IPL 2021: మేం ఏం చేయాలనేదానిపై దృష్టి సారించాలి: ధోనీ
చెన్నై సూపర్ కింగ్స్ లీగ్ దశను పూర్తి చేసుకుంది. గురువారం పంజాబ్ చేతిలోనూ ఓటమిపాలై రెండో స్థానంలో ప్లేఆఫ్స్కు చేరింది. అయితే, ఇప్పుడు వరుసగా మూడు మ్యాచ్లు ఓటమిపాలవ్వడమే...
ఇంటర్నెట్డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్ లీగ్ దశను పూర్తి చేసుకుంది. గురువారం పంజాబ్ చేతిలోనూ ఓటమిపాలై రెండో స్థానంలో ప్లేఆఫ్స్కు చేరింది. అయితే, ఇప్పుడు వరుసగా మూడు మ్యాచ్లు ఓటమిపాలవ్వడమే ఆ జట్టును కాస్త కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ధోనీ మాట్లాడుతూ వాస్తవాలను అర్థం చేసుకొని మెలగాలని చెప్పాడు.
‘ఈ ఓటములను స్వీకరించి ముందుకు సాగాలి. అది మానసికంగా అయినా లేదా నైపుణ్యాల పరంగానైనా అర్థం చేసుకొని వెళ్లాలి. మేం ప్లేఆఫ్స్ చేరడానికి బాగా కష్టపడ్డాం. అయితే, ఈ రెండు మూడు మ్యాచ్ల్లో విఫలమయ్యాం. అందులో ఒకటి గెలుస్తామనుకున్నా కుదరలేదు. ఇలాంటి లీగుల్లో ఇవన్నీ సహజమే. ఏదైమైనా మనం విజయం సాధించాలంటే అత్యుత్తమ ప్రదర్శన చేయాలి. అయితే, మా ఓటములకు పట్టుదల లేకపోవడం అనేది కారణం కాదు. మా ఆటగాళ్లంతా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. మేం ఏం చేయాలనేదానిపై కాస్త దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. మరోవైపు కొన్నిసార్లు టాస్ కూడా మాకు కలిసిరాలేదు. ఇది కాస్త కఠినమైన పిచ్. కానీ మొత్తంగా చూస్తే ఫర్వాలేదని చెప్పొచ్చు’ అని ధోనీ వివరించాడు.
ఇలాగే పెరిగాను.. ఇలాగే ఆడతా: రాహుల్
ఇక మ్యాచ్ గెలిచాక పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మాట్లాడుతూ తాము 14 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేయాలనుకున్నట్లు చెప్పాడు. అందువల్లే తాను ఆది నుంచే భారీ షాట్లు ఆడాలనుకున్నట్లు తెలిపాడు. ‘ఈరోజు మా ప్రణాళిక చాలా సింపుల్. ఈ మ్యాచ్ను 14 ఓవర్లలోనే పూర్తి చేస్తే మంచి అవకాశాలున్నాయని చెప్పారు. దీంతో నేను తొలి బంతి నుంచే ధాటిగా ఆడాలని నిర్ణయించుకున్నా. ఇక నా బ్యాటింగ్లో ఫేవరెట్ షాట్ అంటే హేజిల్వుడ్ బౌలింగ్లో స్క్వేర్లెగ్ మీదుగా కొట్టిన సిక్సర్. అలాంటి పుల్షాట్ ఆడాలంటే నాకెంతో ఇష్టం. ఇక నా బ్యాటింగ్ గురించి మాట్లాడితే జట్టుకు అవసరమైన రీతిలోనే ఆడాలనుకుంటా. గత మూడు నాలుగేళ్లుగా నా బ్యాటింగ్పై అనేక మాటలు వినిపిస్తున్నాయి. అయితే, నేనెలా ఆడుతున్నాననేది నాకు, మా ఫ్రాంఛైజీకి తెలుసు. జట్టుకు అవసరమైన రీతిలోనే నేను బ్యాటింగ్ చేస్తా. నాకెప్పుడూ జట్టే మొదటి ప్రాధాన్యం. నేను ఇలాగే పెరిగాను. ఇలాగే ఆడతాను. ఈరోజు జట్టుకు అవసరమైన రీతిలో ఆడినందుకు సంతోషంగా ఉంది’ అని రాహుల్ వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
బెంగళూరు - కోల్కతా జట్ల మధ్య ఆసక్తికర పోరు నేడు. ఇరు జట్లలోనూ కీలక ఆటగాళ్లు ఉన్నారు. -
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
బెంగళూరు, కోల్కతా జట్ల మధ్య మ్యాచ్ నేపథ్యంలో అందరి దృష్టి ఇద్దరి క్రికెటర్లపైనే ఉంది. -
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
ధోనీతో తనకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా గుర్తు చేసుకున్నాడు. -
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ