడనేది ఆసక్తిగా మారింది.
రెండో టెస్టుకు ముందు నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్లో టీమ్ఇండియా సారథికి హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ త్రోడౌన్ బంతులేశాడు. కోహ్లీ బ్యాటింగ్ చేస్తుండగా ద్రవిడ్ బంతులేస్తూ కనిపించాడు. అందుకు సంబంధించిన వీడియోను టీమ్ఇండియా ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది. ద్రవిడ్ నూతన కోచ్గా బాధ్యతలు చేపట్టాక కోహ్లీ తొలిసారి జట్టుతో కలిశాడు. దీంతో ఈ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే