IND vs NZ: న్యూజిలాండ్పై జైత్రయాత్ర.. టీమ్ఇండియా అదిరిపోయే రికార్డులు..!
న్యూజిలాండ్తో జరిగిన రెండో టెస్టులో టీమ్ఇండియా ఘన విజయం సాధించగా పలు ఆసక్తికర రికార్డులు నమోదయ్యాయి. అందులో కొన్ని భారత జట్టు సాధించగా మరికొన్ని రవిచంద్రన్ అశ్విన్ సాధించాడు...
12 టెస్టు సిరీస్ల్లో ఒక్కటీ గెలవలేకపోయిన కివీస్
ముంబయి: న్యూజిలాండ్తో జరిగిన రెండో టెస్టులో టీమ్ఇండియా ఘన విజయం సాధించగా పలు ఆసక్తికర రికార్డులు నమోదయ్యాయి. అందులో కొన్ని భారత జట్టు సాధించగా మరికొన్ని రవిచంద్రన్ అశ్విన్వి ఉన్నాయి. ఒక్కటి మాత్రం కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ నెలకొల్పాడు. అవేంటో ఓ లుక్కేద్దాం.
పరుగుల పరంగా భారత్కిదే అత్యంత భారీ విజయం..
* 372: 2021లో ముంబయి వేదికగా న్యూజిలాండ్పై (ఈ మ్యాచ్లోనే)
* 337: 2015లో దిల్లీ వేదికగా దక్షిణాఫ్రికాతో ఆడిన మ్యాచ్లో.
* 321: 2016లో ఇండోర్ వేదికగా న్యూజిలాండ్తో తలపడిన వేళ.
* 320: 2008లో మొహాలి వేదికగా ఆస్ట్రేలియాతో ఆడినప్పుడు.
ఈ టెస్టు సిరీస్లో నమోదైన రికార్డులివే..
* ఈ ఏడాది అశ్విన్ పడగొట్టిన వికెట్ల సంఖ్య 52కి చేరుకుంది. టెస్టుల్లో ఓ క్యాలెండర్ ఇయర్లో 50, అంతకన్నా ఎక్కువ వికెట్లు పడగొట్టడం అశ్విన్కిది నాలుగో సారి. 2015, 2016, 2017, 2021లో ఈ ప్రదర్శన చేసిన అశ్విన్.. అత్యధిక సార్లు ఆ ఘనత సాధించిన భారత బౌలర్గా రికార్డులకెక్కాడు. ఇదివరకు హార్భజన్, కుంబ్లే 3 సార్లు మాత్రమే ఈ ఘనత సాధించారు. దీంతో ఆ ఇద్దరి దిగ్గజాలను అశ్విన్ ఇప్పుడు వెనక్కినెట్టాడు.
* న్యూజిలాండ్పై టెస్టుల్లో ఇప్పటివరకు అశ్విన్ తీసిన వికెట్లు 66. రెండు జట్ల మధ్య టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్.. కివీస్ దిగ్గజ ఆల్రౌండర్ రిచర్డ్ హ్యాడ్లీ(65)ని అశ్విన్ అధిగమించాడు.
* ఈ మ్యాచ్లో కివీస్ స్పిన్నర్ అజాజ్ బౌలింగ్ గణాంకాలివి 14/225. ఇక ఒకే ఇన్నింగ్స్లో పది వికెట్లు తీసిన మూడో బౌలర్గా చరిత్ర సృష్టించాడు. మరోవైపు ఓ టెస్టు మ్యాచ్లో భారత్పై అత్యుత్తమ ప్రదర్శన చేసిన బౌలర్గానూ అతడు నిలిచాడు. కివీస్ తరపున టెస్టుల్లో అతడికిది రెండో అత్యుత్తమ ప్రదర్శన. రిచర్డ్ హ్యాడ్లీ (1985లో ఆస్ట్రేలియాపై 15/123) అగ్రస్థానంలో ఉన్నాడు.
* భారత్లో న్యూజిలాండ్ ఆడిన 12 టెస్టు సిరీస్ల్లో ఒక్కసారి కూడా సిరీస్ కైవసం చేసుకోలేదు. చివరిసారిగా ఆ జట్టు 1988లో వాంఖడే మైదానంలోనే ఒక టెస్టు గెలిచింది.
* భారత్కు ఇది స్వదేశంలో వరుసగా 14వ టెస్టు సిరీస్ విజయం.
భారత్లో అత్యధిక టెస్టు వికెట్లు తీసిన ఆటగాళ్లలో అశ్విన్..
* 350 అనిల్కుంబ్లే
* 300 రవిచంద్రన్ అశ్విన్
* 265 హర్భజన్ సిగ్
* 219 కపిల్ దేవ్
స్వదేశాల్లో టెస్టుల్లో వేగంగా 300 వికెట్ల క్లబ్లో చేరిన ఆటగాళ్లలో అశ్విన్..
* 48 మ్యాచ్ల్లో ముత్తయ్య మురళీధరన్ తొలి స్థానంలో నిలిచాడు.
* 49 మ్యాచ్ల్లో రవిచంద్రన్ అశ్విన్ ఆ ఘనత సాధించి రెండో స్థానం.
* 52 మ్యాచ్ల్లో అనిల్కుంబ్లే మూడులో నిలిచాడు.
* 65 మ్యాచ్ల్లో షేన్వార్న్ నాలుగో స్థానం.
* 71 మ్యాచ్ల్లో జిమ్మీ ఆండర్సన్ ఐదులో ఉన్నాడు.
* 76 మ్యాచ్ల్లో స్టువర్ట్బ్రాడ్ ఆరో స్థానంలో నిలిచాడు.
మ్యాచ్లో ఓటమిపాలైనా అత్యంత మేటి బౌలింగ్ ప్రదర్శనలో అజాజ్ టాప్
* 14/225: 2021లో భారత్పై అజాజ్ పటేల్ నంబర్ వన్
* 13/132: 1999లో పాకిస్థాన్పై జవగళ్ శ్రీనాథ్
* 13/163: 1902లో ఆస్ట్రేలియాపై సిడ్నీ బార్న్స్
* 13/217: 1988లో వెస్టిండీస్పై మెర్వ్ హ్యూస్
* 13/244: 1896లో ఆస్ట్రేలియాపై టామ్ రిచర్డ్స్
పరుగుల పరంగా న్యూజిలాండ్కిదే అత్యంత భారీ ఓటమి
* 372: 2021లో భారత్తో తలపడిన మ్యాచ్లో.
* 358: 2007లో జోహెనస్బర్గ్లో దక్షిణాఫ్రికాతో ఆడినప్పుడు.
* 321: 2016లో భారత్తో ఆడినప్పుడు.
* 299: 2001లో ఆక్లాండ్లో పాకిస్థాన్తో ఆడిన వేళ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
పొట్టి కప్ కోసం జట్టు ఎంపికపై ఇప్పటి వరకు తానెవరినీ కలవలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పష్టం చేశాడు. -
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
భారీ విజయంతో దిల్లీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగు పర్చుకుంది. సొంతమైదానంలోనే గుజరాత్ను చిత్తు చేసి ఈ సీజన్ ఐపీఎల్లో దిల్లీ మూడో విజయాన్ని నమోదు చేసింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?
-
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98కోట్ల ఆస్తులు అటాచ్
-
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
-
కళ్యాణదుర్గంలో వైకాపా అరాచకం.. దాడిలో తెదేపా నేతకు తీవ్ర గాయాలు
-
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
-
కేసీఆర్ను బద్నాం చేయాలనే కాఫర్ డ్యామ్ కట్టడంలేదు: కేటీఆర్