INDvsENG: ఇంగ్లాండ్ పనిపట్టాలంటే.. భారత బౌలర్లకు ఆ టెక్నిక్ చాలు
టీమ్ఇండియాతో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ సరిగా ఆడలేదని ఆ జట్టు మాజీ సారథి జియోఫ్రే బాయ్కాట్ ఆగ్రహం వ్యక్తం చేశాడు...
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియాతో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ సరిగా ఆడలేదని ఆ జట్టు మాజీ సారథి బాయ్కాట్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తొలి టెస్టులో కెప్టెన్ జో రూట్ (64, 109) మినహా మిగతా ఆటగాళ్లెవరూ పెద్ద స్కోర్లు సాధించలేదు. దాంతో వారంతా ఓపిక, నైపుణ్యంతో ఆడలేదని మండిపడ్డాడు. భారత బౌలర్లు ఊరించే బంతులేయడంతో విఫలమయ్యారని దుయ్యబట్టాడు. కొందరు బ్యాట్స్మెన్ ఆడాల్సిన బంతులు కాకపోయినా వాటిని వెంటాడి ఔటయ్యారని విమర్శించాడు.
‘నేను తాజాగా ఇంగ్లాండ్ కోచ్ గ్రాహమ్గూచ్తో అనుకోకుండా మాట్లాడా. అప్పుడు మా మధ్య ఇంగ్లాండ్ బ్యాటింగ్పై చర్చ జరిగింది. అతనేమంటాడంటే.. భారత బౌలర్లు నాలుగు బంతులు ఆడలేకుండా కట్టుదిట్టంగా వేసి ఒత్తిడి పెంచితే తర్వాత మన (ఇంగ్లాండ్) బ్యాట్స్మెన్ ఐదు లేదా ఆరో బంతిని దంచికొట్టాలని చూస్తారు. దాంతో వారు ఔటవ్వడానికి అవకాశాలు మెండుగా ఉంటాయని చెప్పాడు’ అని ఓ అంతర్జాతీయ పత్రికా కథనంలో పేర్కొన్నాడు. ఇప్పటి కాలంలో క్రికెట్ పద్ధతి మారిందని, చాలా మంది బ్యాట్స్మెన్కు షాట్లు ఆడటమే ఇష్టమని చెప్పాడు. అది కూడా వన్డే క్రికెట్కు తగ్గ డైట్ తీసుకోవడం వల్లేనని బాయ్కాట్ అభిప్రాయపడ్డాడు.
ప్రస్తుతం అంతా పరిమిత ఓవర్ల క్రికెట్పైనే దృష్టిసారిస్తున్నారని, దాంతో టెస్టుల్లో డిఫెండింగ్ చేయలేకపోతున్నారని బాయ్కాట్ అన్నాడు. వన్డేల్లో, టీ20ల్లో స్ట్రైక్రేట్నే చూస్తారని, అది టెస్టుల్లో పనికిరాదని తెలిపాడు. సుదీర్ఘ ఫార్మాట్ క్రికెట్లో డిఫెండింగ్ బ్యాటింగ్ చేయకపోతే బౌలర్లు కొత్త బంతితో ఆయా బ్యాట్స్మెన్ను ఔట్ చేసే విషయాలపై దృష్టిసారిస్తారని చెప్పాడు. దాంతో వారి బలహీనతలు కూడా తెలుస్తాయని చెప్పాడు. ఈ క్రమంలోనే బ్యాట్స్మెన్ క్రీజులో పాతుకుపోకుండా కేవలం షాట్లపైనే ఆధారపడటంలో అర్థమేముందని ఆయన ప్రశ్నించాడు. కాగా, తొలి టెస్టులో టీమ్ఇండియా గెలిచినంత పనిచేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 183 పరుగులకే ఆలౌటవ్వగా తర్వాత భారత్ 278 పరుగులు చేసింది. దాంతో 95 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో 303 పరుగులు చేయగా భారత లక్ష్యం 209 పరుగులుగా నమోదైంది. అయితే, ఐదో రోజు వర్షం కురవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. అంతకుముందు రెండో ఇన్నింగ్స్లో భారత్ 52/1తో విజయబాటలో నిలిచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్