Virat Kohli: దక్షిణాఫ్రికా పర్యటనలో కొత్త ట్విస్ట్‌.. వన్డేలకు కోహ్లీ దూరం!

టీమ్‌ఇండియా దక్షిణాఫ్రికా పర్యటనకు సంబంధించి కొత్త ట్విస్ట్‌ తెరపైకి వచ్చింది. ఈనెల 26 నుంచి ఇరు జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్‌ ప్రారంభమవుతుండగా ఆపై జనవరి 19 నుంచి 23 వరకు...

Updated : 14 Dec 2021 11:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా దక్షిణాఫ్రికా పర్యటనకు సంబంధించి కొత్త ట్విస్ట్‌. ఈనెల 26 నుంచి ఇరు జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్‌ ప్రారంభమవుతుండగా.. ఆ తర్వాత జనవరి 19 నుంచి 23 వరకు మూడు వన్డేల సిరీస్‌ జరగనుంది. అయితే, ఇటీవల ఈ పర్యటనకు సంబంధించి జట్టును ఎంపిక చేసినప్పుడు భారత సెలెక్షన్‌ కమిటీ విరాట్‌ కోహ్లీని వన్డే కెప్టెన్‌గా తొలగించిన సంగతి తెలిసిందే. రోహిత్‌ శర్మకు ఆ బాధ్యతలు అప్పగించింది.

మరోవైపు రోహిత్‌ ఆదివారం ప్రాక్టీస్‌ సెషన్‌లో తొడ కండరాల గాయం బారిన పడటంతో మూడు టెస్టుల సిరీస్‌కు దూరమయ్యాడని బీసీసీఐ సోమవారం ప్రకటించింది. ఈ క్రమంలోనే అతడి స్థానంలో ప్రియాంక్‌ పాంచాల్‌ను ఎంపిక చేసినట్లు వెల్లడించింది. ఈ విషయం పక్కనపెడితే, ఇప్పుడు విరాట్‌ కోహ్లీ జట్టుకు కొత్త ట్విస్ట్‌ ఇచ్చాడని తెలిసింది. దక్షిణాఫ్రికా పర్యటనలో అతడు వన్డే మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు సమాచారం. మంగళవారం ఈ మేరకు ఓ అధికారి వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే, ఆ సమయానికల్లా రోహిత్‌ కోలుకుంటాడని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. దీంతో యథావిధిగా రోహిత్‌ వన్డే మ్యాచ్‌లకు నాయకత్వం వహిస్తాడని ఆ అధికారి వెల్లడించాడు. అయితే ఈ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని