IND vs NZ: 400కిపైగా ఆధిక్యంలో దూసుకుపోతున్న టీమ్‌ఇండియా

న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్‌ఇండియా 405 పరుగుల ఆధిక్యంతో దూసుకుపోతోంది. 69/0 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌...

Updated : 07 Dec 2021 14:11 IST

మూడో రోజు తొలి సెషన్‌ పూర్తి.. అజాజ్‌కే మరో రెండు వికెట్లు

ఇంటర్నెట్‌డెస్క్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్‌ఇండియా 405 పరుగుల ఆధిక్యంతో దూసుకుపోతోంది. 69/0 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత జట్టు భోజన విరామ సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. ఓపెనర్లుగా వచ్చిన మయాంక్‌ అగర్వాల్‌ (62; 108 బంతుల్లో 9x4, 1x6), ఛెతేశ్వర్‌ పుజారా (47; 97 బంతుల్లో 6x4, 1x6) తొలి వికెట్‌కు శతక భాగస్వామ్యం (107) నెలకొల్పగా.. అజాజ్‌ పటేల్‌ స్వల్ప వ్యవధిలో వీరిదర్నీ మరోసారి పెవిలియన్‌కు పంపాడు. దీంతో భారత్‌ 36 ఓవర్లకు 115/2 స్కోర్‌తో నిలిచింది. అనంతరం బ్యాటింగ్‌ కొనసాగించిన శుభ్‌మన్‌ గిల్‌ (17), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (11) నిలకడగా ఆడుతూ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని