Kohli-Pujara: పుజారాను వదిలేయండి.. అతడే చూసుకుంటాడు
టీమ్ఇండియా టెస్టు స్పెషలిస్టు చెతేశ్వర్ పుజారా బ్యాటింగ్పై వస్తున్న విమర్శలకు ముగింపుపలకాలని కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఇంగ్లాండ్తో బుధవారం నుంచి ప్రారంభమయ్యే టెస్టు సిరీస్కు ముందు అతడు మంగళవారం...
నాటింగ్హామ్: టీమ్ఇండియా టెస్టు స్పెషలిస్టు చెతేశ్వర్ పుజారా బ్యాటింగ్పై వస్తున్న విమర్శలకు ముగింపు పలకాలని కెప్టెన్ విరాట్ కోహ్లీ సూచించాడు. ఇంగ్లాండ్తో బుధవారం నుంచి ప్రారంభమయ్యే టెస్టు సిరీస్కు ముందు అతడు మంగళవారం మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా పుజారా బ్యాటింగ్పై వస్తున్న విమర్శల నేపథ్యంలో కోహ్లీ ఈ వ్యాఖ్యలు చేశాడు. పుజారాను వదిలేయాలని, అతడి లాంటి అనుభవజ్ఞులు వారంతట వారే మెరుగవుతారని అండగా నిలిచాడు.
ఈ విషయంపై చాలా రోజులుగా చర్చ నడుస్తోందని, పుజారా లాంటి అనుభవజ్ఞుడిని అలా వదిలేయాలని కెప్టెన్ అభిప్రాయపడ్డాడు. పుజారా నైపుణ్యం కలిగిన ఆటగాడని, జట్టులో ఎలా ఆడాలో అతడికి బాగా తెలుసని చెప్పాడు. అలాగే టీమ్ఇండియా జట్టులోనూ ప్రతి ఒక్కరికీ తాము ఏం చేయాలనేది స్పష్టమైన అవగాహన ఉందన్నాడు. దాంతో పుజారాపై వచ్చే విమర్శల గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నాడు. అతడు కూడా ఇలాంటివి బుర్రకు ఎక్కించుకోడని కెప్టెన్ స్పష్టం చేశాడు.
అనంతరం టీమ్ఇండియా ఆల్రౌండర్లపై స్పందించిన విరాట్.. శార్ధూల్ ఠాకూర్పై ప్రశంసలు కురిపించాడు. అతడు బహుముఖ నైపుణ్యాలున్న క్రికెటర్ అని, మరిన్ని అవకాశాలొచ్చి ఆత్మవిశ్వాసం పెంచుకోగలిగితే చాలని అన్నాడు. అతడిలాంటి ఆటగాడు జట్టుకు సమతూకం తేగలడన్నాడు. మరోవైపు ఇంతకుముందు హార్దిక్ పాండ్య టీమ్ఇండియాలో ఆ పాత్రను చక్కగా నిర్వర్తించాడని, ఇప్పుడిప్పుడే తన బౌలింగ్తో మళ్లీ ఫామ్లోకి వస్తున్నాడని కెప్టెన్ గుర్తుచేశాడు. ఇలాంటి ఆటగాళ్లు జట్టుకు ఉపయోగపడతారని తెలిపాడు. శార్ధూల్ కేవలం ఈ ఒక్క సిరీస్కే కాదని, మున్ముందు ఇంకా కీలక ఆటగాడిగా ఎదుగుతాడని విరాట్ ఆశాభావం వ్యక్తం చేశాడు.మరోవైపు 2018 ఇంగ్లాండ్ పర్యటనలో 1-4 తేడాతో ఓటమిపాలైన టీమ్ఇండియా ఈసారి బాగా సన్నద్ధమైందని చెప్పాడు. అప్పుడు అనుభవం లేక సరిగ్గా ఆడలేకపోయామన్నాడు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు తమ ఆటగాళ్లు మెరుగయ్యాడని కెప్టెన్ వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!