Virat Kohli: దక్షిణాఫ్రికా పర్యటనలో కొత్త ట్విస్ట్.. వన్డేలకు కోహ్లీ దూరం!
టీమ్ఇండియా దక్షిణాఫ్రికా పర్యటనకు సంబంధించి కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఈనెల 26 నుంచి ఇరు జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ ప్రారంభమవుతుండగా ఆపై జనవరి 19 నుంచి 23 వరకు...
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా దక్షిణాఫ్రికా పర్యటనకు సంబంధించి కొత్త ట్విస్ట్. ఈనెల 26 నుంచి ఇరు జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ ప్రారంభమవుతుండగా.. ఆ తర్వాత జనవరి 19 నుంచి 23 వరకు మూడు వన్డేల సిరీస్ జరగనుంది. అయితే, ఇటీవల ఈ పర్యటనకు సంబంధించి జట్టును ఎంపిక చేసినప్పుడు భారత సెలెక్షన్ కమిటీ విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్గా తొలగించిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మకు ఆ బాధ్యతలు అప్పగించింది.
మరోవైపు రోహిత్ ఆదివారం ప్రాక్టీస్ సెషన్లో తొడ కండరాల గాయం బారిన పడటంతో మూడు టెస్టుల సిరీస్కు దూరమయ్యాడని బీసీసీఐ సోమవారం ప్రకటించింది. ఈ క్రమంలోనే అతడి స్థానంలో ప్రియాంక్ పాంచాల్ను ఎంపిక చేసినట్లు వెల్లడించింది. ఈ విషయం పక్కనపెడితే, ఇప్పుడు విరాట్ కోహ్లీ జట్టుకు కొత్త ట్విస్ట్ ఇచ్చాడని తెలిసింది. దక్షిణాఫ్రికా పర్యటనలో అతడు వన్డే మ్యాచ్లకు దూరం కానున్నట్లు సమాచారం. మంగళవారం ఈ మేరకు ఓ అధికారి వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే, ఆ సమయానికల్లా రోహిత్ కోలుకుంటాడని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. దీంతో యథావిధిగా రోహిత్ వన్డే మ్యాచ్లకు నాయకత్వం వహిస్తాడని ఆ అధికారి వెల్లడించాడు. అయితే ఈ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.