IPL 2021: చాహల్.. ఇప్పుడు కోహ్లీని అడగొచ్చు: అజయ్ జడేజా
రాబోయే టీ20 ప్రపంచకప్లో తనని ఎందుకు ఎంపిక చేయలేదని టీమ్ఇండియా స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ ఇప్పుడు కెప్టెన్ విరాట్ కోహ్లీని అడగొచ్చని మాజీ క్రికెటర్ అజయ్ జడేజా అన్నాడు...
ఇంటర్నెట్డెస్క్: రాబోయే టీ20 ప్రపంచకప్లో తనని ఎందుకు ఎంపిక చేయలేదని టీమ్ఇండియా స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ ఇప్పుడు కెప్టెన్ విరాట్ కోహ్లీని అడగొచ్చని మాజీ క్రికెటర్ అజయ్ జడేజా అన్నాడు. ఆదివారం రాత్రి పంజాబ్తో జరిగిన మ్యాచ్లో చాహల్ మూడు కీలక వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఓ క్రీడా ఛానల్తో మాట్లాడిన జడేజా తన అభిప్రాయాలు వెల్లడించాడు.
‘కీలక మ్యాచ్ల్లో చాహల్ నైపుణ్యాలు, మానసిక పరిపక్వత తెరమీదకు వస్తాయి. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో అతడు ఒక్క ఓవర్లో ఆటను మలుపుతిప్పాడు. అతడు మయాంక్ అగర్వాల్ని ఔట్ చేశాక ఇతర బ్యాట్స్మెన్పై మానసికంగా ప్రభావం చూపాడు. ఇప్పుడిక కెప్టెన్ విరాట్ కోహ్లీని టీ20 ప్రపంచకప్ జట్టులో నుంచి తనని ఎందుకు తొలగించారని కచ్చితంగా అడగొచ్చు. ఇదివరకు అతడి ప్రదర్శన సరిగ్గా లేకపోవడంతో ఆ అవకాశం లేకపోయింది’ అని జడేజా వివరించాడు.
కాగా, చాహల్ ఈ ఐపీఎల్ సీజన్లో భారత్లో ఆడిన తొలి దశలో ఏమాత్రం రాణించలేదు. అంతకుముందు కూడా టీమ్ఇండియా జట్టులో సరైన ప్రదర్శన చేయలేకపోయాడు. దీంతో టీ20 ప్రపంచకప్ టోర్నీకి సెలెక్టర్లు అతడిని ఎంపిక చేయలేదు. ఈ క్రమంలోనే యూఏఈలో జరుగుతున్న రెండో దశలో కీలక వికెట్లు తీసి ఆకట్టుకుంటున్నాడు. తొలి దశలో ఆడిన ఏడు మ్యాచ్ల్లో నాలుగు వికెట్లే తీసిన అతడు ఇప్పుడు ఐదు మ్యాచ్ల్లో పది వికెట్లతో దూసుకుపోతున్నాడు. ఒకవేళ మిగిలిన మ్యాచ్ల్లోనూ చాహల్ ఇలాగే రాణిస్తే టీ20 ప్రపంచకప్లో (అక్టోబర్ 15 వరకు ఆటగాళ్ల మార్పులు చేసుకునే వీలుంది) చోటు దక్కించుకునే అవకాశం లేకపోలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా నేతల సిఫార్సులతో పోస్టు.. మహిళా ఉద్యోగినులతో వెకిలి చేష్టలు
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి