Pujara - Rahane: అప్పటివరకూ వారికిఅండగా ఉండొచ్చు: గావస్కర్
టీమ్ఇండియా సీనియర్ బ్యాట్స్మెన్ ఛెతేశ్వర్ పుజారా, అజింక్య రహానె.. తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారని మాజీ సారథి, బ్యాటింగ్ దిగ్గజం సునీల్గావస్కర్ అన్నారు...
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా సీనియర్ బ్యాట్స్మెన్ ఛెతేశ్వర్ పుజారా, అజింక్య రహానె.. తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారని మాజీ సారథి, బ్యాటింగ్ దిగ్గజం సునీల్గావస్కర్ ప్రశంసించారు. దక్షిణాఫ్రికాతో ముగిసిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో వీరిద్దరూ అర్ధశతకాలతో రాణించిన సంగతి తెలిసిందే. దీంతో మూడో వికెట్కు 111 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ అనంతరం ఓ క్రీడా ఛానల్తో మాట్లాడిన గావస్కర్.. పుజారా-రహానె బ్యాటింగ్పై స్పందించారు.
‘వారిద్దరికీ ఉన్న అనుభవం, గతంలో జట్టుకు అందించిన విజయాల నేపథ్యంలోనే టీమ్ఇండియా వారికి అండగా నిలుస్తూ ప్రోత్సహించింది. అవసరమైన వేళ వారిద్దరూ రాణిస్తారనే నమ్మకం ఉంచింది. అందుకు తగ్గట్టే రెండో ఇన్నింగ్స్లో రాణించి జట్టు నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. కొన్నిసార్లు మనం సీనియర్ల పట్ల కఠినంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రిజర్వ్బెంచ్లో పలువురు నైపుణ్యమున్న యువకులు తమ అవకాశాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాళ్లు ఎలా ఆడతారనేది కూడా మనం గమనించాల్సి ఉంటుంది. ఈ సీనియర్లు ఇద్దరూ మరీ ఘోరంగా విఫలమవ్వనంతకాలం.. జట్టు అండగా ఉంటూ ఇలాగే నమ్మకం ఉంచాలని నేను అనుకుంటున్నా’ అని గావస్కర్ అభిప్రాయపడ్డారు. ఇక ఈ మ్యాచ్లో టీమ్ఇండియా 240 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా దక్షిణాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయి 243 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ డీన్ ఎల్గర్ (96*), వాండర్ డెస్సన్ (40), తెంబా బవుమా (23*) పనిపూర్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.