INDvsENG: భారత్ చేసినట్టే మేం చేస్తే.. వాళ్లకు అభ్యంతరం ఉండదనుకుంటా..
టీమ్ఇండియాతో జరగబోయే ఐదు టెస్టుల సిరీస్లో ఇంగ్లాండ్.. క్రికెట్ పిచ్లను తమకు అనుకూలంగా తయారుచేసినా ‘కోహ్లీసేన’ అభ్యంతరం వ్యక్తం చేయదని సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ అన్నాడు...
నాటింగ్హామ్: టీమ్ఇండియాతో జరగబోయే ఐదు టెస్టుల సిరీస్లో ఇంగ్లాండ్.. క్రికెట్ పిచ్లను తమకు అనుకూలంగా తయారుచేసినా ‘కోహ్లీసేన’ అభ్యంతరం వ్యక్తం చేయదని సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ అన్నాడు. తాజాగా అతడు మీడియాతో ముచ్చటించిన సందర్భంగా ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత ఫిబ్రవరి, మార్చిలో ఇంగ్లాండ్ జట్టు భారత పర్యటనకు వచ్చినప్పుడు స్పిన్ ఫ్రెండ్లీ పిచ్లు తయారుచేశారని, దాంతో తాము ఆతిథ్య జట్టు ఉచ్చులో పడిపోయామని ఇంగ్లాండ్ పేసర్ అభిప్రాయపడ్డాడు. అదే వరుసలో ఇప్పుడు తాము కూడా హోమ్ అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటున్నట్లు ఆశాభావం వ్యక్తంచేశాడు.
ప్రపంచంలో ప్రతి జట్టూ తమకు అనుకూలంగా ఉండే పిచ్లు తయారు చేయించుకుంటుందని, అది తప్పు కాదని అండర్సన్ అన్నాడు. ఈ క్రమంలోనే రాబోయే టెస్టు సిరీస్లో పిచ్లపై పచ్చిక ఉన్నా భారత జట్టూ తమ పేస్దళంతో బరిలోకి దిగాలని సూచించాడు. దాంతో ఈ పిచ్లను పేస్, బౌన్స్కు అనుకూలంగా ఉండేలా కావాలనుకుంటున్నట్లు తెలిపాడు. అనంతరం ఐపీఎల్పై స్పందించిన ఇంగ్లాండ్ పేసర్.. తన కెరీర్లో ఎంతో మంది యువ ఆటగాళ్లను చూశానని, ముఖ్యంగా ఐపీఎల్లో ఆడిన ఆటగాళ్లను చూడటం అద్భుతంగా ఉందన్నాడు. ఆ మెగా టీ20 లీగ్ ద్వారా ఆటగాళ్లలో దూకుడు పెరిగిందన్నాడు. అందుకు టీమ్ఇండియా బ్యాట్స్మన్ రిషభ్పంతే సరైన ఉదాహరణ అని వివరించాడు.
ఈ యువకులు ఎలాంటి ఫార్మాట్లో అయినా, ఎలాంటి షాట్లు అయినా ఆడగలుగుతారని మెచ్చుకున్నాడు. వాటిని చూడటం అద్భుతంగా ఉంటుందని తెలిపాడు. అది బౌలర్లకూ సవాళ్లతో కూడుకున్నదని చెప్పాడు. చివరగా టీమ్ఇండియా ఆటగాళ్లపై స్పందిస్తూ.. ఈ జట్టులో ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దని చెప్పాడు. అందులో ప్రతి ఒక్కరూ బాగా ఆడతారని అండర్సన్ గుర్తుచేశాడు. అందరిలోనూ కెప్టెన్ విరాట్కోహ్లీ వికెట్ ఇంకా ప్రత్యేకమని తెలిపాడు. అతడు జట్టుపై ప్రభావం చూపుతాడన్నాడు. అలాగే పుజారా కూడా క్రీజులో పాతుకుపోతే వికెట్ తీయడం కష్టమని అంచనా వేశాడు. దాంతో టీమ్ఇండియా జట్టులో ఎవరినీ తక్కువ చేయొద్దని వివరించాడు. ఎవరికి వారు భిన్నమైన ఆటగాళ్లని, ప్రతి ఒక్కరి పట్ల ప్రణాళికలు రూపొందించి మరీ వికెట్లు తీయాలన్నాడు. కాగా, అండర్సన్ ఇప్పటివరకు 162 టెస్టులాడి 617 వికెట్లు తీశాడు. దీంతో ఈ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు సాధించిన ఫాస్ట్ బౌలర్గా ప్రత్యేక గుర్తింపు సాధించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!