INDvsENG: రాహుల్ కళాత్మక ఇన్నింగ్స్.. భారీ స్కోర్పై కన్నేసిన భారత్
ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా భారీ స్కోర్పై కన్నేసింది. తొలిరోజు ఆట పూర్తయ్యే సమయానికి 3 వికెట్లు నష్టపోయి 276 పరుగులు చేసింది. తొలి టెస్టులో శతకం కోల్పోయిన కేఎల్ రాహుల్ (127; 248 బంతుల్లో 12x4, 1x6) ఈ మ్యాచ్లో దాన్ని అందిపుచ్చుకున్నాడు.
రాణించిన రోహిత్ శర్మ, విరాట్కోహ్లీ..
లండన్: ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా భారీ స్కోర్పై కన్నేసింది. తొలిరోజు ఆట పూర్తయ్యే సమయానికి 3 వికెట్లు నష్టపోయి 276 పరుగులు చేసింది. తొలి టెస్టులో శతకం కోల్పోయిన కేఎల్ రాహుల్ (127; 248 బంతుల్లో 12x4, 1x6) ఈ మ్యాచ్లో దాన్ని అందిపుచ్చుకున్నాడు. దాంతో ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో శతకం బాదిన మూడో భారత ఓపెనర్గా కొత్త రికార్డు నెలకొల్పాడు. మరోవైపు ఓపెనర్ రోహిత్ శర్మ(83; 145 బంతుల్లో 11x4, 1x6), కెప్టెన్ విరాట్ కోహ్లీ(42; 103 బంతుల్లో 3x4) రాణించడంతో భారత్ భారీస్కోర్ దిశగా సాగుతోంది. ఇక ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ రోహిత్, పుజారా(9)ను ఔట్ చేసి రెండు వికెట్లు దక్కించుకున్నాడు.
బలమైన పునాది..
తొలుత టాస్ఓడి బ్యాటింగ్కు దిగిన టీమ్ఇండియా శుభారంభం చేసింది. ఓపెనర్లు రోహిత్, రాహుల్ తొలిసెషన్లో నెమ్మదిగా ఆడి 46 పరుగులు చేశారు. ఈ క్రమంలోనే 18.4 ఓవర్ల వద్ద వర్షం కురవడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. అదే సమయంలో అంపైర్లు కాస్తముందుగా భోజన విరామం ప్రకటించారు. అప్పటికి జట్టు స్కోర్ 46/0గా నమోదైంది. అనంతరం వర్షం తగ్గడంతో రెండో సెషన్ ప్రారంభమైంది. ఈ సెషన్లో రోహిత్ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించగా, రాహుల్ అతడికి సహకరిస్తూ నెమ్మదిగా ఆడాడు. దాంతో రోహిత్ వడివడిగా పరుగులు చేస్తూ శతకం దిశగా సాగాడు. అయితే జట్టు స్కోర్ 126 పరుగుల వద్ద అండర్సన్ బౌలింగ్లో బౌల్డయ్యాడు. కాసేపటికే వన్డౌన్ బ్యాట్స్మన్ చెతేశ్వర్ పుజారా(9) అతడి బౌలింగ్లోనే స్లిప్లో దొరికిపోయాడు. దాంతో టీమ్ఇండియా 150 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. భారత్ 157/2తో నిలిచి రెండో సెషన్ పూర్తిచేసింది.
రాహుల్ శతకం..
ఇక మూడో సెషన్లో మరింత వేగంగా ఆడిన కోహ్లీ, రాహుల్ మూడో వికెట్కు శతక భాగస్వామ్యం నెలకొల్పారు. అదే సమయంలో రాహుల్ శతకం పూర్తిచేసుకున్నాడు. వినో మన్కడ్, రవిశాస్త్రి తర్వాత లార్డ్స్లో సెంచరీ చేసిన మూడో ఓపెనర్గా రాహుల్ ప్రత్యేకత చాటుకున్నాడు. అయితే, విరాట్ కోహ్లీ అర్ధశతకానికి చేరువైన వేళ రాబిన్సన్ బౌలింగ్లో స్లిప్లో జోరూట్ చేతికి చిక్కాడు. అప్పటికి జట్టు స్కోర్ 267/3గా నమోదైంది. చివరికి అజింక్య రహానె(1), రాహుల్(127) నాటౌట్గా నిలిచి తొలి రోజును ముగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
పంజాబ్పై 9 పరుగుల తేడాతో ముంబయి గెలిచింది. కానీ, ఆ జట్టుకు అంపైర్లు మద్దతుగా నిలిచారనే ఆరోపణలు వస్తున్నాయి. -
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
క్రికెటర్లు తాము కొట్టే షాట్.. లేదా తీసే వికెట్ జీవితాంతం మరిచిపోకుండా ఉంటారు. అలాంటి అనుభవం పంజాబ్ బ్యాటర్ అశుతోష్ శర్మకూ ఎదురైంది. -
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!