IND vs SA: దక్షిణాఫ్రికా పర్యటన.. రహానె, పుజారాలకు చావో రేవో?
మరికొద్ది రోజుల్లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లాల్సిన టీమ్ఇండియా షెడ్యూల్పై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రస్తుతం అక్కడ ఒమిక్రాన్ అనే కొత్త వేరియంట్ వెలుగు చూడటంతో...
ఆఖరి అవకాశం ఇచ్చి చూడాలనుకుంటున్న టీమ్ఇండియా
ఇంటర్నెట్డెస్క్: మరికొద్ది రోజుల్లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లాల్సిన టీమ్ఇండియా షెడ్యూల్పై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రస్తుతం అక్కడ ఒమిక్రాన్ కొత్త వేరియంట్ వెలుగు చూడటంతో పర్యటనపై సందిగ్ధత నెలకొంది. అయితే, అక్కడికి వెళ్లేందుకు టీమ్ఇండియా ఆసక్తిగా ఉండటంతో పాటు బీసీసీఐ కూడా సానుకూలంగా ఉందని తెలిసింది. కాకపోతే ఒక వారం పది రోజులు షెడ్యూల్ను వాయిదా వేయాలని భావిస్తోంది. ఒకవేళ అనుకున్నట్లే ఈ పర్యటన సాగితే టీమ్ఇండియా సీనియర్ బ్యాట్స్మెన్ అజింక్య రహానె, ఛెతేశ్వర్ పుజారాలకు చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. కొంతకాలంగా ఇద్దరూ పరుగులు చేయలేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో జట్టు యాజమాన్యం చివరి అవకాశం ఇవ్వాలని చూస్తున్నట్లు సమాచారం.
యువకులు రెడీగా ఉన్నారు..
తాజాగా కాన్పూర్ టెస్టులోనూ రహానె, పుజారా విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో ముంబయి టెస్టుకు కెప్టెన్ విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి వస్తున్న నేపథ్యంలో ఎవరిని పక్కనపెడతారనే విషయం ఆసక్తి రేపింది. ఈ క్రమంలోనే ఆ సందేహాలకు తెరదించుతూ రెండో టెస్టులో జట్టు యాజమాన్యం రహానెను పక్కనపెట్టింది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో యువ ఆటగాళ్లు కూడా అద్భుతంగా రాణిస్తుండటంతో జట్టులో ఒకసారి చోటు కోల్పోతే మళ్లీ స్థానం సంపాదించడం కష్టమనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. సరిగ్గా ఆడని వారిని తొలగించి నైపుణ్యమున్న యువకులకు అవకాశాలు కల్పించాలని క్రికెట్ విశ్లేషకులు సైతం అంటున్నారు. అయితే, దక్షిణాఫ్రికా లాంటి విదేశీ పిచ్లపై అనుభవం లేని యువకులను ఆడించేందుకు కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రాహుల్ ద్రవిడ్, సెలెక్షన్ ప్యానెల్ కూడా ఆసక్తి చూపకపోవచ్చు. దీంతో దక్షిణాఫ్రికా పర్యటనలో రహానె, పుజారాలకు చివరి అవకాశం ఇచ్చి చూడాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
-
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
-
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
-
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు