IPL 2021: నితీశ్‌ రాణా ఫోర్‌ కొడితే.. కెమెరా లెన్స్‌ పగిలిపోయింది

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ బ్యాట్స్‌మన్‌ నితీశ్‌ రాణా కొట్టిన షాట్‌కు మైదానంలోని బౌండరీ లైన్‌ అవతల ఉన్న కెమెరా లెన్స్ బద్దలైంది. ఈ సంఘటన ఆదివారం రాత్రి సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చోటుచేసుకుంది...

Published : 05 Oct 2021 01:26 IST

(Photo: Nitish Rana Instagram)

ఇంటర్నెట్‌డెస్క్‌: కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ బ్యాట్స్‌మన్‌ నితీశ్‌ రాణా కొట్టిన షాట్‌కు మైదానంలోని బౌండరీ లైన్‌ అవతల ఉన్న కెమెరా లెన్స్ బద్దలైంది. ఈ సంఘటన ఆదివారం రాత్రి సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సమాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. కోల్‌కతా ఛేదనలో హోల్డర్‌ వేసిన 17.4 ఓవర్‌కు రాణా డీప్‌ మిడ్‌-వికెట్‌లో ఒక ఫోర్‌ కొట్టాడు. ఆ బంతి కాస్తా బౌండరీ లైన్‌ అవతల ఉన్న కెమెరాకు తగలడంతో లెన్స్‌ పగిలిపోయింది. ఆ బంతిని రషీద్‌ఖాన్‌ ఆపడానికి ప్రయత్నించినా కుదరలేదు.

ఇక ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సన్‌రైజర్స్‌ నిర్ణీత ఓవర్లలో 115/8 స్కోర్‌ చేసింది. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (26), మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ అబ్దుల్‌ సమద్ (25) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. అనంతరం ఛేదనలో కోల్‌కతా నాలుగు వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది. శుభ్‌మన్‌గిల్‌ (57), నితీశ్‌ రాణా (25) రాణించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని