కుర్రాళ్ల సమరభేరీ.. గబ్బర్సేన కదనోత్సాహం!
ఇటు వైపు కొత్త ముఖాలతో కళకళాడుతున్న టీమ్ఇండియా. అటువైపు అనుభవజ్ఞులను కోల్పోయిన శ్రీలంక. ఐపీఎల్ అనుభవాన్ని అంతర్జాతీయ వేదికపై చాటేందుకు తపన పడుతున్న భారత కుర్రాళ్లు ఇటు....
శ్రీలంక పోరుకు సిద్ధమైన టీమ్ఇండియా
ఇటు వైపు కొత్త ముఖాలతో కళకళాడుతున్న టీమ్ఇండియా. అటువైపు అనుభవజ్ఞులు లేని శ్రీలంక. ఐపీఎల్ అనుభవాన్ని అంతర్జాతీయ వేదికపై చాటేందుకు తపన పడుతున్న భారత కుర్రాళ్లు ఇటు. ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాజయం పాలై కరోనాతో డస్సిపోయిన లంకేయులు అటు. ఆదివారమే ఈ రెండు జట్ల మధ్య తొలి వన్డే సమరం. మరి గెలిచేదెవరు? ఎవరి పరిస్థితి ఏంటి?
పేలవ స్థితిలో లంక
సొంతగడ్డపై సిరీసులు జరుగుతున్నా ఒక్క మ్యాచైనా గెలవలేని పరిస్థితుల్లో ఉంది శ్రీలంక. ఒకప్పుడు మహామహులతో నిండిన ఆ జట్టు ఇప్పుడు బలహీనంగా మారిపోయింది. క్రమశిక్షణ కరవైంది. ఏకాగ్రత చెదిరిపోయింది. సమష్టితత్వం కొరవడింది. ఈ సిరీసుకు సారథ్యం వహిస్తున్న దసున శనక ఈ నాలుగేళ్లలో పదో సారథి. ధనంజయ డిసిల్వా, దిష్మంత చమీరా ఆడే పరిస్థితి లేదు. ఇంగ్లాండ్లో బుడగ వీడిన కుశాల్ మెండిస్, నిరోషన్ డిక్వెలా సస్పెండ్ అయ్యారు. మాజీ సారథి కుశాల్ పెరీరా గాయపడ్డాడు. కరోనా కేసులు బయటపడటంతో ఇంగ్లాండ్ నుంచి తిరిగి రాగానే జట్టంతా ఐసోలేషన్కు వెళ్లింది. అందుకే 3టీ20, 3వన్డేల్లో ఒక్కటి గెలిచినా గొప్పే అంటున్నారు విశ్లేషకులు.
4,5,6 ఎవరెవరో
మరోవైపు గబ్బర్ సారథ్యంలోని టీమ్ఇండియా ఉరకలేస్తోంది. విజయ్ హజారేలో పరుగుల వరద పారించిన పృథ్వీషా.. ధావన్తో ఓపెనింగ్ చేయడం ఖాయమే. హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్ ఎలాగూ ఉండేవారే. ఐతే 3, 4, 5 స్థానాల్లో ఎవరిని ఆడిస్తారనేదే తలనొప్పిగా మారింది! దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, నితీశ్ రాణా ఓపెనింగే కాకుండా వన్డౌన్లోనూ రాణించగలరు. మరి ఎవరిని ఎంచుకుంటారన్నది చూడాలి. ఐపీఎల్ అనుభవం, ఫామ్ ప్రకారం చూస్తే 360 డిగ్రీల్లో ఆడే సూర్యకుమార్కు చోటు దక్కాలి. అతడితో మనీశ్ పాండే నాలుగో స్థానానికి పోటీ పడుతున్నాడు.
కిషన్ × సంజు
అదరగొట్టే ఆటగాళ్లు ఎక్కువ మంది ఉండటంతో కోచ్ ద్రవిడ్ జట్టుకు సమతూకం ఎలా తీసుకొస్తారనేది ఆసక్తికరం. ఎందుకంటే సంజు శాంసన్, ఇషాన్ కిషన్.. ఇద్దరూ కీపింగ్లో మెరికలే. బ్యాటింగ్లోనూ దూకుడెక్కువ. అనుభవం ప్రకారం సంజుకు అవకాశం దొరకొచ్చు. వీరిద్దరూ ఐపీఎల్లో మూడో స్థానంలోనే వస్తుండటం గమనార్హం. ఆల్రౌండర్ల కోటాలో కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్య పోటీ పడుతున్నారు. ఫామ్లో లేని యుజ్వేంద్ర చాహల్తో పోలిస్తే రాహుల్ చాహర్కే అవకాశాలు ఎక్కువ. కుల్దీప్ పరిస్థితీ అర్థం కావడం లేదు. పొట్టి క్రికెట్లో మిస్టరీ స్పిన్తో ఆకట్టుకుంటున్న వరుణ్ చక్రవర్తికి చోటిచ్చినా ఆశ్చర్యం లేదు.
ప్రపంచకప్ ప్రామాణికం
టీమ్ఇండియాలో అందరూ చోటుకు అర్హులే అన్నట్టుగా పోటీ పడుతున్నారు. అందుకే ఇది రెండో శ్రేణి జట్టులా కనిపించడం లేదు. ధావన్, షా, పాండే, సూర్య, హార్దిక్, కృనాల్, భువీ, దీపక్ చాహర్, యూజీ, కుల్దీప్కు అంతర్జాతీయ అనుభవం బాగానే ఉంది. ఐతే టీ20 ప్రపంచకప్ను బట్టి శ్రీలంకతో పోటీపడే జట్టు ఉంటుందని సమాచారం. ద్రవిడ్, ధావన్.. రవిశాస్త్రి, కోహ్లీతో ఈ విషయంపై చర్చించే ఉంటారని వినికిడి. ఈ సమీకరణం ప్రకారం కొత్త కుర్రాళ్లందరూ అరంగేట్రం చేయడం కష్టమే. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, ఎడమచేతి వాటం పేసర్ చేతన్ సకారియా పొట్టి క్రికెట్లో అడుగుపెట్టడం ఖాయమే అనిపిస్తోంది. 2019 వన్డే ప్రపంచకప్ వరకు అదరగొట్టిన కుల్చా జోడీకి శ్రీలంకలో ఎదురీత తప్పకపోవచ్చు. సారథ్యం వహిస్తున్నా టీ20 ప్రపంచకప్లో ధావన్ చోటుపై సందిగ్ధమే నెలకొనడం గమనార్హం.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం