Tokyo Olympics: నేటి భారతం.. ఎవరెలా ఆడారంటే?
టోక్యో ఒలింపిక్స్లో సోమవారం భారత క్రీడాకారుల ప్రదర్శన మోస్తరుగానే ఉంది. పతకాలు గెలిచే క్రీడల్లోనూ నిరాశ పరుస్తున్నారు. విలువిద్యలో భారత పురుషుల జట్టు కొరియా గండాన్ని దాటలేకపోయింది...
టోక్యో: టోక్యో ఒలింపిక్స్లో సోమవారం భారత క్రీడాకారుల ప్రదర్శన మోస్తరుగానే ఉంది. పతకాలు గెలిచే క్రీడల్లోనూ నిరాశ పరుస్తున్నారు. విలువిద్యలో భారత పురుషుల జట్టు కొరియా గండాన్ని దాటలేకపోయింది. పేరున్న షూటింగ్లోనూ ఆశావహ ఫలితాలు రాలేదు. టోక్యోలో నేటి భారత ప్రదర్శనను ఒకసారి చూద్దాం.
ఫెన్సింగ్లో భారత క్రీడాకారిణి భవానీ దేవి స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసింది. తొలిరౌండ్లో ట్యునీషియా అమ్మాయి నడియా బెన్ అజిజిపై 15-3 తేడాతో విజయం సాధించింది. అయితే ప్రపంచ మూడో ర్యాంకర్, రియో సెమీఫైనలిస్టు మేనన్ బ్రూనెట్ (ఫ్రాన్స్)తో రెండో రౌండ్లో ఓటమి పాలైంది. 7-15తో నిష్క్రమించింది.
పురుషల ఆర్చరీ జట్టు క్వార్టర్స్తోనే సరిపెట్టుకుంది. అతాను దాస్, ప్రవీణ్ జాదవ్, తరుణ్దీప్ రాయ్తో కూడిన జట్టు ప్రిక్వార్టర్స్లో 6-2 తేడాతో కజక్స్థాన్ను ఓడించింది. అయితే కీలకమైన క్వార్టర్స్లో మాత్రం నిరాశపరిచింది. డిఫెండింగ్ ఛాంపియన్, బలమైన కొరియాతో 0-6 తేడాతో ఓటమి పాలైంది. ఈ పోటీలో భారత క్రీడాకారులు ఏమాత్రం పోరాట పటిమ చూపలేదు. వరుసగా మూడు సెట్లలో పరాజయం చవిచూశారు.
షూటింగ్లోనూ బుధవారం నిరాశే ఎదురైంది. పురుషుల స్కీట్ షాట్గన్ పోటీల్లో ఆటగాళ్లు పేలవ ప్రదర్శన చేశారు. అంగద్వీర్ సింగ్ భజ్వా వరుసగా ఐదు రౌండ్లలో 24, 25, 24, 23, 24 స్కోరు చేశాడు. మొత్తంగా 120 పాయింట్లతో 18వ స్థానంలో నిలిచాడు. మరో ఆటగాడు మిరాజ్ అహ్మద్ ఖాన్ వరుసగా 25, 24, 22, 23, 23తో మొత్తం 117 పాయింట్లే సాధించాడు. 25వ స్థానంలో నిలిచాడు. తొలి ఆరు స్థానాల్లో నిలవకపోవడంతో ఫైనల్కు అర్హత పొందలేదు.
సెయిలింగ్లో భారత క్రీడాకారులు తమ సామర్థ్యం మేరకు ఆడారు. ఏకవ్యక్తి డింఘే లేజర్ రేస్-2లో శరవణన్ విష్ణు 20 రేస్ పాయింట్లతో 20వ స్థానంలో నిలిచాడు. రేస్-3లో 24 పాయింట్లతో 24వ స్థానానికి పరిమితం అయ్యాడు. మహిళల రేస్-4లో కుమనన్ నేత్ర 40 రేస్పాయింట్లతో 40వ స్థానంలో నిలిచింది. అంతకు ముందు రేస్-3లో 15 పాయింట్లతో 15వ స్థానంలో నిలవడం గమనార్హం.
టేబుల్ టెన్నిస్లో వెటరన్ ఆటగాడు శరత్ కమల్ మూడో రౌండ్కు చేరుకున్నాడు. పోర్చుగీస్కు చెందిన టియాగో పొలొనియాను 4-2 తేడాడో ఓడించాడు. 2-11, 11-8, 11-5, 9-11, 11-6, 11-9తో విజయం సాధించాడు. మహిళల వ్యక్తిగత రెండో రౌండ్లో సుతీర్థ ముఖర్జీ పోర్చుగీస్ అమ్మాయి ఫు యు చేతిలో 0-4 తేడాతో ఓడింది. వరుసగా 3-11, 3-11, 5-11, 5-11 తేడాతో ఓటమి పాలైంది. మూడో రౌండ్లో మనిక బత్రా 0-4 తేడాతో పొల్కనోవా సోఫియా (ఆస్ట్రియా) చేతిలో ఓడింది. వరుసగా 8-11, 2-11, 5-11, 7-11 స్కోర్లు మాత్రమే చేసింది.
బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ గ్రూప్-ఏ రెండో మ్యాచులో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ పరాజయం పాలైంది. ఇండోనేసియా ద్వయం, కఠిన ప్రత్యర్థి గిడేన్ మారక్కస్, కెవిన్ సంజయ చేతిలో 13-21, 12-21 తేడాతో వరుస గేముల్లో ఓడిపోయారు.
టెన్నిస్లో పురుషుల రెండో రౌండ్లో సుమిత్ నగాల్ ఓటమి పాలయ్యాడు. రష్యా ఒలింపిక్కమిటీ ఆటగాడు మెద్వెదేవ్ డేనిల్ 6-2, 6-2 తేడాతో వరుసగా సెట్లలో ఓడించాడు.
బాక్సింగ్ పురుషుల మిడిల్ (69-75కిలోల) విభాగంలో ఆశీశ్ కుమార్ 0-5 తేడాతో ఓటమి చెందాడు. అతడిని ఓడించిన చైనా బాక్సర్ తౌహెటా ఎర్బిక్ క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నాడు.
పురుషుల 200మీటర్ల బటర్ఫ్లై హీట్-2ను సాజన్ ప్రకాశ్ 1:52:22 నిమిషాల్లో పూర్తిచేసి నాలుగో స్థానంలో నిలిచాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
మరో మూడు రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ తన టీమ్ను వెల్లడించాడు. -
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
David Warner: దిల్లీ ఆటగాడు డేవిడ్ వార్నర్.. భారత గుర్తింపు కార్డు ఆధార్ కోసం పరిగెడుతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో అతడు హిందీలో మాట్లాడటం విశేషం. -
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
సెంచరీతో చెన్నైపై భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో లఖ్నవూ బ్యాటర్ స్టాయినిస్ కీలక పాత్ర పోషించాడు. ఒకదశలో ఓడిపోతామని భావించిన ఆ జట్టును చివరి వరకూ క్రీజ్లో ఉండి విజయతీరాలకు చేర్చాడు. -
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
చెన్నై కెప్టెన్ రుతురాజ్ సెంచరీతో అలరించినా.. లఖ్నవూ జట్టే విజయం సాధించింది. మార్కస్ స్టాయినిస్ కీలకమైన శతకంతో తన జట్టును గెలిపించాడు. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు