IPL 2021: సోషల్ మీడియాలో చెత్తవాగుడు వాగకండి: మాక్స్వెల్ సీరియస్
ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి విఫలమవ్వడంపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ట్రోలింగ్ను చూసి ఆ జట్టు ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు...
ఇంటర్నెట్డెస్క్: ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి విఫలమవ్వడంపై సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న ట్రోలింగ్ను చూసి ఆ జట్టు ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. నెటిజెన్లు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మర్యాదగా ప్రవర్తించాలని సూచించాడు. సోమవారం రాత్రి జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో బెంగళూరు .. కోల్కతా చేతిలో 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కోహ్లీసేనను ఉద్దేశిస్తూ పలువురు నెటిజెన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. దీంతో మాక్సీ ట్విటర్ వేదికగా స్పందిస్తూ ఒక పోస్టు పెట్టాడు.
‘ఈ సీజన్లో మేం బాగా ఆడినా దురదృష్టంకొద్దీ కీలక మ్యాచ్లో ఓడిపోయాం. అనుకున్నదానికి చేరువగా వచ్చి త్రుటిలో అవకాశాన్ని కోల్పోయాం. ఇదో గొప్ప సీజన్. అయితే, సామాజిక మాధ్యమాల్లో చెత్తవాగుడు తీవ్రంగా కలచివేసింది. మేం కూడా మనుషులమే. ప్రతి మ్యాచ్లో అత్యుత్తమ ప్రదర్శన చేయడానికే ప్రయత్నిస్తాం. అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు. మర్యాదగా ప్రవర్తించండి. అలాగే మాకు అండగా నిలిచి ఎల్లవేళలా ప్రేమాభిమానాలు కురిపించిన నిజమైన ఆర్సీబీ అభిమానులకు ధన్యవాదాలు. కానీ, కొంత మంది సామాజిక మాధ్యమాలను అసహ్యంగా మారుస్తున్నారు. ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. మీరూ వాళ్లలా ఉండకండి’ అని మాక్స్వెల్ వాపోయాడు.
గతేడాది పంజాబ్ తరఫున ఆడిన మాక్స్వెల్ 13 మ్యాచ్ల్లో కేవలం 108 పరుగులే చేసి పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో అతడిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈసారి వేలంలో భారీ ధర వెచ్చించి మరీ కొనుగోలు చేసింది. ఆ జట్టు నమ్మకాన్ని నిలబెడుతూ మాక్స్వెల్ ఈ సీజన్లో రెచ్చిపోయాడు. ఆడిన 15 మ్యాచ్ల్లో ఆరు అర్ధశతకాలతో 513 పరుగులు సాధించి ఆర్సీబీ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేశాడు. అలాగే టాప్ బ్యాట్స్మెన్లో ఐదో స్థానంలో నిలిచాడు. అంత బాగా ఆడిన ఈ ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కోల్కతాతో జరిగిన కీలకపోరులో విఫలమయ్యాడు. 15 పరుగులే చేసి నిరాశపర్చాడు. మరోవైపు ఇతర బ్యాట్స్మెన్ కూడా పరుగులు చేయలేకపోవడంతో ఆర్సీబీ 138/7 తక్కువ స్కోరే సాధించింది. అనంతరం కోల్కతా ఆ లక్ష్యాన్ని ఛేదించింది. ఈ నేపథ్యంలోనే సామాజిక మాధ్యమాల్లో ఆర్సీబీపై, మాక్స్వెల్పై విమర్శలు వచ్చాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్