Virat: టీ20 సారథ్యం నుంచి తప్పుకోవద్దని కోహ్లీని కోరాం: చీఫ్ సెలెక్టర్
telugu news, cricket news, sports news,virat kohli,chetan sharma
ఇంటర్నెట్ డెస్క్: వన్డే సారథి ఎంపికపై బీసీసీఐ, విరాట్ కోహ్లీ మధ్య ఎలాంటి గందరగోళం లేదని టీమ్ఇండియా సెలెక్షన్ కమిటీ చీఫ్ చేతన్ శర్మ స్పష్టం చేశారు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు జట్టును ప్రకటించిన అనంతరం చేతన్ శర్మ మాట్లాడుతూ.. ‘‘టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందు మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా బీసీసీఐలోని ప్రతి ఒక్కరూ టీ20 ఫార్మాట్ కెప్టెన్సీని వదిలేయొద్దని కోహ్లీకి అడిగారు. మళ్లీ పునరాలోచించాలని సూచించారు. ఇది ప్రపంచకప్ పోటీల్లో మన జట్టు ఆటపై ప్రభావం పడుతుందని మా సెలెక్టర్లందరం చెప్పి చూశాం. భారత క్రికెట్ కోసం కొనసాగాలని సూచనలు చేశాం. అయితే టీ20 ప్రపంచకప్ తర్వాత కెప్టెన్సీకి వీడ్కోలు చెప్పడంతో మేం షాక్కు గురయ్యాం’’ అని వివరించారు.
టీ20 ప్రపంచకప్ ముగిసేవరకు సారథ్యంపై ఎలాంటి నిర్ణయం వెలువరించవద్దని బీసీసీఐ సహా సెలెక్షన్ కమిటీ బృందం కోహ్లీకి చెప్పిందని చేతన్ శర్మ గుర్తు చేశారు. ‘‘టీ20 కెప్టెన్సీని వదిలేస్తున్నట్లు విరాట్ ప్రకటించినప్పుడు వరల్డ్ కప్ పోటీల మధ్యలో ఉన్నాం. అప్పటికీ పునరాలోచించుకోవాలని ప్రతి సభ్యుడూ చెప్పారు. ఒకవేళ ఏదైనా ఒక ఫార్మాట్ నుంచి కెప్టెన్గా వైదొలిగితే.. మరొక ఫార్మాట్ను కూడా వదులుకోవాల్సి వస్తుందని అప్పుడు మేం చెప్పలేని సమయం. ఎందుకంటే టీమ్ఇండియా లక్ష్యాలను అందుకునేలా చేయడమే మా కర్తవ్యం. అందుకే ఎలాంటి వివాదాలకు పోవాలనుకోలేదు. దేశం కోసం ఉత్తమ ఆటగాళ్లు ఆడేలా చూస్తాం’’ అని పేర్కొన్నారు. మరోవైపు విరాట్, రోహిత్ మధ్య దూరం పెరిగిందనే వార్తలను చేతన్ శర్మ కొట్టిపడేశారు. ఇలాంటి ఊహాగానాలను చూసినప్పుడు నవ్వొస్తుందని, ఇటువంటి నిరాధార వార్తలను వ్యాప్తి చేయొద్దని సూచించారు. వారిద్దరూ ఓ కుటుంబంలా, జట్టుగా కలిసిమెలిసి భారత క్రికెట్ కోసం పని చేస్తున్నారని చేతన్ శర్మ తెలిపారు.
విరాట్ కోహ్లీ స్థానంలో టీ20, వన్డే సారథిగా రోహిత్ శర్మను సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. విరాట్ను కేవలం టెస్టు జట్టు బాధ్యతలకు మాత్రమే పరిమితం చేసింది. దీంతో ఒక్కసారిగా వివాదానికి దారి తీసింది. మాజీల నుంచి విమర్శలు రావడంతో బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ స్పందించాడు. తొలుత టీ20 జట్టు కెప్టెన్గా కొనసాగాలని తాము కోహ్లీని కోరామని, అందుకు అతడు నిరాకరించాడని తెలిపాడు. తెల్లబంతి క్రికెట్ (వన్డే, టీ20) ఫార్మాట్లకు ఒకే సారథి ఉంటే బాగుంటుందని సెలెక్షన్ కమిటీ భావించడంతో రోహిత్ శర్మనే ఎంపిక చేసినట్లు వివరించాడు. అయితే దీనికి విరుద్ధంగా కోహ్లీ స్పందిస్తూ.. వన్డే కెప్టెన్గా తొలగిస్తున్నట్లు కేవలం గంటన్నర ముందు మాత్రమే చెప్పారని, టీ20 సారథ్యం వదులుకోవద్దని తనను ఎవరూ వారించలేదని వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్